Political News

వైసీపీలో .. ఎవ‌రి గోల వారిదే!!

అధికార వైసీపీలో ఎవ‌రి గోల వారిదేనా? అధినేత జ‌గ‌న్ ఒక‌దారిలో వెళ్తుంటే.. మంత్రులు మ‌రో దారిలో వెళ్తున్నారా? స్థానికంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇంకో దారిలో న‌డుస్తున్నారా? అంటే.. ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. దీంతో వైసీపీలో ఎవ‌రి గోల వారిదే అన్న మాట వినిపిస్తోంది. ఎవ‌రిని ఎవ‌రూ ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేకుండా పోయింద‌ని చెబుతున్నారు.

జ‌గ‌న్ విష‌యాన్ని తీసుకుంటే.. త‌న‌పై ఉన్న అక్ర‌మాస్తుల కేసుల విచార‌ణ ప్రారంభ‌మైంది. వీటి నుంచి బ‌య‌ట ప‌డేందుకు ఆయ‌న త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లో మునిగిపోయారు. మ‌రోవైపు త‌న పాల‌న‌కు ప్ర‌తిప‌క్షాల‌కు తోడు న్యాయ‌వ్య‌వ‌స్థ అడ్డు ప‌డుతోంద‌నే భావ‌న‌లో మునిగిపోయి.. ఎదురు దాడి చేయ‌డంతోనే స‌మ‌యం స‌రిపోవ‌డం లేదు.

దీంతో ఆయ‌న కింది స్థాయిలో ఏం జ‌రుగుతోందో.. తెలుసుకునే స‌మ‌యం లేకుండా పోయింద‌ని అంటు న్నారు. ఇక‌, మంత్రుల విష‌యానికి వ‌స్తే.. వారి ఇష్టం వ‌చ్చిన‌ట్టు వారు ఉన్నార‌నే వ్యాఖ్య‌లు కొంత కాలంగా వినిపిస్తూనే ఉంది. కొంద‌రు మంత్రులు మాత్రం ముఖ్య‌మంత్రి క‌నుస‌న్న‌ల్లో ప‌నిచేస్తుంటే.. మ‌రికొంద‌రు మాత్రం ఆయ‌న‌కు దూరంగా ప‌నులు చ‌క్క‌బెట్టుకుంటున్నార‌ని వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎంల‌లో పాముల పుష్ప శ్రీవాణి, నారాయ‌ణ స్వామి వంటివారు త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌నులు చ‌క్క‌బెట్టుకుంటున్నార‌ట‌! ఇక‌, జిల్లాల్లో మంత్రులు కూడా త‌మ ప‌నుల్లో తాము బిజీగా ఉన్నార‌ని తెలుస్తోంది. దీంతో సాధార‌ణ పాల‌న‌పై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టేవారు క‌రువ‌య్యార‌ని అంటున్నారు.

ఇక‌, ఎంపీలు, ఎమ్మెల్యేల విష‌యాలు కూడా దీనికి భిన్నంగా ఏమీలేవ‌ని తెలుస్తోంది. త‌మ వారికి ప‌నులు చేయించుకోవ‌డం, నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆధిప‌త్య రాజ‌కీయాల‌కు తెర‌దీయ‌డానికే ప‌రిమిత‌మ‌వుతున్నార‌ని తెలుస్తోంది. దీంతో సాధార‌ణ పాల‌న‌, ప్ర‌భుత్వం అందించే ప‌థ‌కాలు వంటివాటిని కేవ‌లం స‌చివాల‌య వ్య‌వ‌స్థే ప‌ర్య‌వేక్షిస్తోంద‌ని, వ‌లంటీర్లే అన్నీ తామై వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు.

నిజానికి చంద్ర‌బాబు పాల‌న‌లో ఇలాంటి ప‌రిస్థితి లేదు. అప్ప‌ట్లో మంత్రులు అంతా అధినేత క‌నుస‌న్న‌ల్లో ముందుకు సాగారు. ఒక‌రిద్ద‌రు మిన‌హా.. ఎవ‌రూ సొంత‌గా కార్య‌క‌లాపాలు నిర్వ‌హించిన ప‌రిస్థితి లేదు. కానీ, ఇప్పుడు అంతా సొంత వ్య‌వ‌హారానికి పెద్ద పీట వేస్తున్నారు. దీనికి జ‌గ‌న్ త‌న సొంత కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉండ‌డ‌మే కార‌ణంగా ఉంద‌ని తెలుస్తోంది. మొత్తానికి ఇదే ప‌రిస్థితి మ‌రికొన్నాళ్లు సాగితే.. ప‌ట్టు త‌ప్ప‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on October 26, 2020 10:57 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

3 hours ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

7 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

8 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

9 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

9 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

11 hours ago