Political News

మీనాక్షి మార్కు!.. 3 వర్గాలుగా టీ కాంగీయులు!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పార్టీలో ఒకింత ఈజీనెస్ కనిపిస్తోంది. కొందరు నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అసలు పార్టీ నియమావళిని పాటిస్తున్న నేతలు చాలా తక్కువ మందే కనిపిస్తున్నారు. వీరిలో పార్టీ సీనియర్లు ఉన్నారు… జూనియర్లూ ఉన్నారు. ఎవరూ ఇందుకు మినహాయింపు కాదు. పాత కాపులు కట్టు దాటుతున్నారు. కొత్త కాపులూ ఇష్టారాజ్యం అంటున్నారు. ఇలాగైతే కుదరదంటూ పార్టీ అధిష్ఠానం అప్పటిదాకా పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీగా ఉన్న దీపా దాస్ మున్షీని తప్పించింది. ఆమె స్థానంలో కరడుగట్టిన కాంగ్రెస్ వాదిగా ఉన్న మీనాక్షి నటరాజన్ ను నియమించింది. వచ్చీ రావడంతోనే ఇక్కడే మకాం వేసిన మీనాక్షి పార్టీలో తనదైన మార్కును చూపుతున్నారు. తాజాగా ఆమె తీసుకున్న ఓ నిర్ణయం అయితే దేశ రాజకీయాల్లో ఎప్పుడూ చూడలేదన్న వాదన వినిపిస్తోంది.

అయినా మీనాక్షి ఏం చేశారన్న విషయానికి వస్తే… పార్టీ రాష్ట్ర శాఖలో ఉన్న అన్ని స్థాయిల నేతలను ఆమె మూడు వర్గాలుగా విభజించారు. ఆది నుంచి పార్టీలో కొనసాగుతున్న నేతలను తొలి వర్గంగా గుర్తించిన మీనాక్షి… వారిని సిసలైన పార్టీ నేతలుగా గుర్తించినట్లు సమాచారం. ఇక రెండో విభాగంలో… 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిని చేర్చారు. వీరిలోనూ ఓ స్థాయి వరకు కేటగరైజేషన్ ను అంతగా పట్టించుకోని మీనాక్షి… జిల్లా స్థాయి, ఎమ్మెల్యే స్థాయి నేతల నుంచి ఆ పై స్థాయి వరకు ఏఏ కారణాలతో ఆయా నేతలు పార్టీలో చేరారన్న వివరాలను నమోదు చేస్తున్నారట. ఇక మూడో విభాగం కింద… పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరత పార్టీల నుంచి వచ్చి చేరిన నేతలను చేర్చారట. ఈ విభాగంలో ఆయా నేతల చేరికలకు గల కారణాలు తదితరాలను కూడా మీనాక్షి నోట్ చేశారట.

నిజమే..మరి ఇలా ఈ తరహాలో పార్టీ నేతలను మూడు వర్గాలుగా కేటాయించిన అదిష్ఠానాన్ని ఏ పార్టీలో..ఎప్పుడూ చూడలేదనే చెప్పాలి. గతంలో ఏం జరిగిందో తనకు తెలియదని.. తన వర్కింగ్ స్టైల్ మాత్రం ఇదేనని తెగేసి చెబుతున్న మీనాక్షి… తాను అనుకున్నట్లుగా ఈ విభాగాల వర్గీకరణను ఇప్పటికే పూర్తి చేసినట్లుగా సమాచారం. అయినా ఇప్పుడు దీని అవసరం ఏమిటంటారా?… పార్టీ అధికారంలో ఉంది కాబట్టి… త్వరలోనే ఖాళీగా నామినేటెడ్ పదవుల భర్తీ చేయాల్సి ఉంది. అలాగే తరచూ జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా స్తానిక సంస్థల ఎన్నికలు వస్తే..ఆయా పదవులకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అంతిమంగా తదుపరి ఎన్నికల్లో సీట్లను కేటాయించాలి. ఇవన్నీ కూడా ఈ విభాగాల వర్గీకరణ ఆధారంగానే జరగనున్నాయట. దీంతో.. ఈ వర్గీకరణ మంత్రంపై పార్టీలో పెద్ద చర్చే నడుస్తోంది.

This post was last modified on March 5, 2025 6:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

32 minutes ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

1 hour ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

2 hours ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

2 hours ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

3 hours ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

4 hours ago