Political News

జగన్ ను క్షమిస్తున్నా: స్పీకర్ అయ్యన్న

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం ఓ కీలక ఘటన చోటుచేసుకుంది. స్పీకర్ స్థానంలో ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడు నోట నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు వినిపించాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని క్షమిస్తున్నానని అయ్యన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ హోదాకు జగన్ దురుద్దేశాలు ఆపాదించారని చెప్పిన అయ్యన్న… అయినప్పటికీ… సభాపతి హోదాలో జగన్ ను క్షమిస్తున్నానని అయ్యన్న పేర్కొన్నారు. ఇకనైనా జగన్ తన వైఖరి మార్చుకోవాలని సూచించిన అయ్యన్న… అలా జరగని పక్షంలో, జగన్ తన పాత వైఖరితోనే సాగితే… ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయం సభకు తెలుసునని వ్యాఖ్యానించారు.

బుధవారం నాటి సభా సమావేశాలు ప్రారంభం కాగానే…జగన్ అంశాన్ని ప్రస్తావించిన స్పీకర్ అయ్యన్న ప్రత్యేక రూలింగ్ ఇచ్చారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ 10 శాతం సీట్లు రాలేదని ఆయన చెప్పారు. అయినా కూడా తనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటూ జగన్… స్పీకర్ హోదాలో ఉన్న తనను బెదిరించేలా లేఖ రాశారన్నారు. ఈ లేఖలో జగన్ పలు అవాస్తవాలను ప్రస్తావించారని తెలిపారు. అవాస్తవాలతో సభాపతికి లేఖ రాయడం ముమ్మాటికీ సభా హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని ఆయన తెలిపారు. ఇక ఆ తర్వాత జగన్ ఇదే అంశం మీద హైకోర్టును ఆశ్రయించారని ఆయన గుర్తు చేశారు.

జగన్ పిటిషన్ ను ఆధారం చేసుకుని హైకోర్టు స్పీకర్ కు నోటీసులు జారీ చేసిందని కూడా వైసీపీ ప్రచారం చేసిందని అయ్యన్న ఆరోపించారు. అయితే ఇందులో వాస్తవం లేదని తెలిపారు. హైకోర్టు నుంచి తనకు ఎలాంటి నోటీసులు రాలేదని కూడా ఆయన వెల్లడించారు. మొత్తంగా అన్నీ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్న జగన్.. సభా మర్యాదలను మంటగలిపారని ఆయన ఆరోపించారు. ఈ లెక్కన జగన్ పై సబా హక్కుల ఉల్లంఘన కింద కఠిన చర్యలు తీసుకునే అవకాశం స్పీకర్ గా తనకు ఉందన్నారు. అయితే వీటన్నింటినీ సంధి ప్రేలాపనలుగా భావిస్తూ జగన్ ను క్షమిస్తున్నానని అయ్యన్న వ్యాఖ్యానించారు. జగన్ తన ధోరణి మార్చుకోకపోతే మాత్రం ఆయనను ఏం చేయాలన్న దానిపై సభ ఆలోచన చేస్తుందని ఆయన హెచ్చరించారు.

This post was last modified on March 5, 2025 10:00 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వర్మపై వైసీపీ ఇంతగా ఆశ పెట్టుకుందా..?

శ్రీ వస్తవాయి సత్యనారాయణ వర్మ… మనమంతా షార్ట్ గా పిలుచుకునే టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ చుట్టూ ఇప్పుడు వైసీపీలో…

4 hours ago

కుప్పానికి మదర్ డెయిరీ రెడీ..బాబుదే లేటు

ఏపీలో కూటమి సర్కారు పాలన మొదలయ్యాక.. రాష్ట్రానికి పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. పిలవకున్నా కూడా రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేస్తున్నాయి. మేం రెడీ…

6 hours ago

కాకాణి ఇంటికి తాళం, ఫోన్ స్విచ్ఛాఫ్.. రీజనేంటి?

తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన ఆదివారం వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఊహించని షాక్…

8 hours ago

ఇక్కడ పీ4… అక్కడ సన్నబియ్యం

తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని ఆదివారం రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణల్లో రెండు కీలక సంక్షేమ పథకాలు ప్రారంభమయ్యాయి.…

10 hours ago

సెకండ్ ఇన్నింగ్స్….బాలయ్య సరైన మాట

మాములుగా స్టార్ హీరోల విషయంలో కంబ్యాక్, సెకండ్ ఇన్నింగ్స్ పదాలు సాధారణంగా వినిపిస్తూ ఉంటాయి. ఏదైనా గ్యాప్ వచ్చినప్పుడు లేదా…

10 hours ago

కూలీ ఆలోచిస్తోంది….45 వస్తానంటోంది

బాక్సాఫీస్ కు ఈ ఏడాది సంక్రాంతి, ఉగాది తర్వాత అత్యంత కీలకమైన సీజన్ ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం. లాంగ్…

11 hours ago