Political News

ఎట్టకేలకు బీజేపీ అభ్యర్థిగా సోము వీర్రాజు ఖరారు

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 5 సీట్లకు ఐదుగురు అభ్యర్థులు ఖరారయ్యారు. ఈ నెలాఖరుకు ఖాళీ కానున్న 5 ఎమ్మెల్సీ సీట్లు… తాజా గణాంకాల ప్రకారం అధికార కూటమికే దక్కనున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ధర్మం పాటించిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు 3 సీట్లను టీడీపీకి కేటాయించి… మిత్రపక్షాలు బీజేపీ, జనసేనలకు చెరో సీటును ఇచ్చారు. టీడీపీ, జనసేన అభ్యర్థులు ఇప్పటికే ఖరారు కాగా… సోమవారం ఉదయం బీజేపీ తన అభ్యర్థిని ఖరారు చేసింది. బీజేపీ ఏపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజును కమల దళం తన అభ్యర్థిగా ప్రకటించింది.

వాస్తవానికి బీజేపీకి దక్కిన ఈ ఒక్క సీటు కోసం చాలా మంది తమ వంతు యత్నాలు చేశారు. సోము వీర్రాజుతో పాటుగా మరో మాజీ ఎమ్మెల్సీ మాధవ్, తపన్ చౌధరి, పాకా సత్యనారాయణలు ఈ సీటు కోసం ముమ్మరంగా యత్నించారు. అయితే ఇప్పటికే ఓ దఫా ఎమ్మెల్సీలుగా వ్యవహరించిన నేపథ్యంలో వీర్రాజు, మాధవ్ ల అభ్యర్థిత్వాలను పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పక్కన పెట్టినట్లుగా వార్తలు వినిపించాయి. అదే సమయంలో మొన్నటి ఎన్నికల్లో ఎంపీ టికెట్ కోసం యత్నించి… చివరి నిమిషంలో జాబితా నుంచి తప్పుకున్న తపన్ చౌధరికి అవకాశం కల్పిస్తే మంచిదన్న భావన వ్యక్తమైంది. అయితే శెట్టి బలిజల కోటాలో తనకూ అవకాశం కల్పించాల్సిందేనని పాకా సత్యనారాయణ పట్టుబట్టారట. దీంతో పంచాయతీ ఢిల్లీలోని పార్టీ జాతీయ కార్యవర్గం వద్దకు చేరింది.

ఆదివారం రాత్రి దీనిపై బీజేపీ పెద్దలు సుదీర్ఘంగా మంతనాలు సాగించారు. అదే సమయంలో పార్టీకి చెందిన రాష్ట్ర నేతలతోనూ పలుమార్లు చర్చలు జరిపారు. తపన చౌధరి, పాకా సత్యనారాయణలు ఒకరికి ఒకరు తగ్గకపోవడంతో వారిద్దరి అభ్యర్థిత్వాలను పక్కనపెట్టిన అధిష్ఠానం… పార్టీలో సీనియర్ మోస్ట్ నేతగా ఉన్న వీర్రాజుకే మరోమారు అవకాశం కల్పిద్దామన్న భావనకు వచ్చింది. ఇదే విషయాన్ని పార్టీ రాష్ట్ర శాఖ నేతలకు సమాచారం చేరవేసి… వారి అభిప్రాయాలు కూడా తీసుకున్నాక… సోమావరం ఉదయం వీర్రాజు అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించింది. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా… పొత్తులో భాగంగా టీడీపీ మద్దతులోనే వీర్రాజు ఓ దఫా ఎమ్మెల్సీగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే… జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన నాగబాబు ఇప్పటికే తన నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆదివారం సాయంత్రం టీడీపీ తన అభ్యర్థులుగా కావలి గ్రీష్మ, బీటీ నాయుడు, బీద రవిచంద్రలను ప్రకటించింది. వీరు ఇంకా నామినేషన్లు వేయాల్సి ఉంది. అదే సమయంలో సోమవారం అభ్యర్థిత్వం ఖరారు అయిన వీర్రాజు కూడా నామినేషన్ వేయాల్సి ఉంది. నామినేషన్ల దాఖలుకు సోమవారమే చివరి రోజు కావడంతో… అటు టీడీపీ అభ్యర్థులతో పాటుగా ఇటు బీజేపీ అభ్యర్థి వీర్రాజు కూడా సోమవారం నిర్ణీత వ్యవధిలోగానే నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అసెంబ్లీలో సరిపడినంత బలం లేని కారణంగా వైసీపీ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. దీంతో పోలింగ్ లేకుండానే.. ఈ ఐదుగురు ఎమ్మెల్సీలుగా ఎన్నిక కానున్నారు.

This post was last modified on March 10, 2025 11:23 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే రచ్చే

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…

1 hour ago

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

4 hours ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

5 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

5 hours ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

6 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

14 hours ago