Political News

చంద్రబాబుపై కామెంట్స్ గుర్తు లేవా జగన్?: లోకేశ్

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ సభ్యులు పోడియాన్ని చుట్టుముట్టి రసాభాస చేసిన వైనం విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ ఘటనపై ఈ రోజు శాసనసభలో మంత్రి లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని వైసీపీ సభ్యులు బాధ్యత లేకుండా అడ్డుకొని వాకౌట్ చేశారని లోకేశ్ మండిపడ్డారు. తాము గతంలో బెంచిల దగ్గరే నిరసన వ్యక్తం చేసేవారమని, పోడియం దగ్గరకు రాలేదని, ఎప్పుడు లక్ష్మణ రేఖ దాటలేదని లోకేశ్ అన్నారు.

ఎవరు ఎక్కడ ఉండాలో ఎవరికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలో నిర్ణయించేది ప్రజలని లోకేశ్ చెప్పారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడుపై సాక్షి పత్రికలో తప్పుడు రాతలు రాయడం బాధాకరమని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ పై వ్యక్తిగత ఆరోపణలు సభ పరువును తగ్గిస్తున్నాయని అన్నారు. గతంలో చంద్రబాబుకు 23 మంది సభ్యులు ఉన్నారని, ఐదుగురిని లాగేస్తే ఆయనకు ప్రతిపక్ష హోదా దక్కదని ఇదే సభలో జగన్ చేసిన వ్యాఖ్యలను లోకేశ్ గుర్తు చేశారు. అటువంటప్పుడు 11 మంది సభ్యులున్న జగన్ ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతారని లోకేశ్ నిలదీశారు.

ఇక జగన్ కు ఉప ముఖ్యమంత్రి కంటే ఎక్కువగా జడ్ ప్లస్ సెక్యూరిటీ కేటాయించామని లోకేష్ చెప్పారు. ప్రతిపక్ష హోదాపై వైసీపీ సభ్యులు చేస్తున్న వ్యాఖ్యలపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వాలని లోకేష్ డిమాండ్ చేశారు. ఎవరు అధికారంలో ఉన్నా ఇది కరెక్ట్ కాదని, చట్టసభలో అర్థవంతమైన చర్చలు జరిగితేనే ప్రజలకు మేలు జరుగుతుందని లోకేశ్ చెప్పారు. చిన్నప్పటి నుంచి ఈ సమావేశాలు చూస్తూ పెరిగానని, గతంలో వ్యక్తిగత దూషణలు ఉండేవి కావని లోకేష్ గుర్తు చేసుకున్నారు.

This post was last modified on March 5, 2025 12:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

53 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

2 hours ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

4 hours ago