రాజకీయాల్లో విలువల గురించి ప్రతి ఒక్కరు మాట్లాడేవారే. మాటలకు భిన్నంగా చేతల్లో చూపించే వారు వేళ్ల మీద లెక్కించొచ్చు. ఒకవేళ ఉన్నా.. అత్యుత్తమ స్థానాల్లో ఉండేవారు చాలా తక్కువగా ఉంటారు. ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్. మొదటి పర్యటనలోనే అందరి చూపు ఆమె మీద పడింది. గతంలో రాష్ట్రానికి పార్టీ ఇంఛార్జులుగా ఉన్న వారికి భిన్నంగా సింపుల్ గా ఉండటం.. ట్రైన్ లో హైదరాబాద్ కు చేరుకోవటం.. తనకు స్వాగతం పలుకుతూ హోర్డింగ్ లను పెడితే.. వాటిని తీసేయించటం.. పూలమాలలకు.. సత్కారాలకు.. బహుమానాలకు దూరంగా ఉంటూ ఆమె తరచూ వార్తల్లో వ్యక్తిగా మారుతున్నారు.
ఎందుకంటే.. కాంగ్రెస్ లాంటి పార్టీలో ఈ తరహాలో ఒక నేత ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాజాగా ఆమె ప్రజాస్వామ్య పరిరక్షణలో రాజకీయ పార్టీలు.. ప్రజా ఉద్యమాల పాత్ర అనే అంశంపై వివిధ రాజకీయ పార్టీలతో ప్రతినిధులతో సదస్సు జరిగింది. హైదరాబాద్ లో జరిగిన ఈ సదస్సులో పాల్గొన్న ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఒక విధంగా రేవంత్ సర్కారుకు హెచ్చరికలు చేశారా? అన్న రీతిలో ఉండటం గమనార్హం.
ఆమె చేసిన వ్యాఖ్యల్ని క్లుప్తంగా చూస్తే..
ఇలా తన ఆలోచనల్ని చెప్పటం ద్వారా.. రేవంత్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను సూటిగా చెప్పేశారన్న మాట వినిపిస్తోంది. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. తాను ఉన్న హోదాకు భిన్నగా సింఫుల్ గా ఈ కార్యక్రమానికి హాజరైన ఆమె.. పది నిమిషాల ముందే రావటం ఒక ఎత్తు అయితే.. వచ్చినప్పటికి నుంచి వేదిక మీద ప్రసంగించే వరకు చరకాతో నూలు వడుకుతూ ఉండటం గమనార్హం.
అంతేకాదు.. ఆమెను కలిసిన వామపక్షవాదులు ప్రపంచ సుందరి పోటీలకు హైదరాబాద్ నువేదికగా చేయొద్దని.. ముఖ్యమంత్రి రేవంత్ కు చెప్పాలని సూచన చేయగా.. అందుకు ఆమె సానుకూలంగా స్పందించారు. చివర్లో సదరు వేదిక మీద నుంచి బయటకు వస్తున్న వేళ.. కొందరు కాంగ్రెస్ నేతలు పార్టీ కండువాల్ని తీసుకొని ఆమెకు వేస్తూ.. హడావుడి చేసే ప్రయత్నాలకు ఆమె మందలిస్తూ.. ‘ఇది పార్టీ వేదిక కాదు. మీరు కలవాలంటే గాంధీభవన్ కు రండి’ అంటూ వారు ఇవ్వబోయిన పార్టీ కండువాలను పక్కన పెట్టేయటం చూసినప్పుడు మీనాక్షి నటరాజన్ రూటు సపరేటు అని అనుకోకుండా ఉండలేం.
This post was last modified on March 5, 2025 12:18 pm
టాలీవుడ్ అనే కాక ఇండియన్ బాక్సాఫీస్లో ఈ వేసవి పెద్దగా ఉత్సాహం నింపలేకపోయింది. మామూలుగా సమ్మర్లో పెద్ద సినిమాలు రిలీజై…
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు ఏ మాత్రం తగ్గకపోవడానికీ, తరచూ మళ్లీ మళ్లీ ఘర్షణలు చెలరేగడానికీ, అంతర్జాతీయ శక్తుల ఆడంబర నీతులు…
వైసీపీ హయాంలో పదవులు దక్కించుకున్న వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? నాడు నెలకు 3 లక్షలకు పైగానే వేతనాల రూపంలో…
నితిన్ కెరీర్లో చాలా కీలకమైన సినిమా.. తమ్ముడు. ‘భీష్మ’ తర్వాత నితిన్కు ఓ మోస్తరు హిట్ కూడా లేదు. చెక్,…
జనసేనాని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. కొన్ని రోజుల కిందటే మళ్లీ ‘పవర్ స్టార్’గా మారారు. రాజకీయ నేతగా, మంత్రిగా…
ప్రస్తుతం వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమా, దేవర 2లకు కమిట్ మెంట్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత…