Political News

రంగన్న మృతిపై కేబినెట్ లో సుదీర్ఘ చర్చ

వైసీపీ అధినే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై శుక్రవారం నాటి ఏపీ కేబినెట్ లో సుదీర్ఘ చర్చ జరిగింది. అమరావతిలోని సచివాలంలో సీఎం నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన శుక్రవారం మధ్యాహ్నం తర్వాత ఏపీ కేబినెట్ భేటీ జరిగిన సంగతి తెలిసిందే. కేబినెట్ భేటీలో అజెండా అంశాలపై చర్చ ముగిసిన తర్వాత వివేకా హత్య కేసును స్వయంగా చంద్రబాబే ప్రస్తావించారు. ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న వాచ్ మన్ రంగన్న మృతి చెందడం అనుమానాస్పదంగానే ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ మృతి ముమ్మాటికీ అనుమానాస్పదమేనని కూడా ఆయన అన్నారు.

గత కొంతకాలంగా వయసురీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలో సతమతమవుతున్న రంగన్న బుధవారం ఉన్నట్లుండి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటీన పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా…అక్కడి వైద్యుల సలహా మేరకు కడపలోని రిమ్స్ కు తరలించారు. రిమ్స్ లో చికిత్స పొందుతూ రంగన్న మృతి చెందారు. రంగన్న మృతిపై తనకు అనుమానాలు ఉన్నాయంటూ ఆయన భార్య చెప్పడంతో పోలీసులు కూడా రంగన్నమృతిని అనుమానాస్పదంగా పరిగణిస్తున్నారు. అంతేకాకుండా రంగన్న మృతితో వివేకా హత్య కేసు సాక్షుల మృతులు ఐదుకు చేరుకున్నాయి. ఈ అన్ని మరణాలపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు గురువారం కడప జిల్లా ఎస్పీ ప్రకటించారు.

ఇదిలా ఉంటే… కేబినెట్ భేటీలో రంగన్న మృతిని స్వయంగా చంద్రబాబే ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాకుండా రంగన్నను పోలీసులే చంపేశారని తాము తొలుత అనుకున్నామని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారట. దీంతో అక్కడే ఉన్న డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా… రంగన్న మృతిపై సమగ్ర వివరాలను మంత్రుల ముందు పెట్టారట. చంద్రబాబు అనుమానించినట్లే రంగన్న మృతి అనుమానాస్పదంగానే ఉన్నట్లు తమ విచారణలోనూ తేలిందని కూడా డీజీపీ చెప్పారట. అయినా ఇదేంటీ… వివేకా హత్య కేసులో సాక్షులుగా ఉన్న వారంతా ఇలా వరుసబెట్టి చనిపోతూ ఉంటే… ఇక కేసు నిలబడేదెలా? అని కూడా చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారట. ఇదంతా చూస్తుంటే… వివేకా హత్య కేసు సాక్షుల మరణాల వెనుక మిస్టరీ ఉందన్న అనుమానాలు అంతకంతకూ బలపడుతున్నాయి.

This post was last modified on March 7, 2025 9:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

25 minutes ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

9 hours ago