Political News

బీజేపీ దూకుడు.. దీని ప‌ర‌మార్థ‌మేమి?!

తెలంగాణ‌లో బీజేపీ దూకుడు పెరిగిందా? ఆ పార్టీ పుంజుకుంటోందా? అంటే.. తాజాగా జ‌రిగిన‌ మూడు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ క‌మ‌ల నాథుల వికాసాన్ని బ‌ట్టి ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా మూడు ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. వీటిలో ఒక‌టి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం అయితే.. రెండు ఉపాధ్యాయ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్సీల స్థానాలు ఉన్నాయి. వీటిని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న అధికార పార్టీ కాంగ్రెస్‌.. పుంజుకునే ప్ర‌య‌త్నాలు చేసింది. విజ‌యం ద‌క్కించుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి కూడా రంగంలోకి దిగి ప్ర‌చారం చేశారు. అయితే.. అనూహ్యంగా బీజేపీ ఈమూడు స్థానాల‌ను కైవసం చేసుకుంది.

వరంగల్-నల్గొండ- ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి, కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ టీచ‌ర్ ఎమ్మెల్సీ స్థానానికి అదేవిధంగా ఇదే ప్రాంతాల్లో ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి గ‌త నెల 27న ఎన్నిక‌లు జ‌రిగాయి. వీటి ఓట్ల లెక్కిం పు ప్ర‌క్రియ జోరుగా సాగింది. భారీ స్తాయిలో ఓట్ల శాతం న‌మోదైంది. ఇక‌, ఈ ఎన్నిక‌ల‌ను కాంగ్రెస్‌, బీజేపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. ఇక‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ మాత్రం ఈ ఎన్నిక‌ల పోటీకి దూరంగా ఉంది. అయితే.. మ‌ధ్య‌లో బీఎస్పీ రంగంలోకి దిగింది. దీంతో ప్ర‌ధాన పోటీ కాంగ్రెస్‌-బీజేపీల మ‌ధ్యే సాగినా.. మ‌ధ్య‌లో బీఎస్పీ ఎంట్రీతో ఓటు బ్యాంకు చీలిపోయిం ద‌న్న వాద‌న వినిపిస్తోంది.

ఇక‌, ప్ర‌చార ప‌ర్వంలో ఎవ‌రూ వెన‌క్కి త‌గ్గ‌కుండా.. వ్య‌వ‌హ‌రించారు. సాధార‌ణ ఎన్నిక‌ల‌ను త‌ల‌పించేలా.. ప్ర‌చారం చేయ‌డంతో పాటు.. తాయిలాల‌కు కూడా కొద‌వ‌లేకుండా పోయింది. ఇక‌, బీజేపీ నుంచి కేంద్ర మంత్రి బండి సంజ‌య్‌, ఇటు సీఎం రేవంత్ స‌హా మంత్రులు దుమ్మురేపారు. రాజ‌కీయ విమ‌ర్శ‌లు, స‌వాళ్లకు ఈ ఎమ్మెల్సీ ఎన్నిక‌లు వేదిక‌గా నిలిచాయి. ఇక‌, ఓటు బ్యాంకు రాజ‌కీయాలు కూడా జోరుగానే సాగాయి. ఇదిలావుంటే..ఎన్నిక‌ల వేళ ఓట్ల శాతం పెరిగిన‌ప్పుడే.. అధికార పార్టీకి బ్యాడ్ సంకేతాలు వ‌చ్చాయి. ఎప్పుడు ఓట్ల శాతం పెరిగినా.. సెంటిమెంటు ప్ర‌కారం.. అది అధికార పార్టీ వ్య‌తిరేక‌త‌గా ముద్ర ప‌డిన విష‌యం తెలిసిందే.

తాజా ఎన్నిక‌ల్లోనూ స‌గ‌టున‌ 70 శాతం ఓటు బ్యాంకు న‌మోదైన నేప‌థ్యంలో ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ఎక్కువ‌గానే ఉంద‌ని అనుకున్నారు. అనుకున్న‌ట్టుగానే.. తాజాగా అందిన తుది ఫ‌లితం కాంగ్రెస్ స‌ర్కారును ఇర‌కాటంలోకి నెట్టింది. మూడు ఎమ్మెల్సీ స్థానాల‌ను బీజేపీ కైవసం చేసుకుంది. కరీంనగర్‌-మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్ టీచ‌ర్‌ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకున్న బీజేపీ.. ఇదే జిల్లాలకు చెందిన గ్రాడ్య‌యేట్ ఎమ్మెల్సీ స్థానాన్నీ సొంతం చేసుకుంది. ఈ ప్ర‌భావం రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పుంజుకుంటున్న‌ద‌న్న సంకేతాలు ఇస్తోంద‌ని క‌మ‌ల నాథులు వ్యాఖ్యానిస్తున్నారు.

This post was last modified on March 6, 2025 11:46 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏ చిన్న అవ‌కాశాన్నీ వ‌ద‌ల‌ట్లేదుగా బాబూ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఏ చిన్న అవ‌కాశాన్నీ వ‌ద‌ల‌ట్లేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. పెట్టుబడుల‌కు ఎక్క‌డ అవ‌కాశం ఉంటే..…

1 hour ago

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

6 hours ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

9 hours ago

సభలోకి దేవుడిని లాగడం కరెక్టేనా?

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో శాస‌న స‌భ‌ను బాయ్‌కాట్ చేసిన వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు శాస‌న మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…

9 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

10 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

10 hours ago