రాజకీయాల్లో విలువల గురించి ప్రతి ఒక్కరు మాట్లాడేవారే. మాటలకు భిన్నంగా చేతల్లో చూపించే వారు వేళ్ల మీద లెక్కించొచ్చు. ఒకవేళ ఉన్నా.. అత్యుత్తమ స్థానాల్లో ఉండేవారు చాలా తక్కువగా ఉంటారు. ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్. మొదటి పర్యటనలోనే అందరి చూపు ఆమె మీద పడింది. గతంలో రాష్ట్రానికి పార్టీ ఇంఛార్జులుగా ఉన్న వారికి భిన్నంగా సింపుల్ గా ఉండటం.. ట్రైన్ లో హైదరాబాద్ కు చేరుకోవటం.. తనకు స్వాగతం పలుకుతూ హోర్డింగ్ లను పెడితే.. వాటిని తీసేయించటం.. పూలమాలలకు.. సత్కారాలకు.. బహుమానాలకు దూరంగా ఉంటూ ఆమె తరచూ వార్తల్లో వ్యక్తిగా మారుతున్నారు.
ఎందుకంటే.. కాంగ్రెస్ లాంటి పార్టీలో ఈ తరహాలో ఒక నేత ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాజాగా ఆమె ప్రజాస్వామ్య పరిరక్షణలో రాజకీయ పార్టీలు.. ప్రజా ఉద్యమాల పాత్ర అనే అంశంపై వివిధ రాజకీయ పార్టీలతో ప్రతినిధులతో సదస్సు జరిగింది. హైదరాబాద్ లో జరిగిన ఈ సదస్సులో పాల్గొన్న ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఒక విధంగా రేవంత్ సర్కారుకు హెచ్చరికలు చేశారా? అన్న రీతిలో ఉండటం గమనార్హం.
ఆమె చేసిన వ్యాఖ్యల్ని క్లుప్తంగా చూస్తే..
ఇలా తన ఆలోచనల్ని చెప్పటం ద్వారా.. రేవంత్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను సూటిగా చెప్పేశారన్న మాట వినిపిస్తోంది. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. తాను ఉన్న హోదాకు భిన్నగా సింఫుల్ గా ఈ కార్యక్రమానికి హాజరైన ఆమె.. పది నిమిషాల ముందే రావటం ఒక ఎత్తు అయితే.. వచ్చినప్పటికి నుంచి వేదిక మీద ప్రసంగించే వరకు చరకాతో నూలు వడుకుతూ ఉండటం గమనార్హం.
అంతేకాదు.. ఆమెను కలిసిన వామపక్షవాదులు ప్రపంచ సుందరి పోటీలకు హైదరాబాద్ నువేదికగా చేయొద్దని.. ముఖ్యమంత్రి రేవంత్ కు చెప్పాలని సూచన చేయగా.. అందుకు ఆమె సానుకూలంగా స్పందించారు. చివర్లో సదరు వేదిక మీద నుంచి బయటకు వస్తున్న వేళ.. కొందరు కాంగ్రెస్ నేతలు పార్టీ కండువాల్ని తీసుకొని ఆమెకు వేస్తూ.. హడావుడి చేసే ప్రయత్నాలకు ఆమె మందలిస్తూ.. ‘ఇది పార్టీ వేదిక కాదు. మీరు కలవాలంటే గాంధీభవన్ కు రండి’ అంటూ వారు ఇవ్వబోయిన పార్టీ కండువాలను పక్కన పెట్టేయటం చూసినప్పుడు మీనాక్షి నటరాజన్ రూటు సపరేటు అని అనుకోకుండా ఉండలేం.
This post was last modified on March 5, 2025 12:18 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…