రాజకీయాల్లో విలువల గురించి ప్రతి ఒక్కరు మాట్లాడేవారే. మాటలకు భిన్నంగా చేతల్లో చూపించే వారు వేళ్ల మీద లెక్కించొచ్చు. ఒకవేళ ఉన్నా.. అత్యుత్తమ స్థానాల్లో ఉండేవారు చాలా తక్కువగా ఉంటారు. ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్. మొదటి పర్యటనలోనే అందరి చూపు ఆమె మీద పడింది. గతంలో రాష్ట్రానికి పార్టీ ఇంఛార్జులుగా ఉన్న వారికి భిన్నంగా సింపుల్ గా ఉండటం.. ట్రైన్ లో హైదరాబాద్ కు చేరుకోవటం.. తనకు స్వాగతం పలుకుతూ హోర్డింగ్ లను పెడితే.. వాటిని తీసేయించటం.. పూలమాలలకు.. సత్కారాలకు.. బహుమానాలకు దూరంగా ఉంటూ ఆమె తరచూ వార్తల్లో వ్యక్తిగా మారుతున్నారు.
ఎందుకంటే.. కాంగ్రెస్ లాంటి పార్టీలో ఈ తరహాలో ఒక నేత ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాజాగా ఆమె ప్రజాస్వామ్య పరిరక్షణలో రాజకీయ పార్టీలు.. ప్రజా ఉద్యమాల పాత్ర అనే అంశంపై వివిధ రాజకీయ పార్టీలతో ప్రతినిధులతో సదస్సు జరిగింది. హైదరాబాద్ లో జరిగిన ఈ సదస్సులో పాల్గొన్న ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఒక విధంగా రేవంత్ సర్కారుకు హెచ్చరికలు చేశారా? అన్న రీతిలో ఉండటం గమనార్హం.
ఆమె చేసిన వ్యాఖ్యల్ని క్లుప్తంగా చూస్తే..
ఇలా తన ఆలోచనల్ని చెప్పటం ద్వారా.. రేవంత్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను సూటిగా చెప్పేశారన్న మాట వినిపిస్తోంది. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. తాను ఉన్న హోదాకు భిన్నగా సింఫుల్ గా ఈ కార్యక్రమానికి హాజరైన ఆమె.. పది నిమిషాల ముందే రావటం ఒక ఎత్తు అయితే.. వచ్చినప్పటికి నుంచి వేదిక మీద ప్రసంగించే వరకు చరకాతో నూలు వడుకుతూ ఉండటం గమనార్హం.
అంతేకాదు.. ఆమెను కలిసిన వామపక్షవాదులు ప్రపంచ సుందరి పోటీలకు హైదరాబాద్ నువేదికగా చేయొద్దని.. ముఖ్యమంత్రి రేవంత్ కు చెప్పాలని సూచన చేయగా.. అందుకు ఆమె సానుకూలంగా స్పందించారు. చివర్లో సదరు వేదిక మీద నుంచి బయటకు వస్తున్న వేళ.. కొందరు కాంగ్రెస్ నేతలు పార్టీ కండువాల్ని తీసుకొని ఆమెకు వేస్తూ.. హడావుడి చేసే ప్రయత్నాలకు ఆమె మందలిస్తూ.. ‘ఇది పార్టీ వేదిక కాదు. మీరు కలవాలంటే గాంధీభవన్ కు రండి’ అంటూ వారు ఇవ్వబోయిన పార్టీ కండువాలను పక్కన పెట్టేయటం చూసినప్పుడు మీనాక్షి నటరాజన్ రూటు సపరేటు అని అనుకోకుండా ఉండలేం.
This post was last modified on March 5, 2025 12:18 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…