అధికార వైసీపీలో ఎవరి గోల వారిదేనా? అధినేత జగన్ ఒకదారిలో వెళ్తుంటే.. మంత్రులు మరో దారిలో వెళ్తున్నారా? స్థానికంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇంకో దారిలో నడుస్తున్నారా? అంటే.. పరిణామాలను గమనిస్తే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. దీంతో వైసీపీలో ఎవరి గోల వారిదే అన్న మాట వినిపిస్తోంది. ఎవరిని ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయిందని చెబుతున్నారు.
జగన్ విషయాన్ని తీసుకుంటే.. తనపై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణ ప్రారంభమైంది. వీటి నుంచి బయట పడేందుకు ఆయన తర్జన భర్జనలో మునిగిపోయారు. మరోవైపు తన పాలనకు ప్రతిపక్షాలకు తోడు న్యాయవ్యవస్థ అడ్డు పడుతోందనే భావనలో మునిగిపోయి.. ఎదురు దాడి చేయడంతోనే సమయం సరిపోవడం లేదు.
దీంతో ఆయన కింది స్థాయిలో ఏం జరుగుతోందో.. తెలుసుకునే సమయం లేకుండా పోయిందని అంటు న్నారు. ఇక, మంత్రుల విషయానికి వస్తే.. వారి ఇష్టం వచ్చినట్టు వారు ఉన్నారనే వ్యాఖ్యలు కొంత కాలంగా వినిపిస్తూనే ఉంది. కొందరు మంత్రులు మాత్రం ముఖ్యమంత్రి కనుసన్నల్లో పనిచేస్తుంటే.. మరికొందరు మాత్రం ఆయనకు దూరంగా పనులు చక్కబెట్టుకుంటున్నారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎంలలో పాముల పుష్ప శ్రీవాణి, నారాయణ స్వామి వంటివారు తమ తమ నియోజకవర్గాల్లో పనులు చక్కబెట్టుకుంటున్నారట! ఇక, జిల్లాల్లో మంత్రులు కూడా తమ పనుల్లో తాము బిజీగా ఉన్నారని తెలుస్తోంది. దీంతో సాధారణ పాలనపై ప్రత్యేకంగా దృష్టి పెట్టేవారు కరువయ్యారని అంటున్నారు.
ఇక, ఎంపీలు, ఎమ్మెల్యేల విషయాలు కూడా దీనికి భిన్నంగా ఏమీలేవని తెలుస్తోంది. తమ వారికి పనులు చేయించుకోవడం, నియోజకవర్గాల్లో ఆధిపత్య రాజకీయాలకు తెరదీయడానికే పరిమితమవుతున్నారని తెలుస్తోంది. దీంతో సాధారణ పాలన, ప్రభుత్వం అందించే పథకాలు వంటివాటిని కేవలం సచివాలయ వ్యవస్థే పర్యవేక్షిస్తోందని, వలంటీర్లే అన్నీ తామై వ్యవహరిస్తున్నారని అంటున్నారు.
నిజానికి చంద్రబాబు పాలనలో ఇలాంటి పరిస్థితి లేదు. అప్పట్లో మంత్రులు అంతా అధినేత కనుసన్నల్లో ముందుకు సాగారు. ఒకరిద్దరు మినహా.. ఎవరూ సొంతగా కార్యకలాపాలు నిర్వహించిన పరిస్థితి లేదు. కానీ, ఇప్పుడు అంతా సొంత వ్యవహారానికి పెద్ద పీట వేస్తున్నారు. దీనికి జగన్ తన సొంత కార్యక్రమాల్లో బిజీగా ఉండడమే కారణంగా ఉందని తెలుస్తోంది. మొత్తానికి ఇదే పరిస్థితి మరికొన్నాళ్లు సాగితే.. పట్టు తప్పడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on October 26, 2020 10:57 am
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య చిరాకులు, పరాకులకు అవకాశం ఉంటుందని.. తమకు అది మేలు చేస్తుందని భావిస్తున్న వైసీపీకి…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…
సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…
‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…