Political News

జగన్ ను క్షమిస్తున్నా: స్పీకర్ అయ్యన్న

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం ఓ కీలక ఘటన చోటుచేసుకుంది. స్పీకర్ స్థానంలో ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడు నోట నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు వినిపించాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని క్షమిస్తున్నానని అయ్యన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ హోదాకు జగన్ దురుద్దేశాలు ఆపాదించారని చెప్పిన అయ్యన్న… అయినప్పటికీ… సభాపతి హోదాలో జగన్ ను క్షమిస్తున్నానని అయ్యన్న పేర్కొన్నారు. ఇకనైనా జగన్ తన వైఖరి మార్చుకోవాలని సూచించిన అయ్యన్న… అలా జరగని పక్షంలో, జగన్ తన పాత వైఖరితోనే సాగితే… ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయం సభకు తెలుసునని వ్యాఖ్యానించారు.

బుధవారం నాటి సభా సమావేశాలు ప్రారంభం కాగానే…జగన్ అంశాన్ని ప్రస్తావించిన స్పీకర్ అయ్యన్న ప్రత్యేక రూలింగ్ ఇచ్చారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ 10 శాతం సీట్లు రాలేదని ఆయన చెప్పారు. అయినా కూడా తనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటూ జగన్… స్పీకర్ హోదాలో ఉన్న తనను బెదిరించేలా లేఖ రాశారన్నారు. ఈ లేఖలో జగన్ పలు అవాస్తవాలను ప్రస్తావించారని తెలిపారు. అవాస్తవాలతో సభాపతికి లేఖ రాయడం ముమ్మాటికీ సభా హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని ఆయన తెలిపారు. ఇక ఆ తర్వాత జగన్ ఇదే అంశం మీద హైకోర్టును ఆశ్రయించారని ఆయన గుర్తు చేశారు.

జగన్ పిటిషన్ ను ఆధారం చేసుకుని హైకోర్టు స్పీకర్ కు నోటీసులు జారీ చేసిందని కూడా వైసీపీ ప్రచారం చేసిందని అయ్యన్న ఆరోపించారు. అయితే ఇందులో వాస్తవం లేదని తెలిపారు. హైకోర్టు నుంచి తనకు ఎలాంటి నోటీసులు రాలేదని కూడా ఆయన వెల్లడించారు. మొత్తంగా అన్నీ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్న జగన్.. సభా మర్యాదలను మంటగలిపారని ఆయన ఆరోపించారు. ఈ లెక్కన జగన్ పై సబా హక్కుల ఉల్లంఘన కింద కఠిన చర్యలు తీసుకునే అవకాశం స్పీకర్ గా తనకు ఉందన్నారు. అయితే వీటన్నింటినీ సంధి ప్రేలాపనలుగా భావిస్తూ జగన్ ను క్షమిస్తున్నానని అయ్యన్న వ్యాఖ్యానించారు. జగన్ తన ధోరణి మార్చుకోకపోతే మాత్రం ఆయనను ఏం చేయాలన్న దానిపై సభ ఆలోచన చేస్తుందని ఆయన హెచ్చరించారు.

This post was last modified on March 5, 2025 10:00 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

2 hours ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

3 hours ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

3 hours ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

5 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

6 hours ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

6 hours ago