Political News

చంద్రబాబుపై కామెంట్స్ గుర్తు లేవా జగన్?: లోకేశ్

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ సభ్యులు పోడియాన్ని చుట్టుముట్టి రసాభాస చేసిన వైనం విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ ఘటనపై ఈ రోజు శాసనసభలో మంత్రి లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని వైసీపీ సభ్యులు బాధ్యత లేకుండా అడ్డుకొని వాకౌట్ చేశారని లోకేశ్ మండిపడ్డారు. తాము గతంలో బెంచిల దగ్గరే నిరసన వ్యక్తం చేసేవారమని, పోడియం దగ్గరకు రాలేదని, ఎప్పుడు లక్ష్మణ రేఖ దాటలేదని లోకేశ్ అన్నారు.

ఎవరు ఎక్కడ ఉండాలో ఎవరికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలో నిర్ణయించేది ప్రజలని లోకేశ్ చెప్పారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడుపై సాక్షి పత్రికలో తప్పుడు రాతలు రాయడం బాధాకరమని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ పై వ్యక్తిగత ఆరోపణలు సభ పరువును తగ్గిస్తున్నాయని అన్నారు. గతంలో చంద్రబాబుకు 23 మంది సభ్యులు ఉన్నారని, ఐదుగురిని లాగేస్తే ఆయనకు ప్రతిపక్ష హోదా దక్కదని ఇదే సభలో జగన్ చేసిన వ్యాఖ్యలను లోకేశ్ గుర్తు చేశారు. అటువంటప్పుడు 11 మంది సభ్యులున్న జగన్ ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతారని లోకేశ్ నిలదీశారు.

ఇక జగన్ కు ఉప ముఖ్యమంత్రి కంటే ఎక్కువగా జడ్ ప్లస్ సెక్యూరిటీ కేటాయించామని లోకేష్ చెప్పారు. ప్రతిపక్ష హోదాపై వైసీపీ సభ్యులు చేస్తున్న వ్యాఖ్యలపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వాలని లోకేష్ డిమాండ్ చేశారు. ఎవరు అధికారంలో ఉన్నా ఇది కరెక్ట్ కాదని, చట్టసభలో అర్థవంతమైన చర్చలు జరిగితేనే ప్రజలకు మేలు జరుగుతుందని లోకేశ్ చెప్పారు. చిన్నప్పటి నుంచి ఈ సమావేశాలు చూస్తూ పెరిగానని, గతంలో వ్యక్తిగత దూషణలు ఉండేవి కావని లోకేష్ గుర్తు చేసుకున్నారు.

This post was last modified on March 5, 2025 12:21 pm

Share

Recent Posts

అప్పుడే అవ్వగొట్టేసిన క్రిష్?

టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో క్రిష్ ఎన్నడూ రొటీన్ సినిమా…

16 minutes ago

ఎక్స్‌ప్రెస్ దర్శకుడికి హిట్టు దక్కేనా

మంచి టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ దర్శకులు కెరీర్ ప్రారంభంలో హిట్లు అందుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో, కథల ఎంపికలో…

1 hour ago

స్నేహం కోసం… అల్లు అర్జున్ ఆదర్శం!

స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…

2 hours ago

ఒక జడ్జి వ్యాఖ్యలను ఖండించిన మరో జడ్జి

ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…

2 hours ago

బిర్యానీ సంపూ ఏడిపిస్తాడా?

ది ప్యారడైజ్.. దసరా లాంటి రా అండ్ రస్టిక్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో దీనిపై అంచనాలు…

3 hours ago

బరువు తగ్గే ఔషధం వేసుకుంటే జుట్టు ఊడిపోతుంది

అదేంటో గానీ... ఉన్న రోగానికి మందేస్తే... ఆ రోగం సంగతేమో గానీ... కొత్త రోగం వచ్చి పడుతోంది. ఈ తరహా…

3 hours ago