కొన్నికొన్ని విషయాలు ఆసక్తిగా ఉంటాయి. ఇలాంటి ఘటనే టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ విషయంలో జరుగుతోంది. “లోకేష్ సర్ ఇప్పట్లో ఎవరినీ కలవరు.. ప్లీజ్ ఒక నెల ఆగి ట్రై చేయండి”- ఇదీ.. ఇప్పుడు లోకేష్ చాంబర్లోను.. ఆయన నివాసంలోనూ పనిచేస్తున్న పీఏలు, సెక్రటరీలు చెబుతున్న మాట. అది కూడా.. టీడీపీ సీనియర్లకే చెబుతున్న మాట. ఇదేమీ చిత్రమైన విషయం కాదు. చాలా సీరియస్ ఇష్యూనే.
మరి దీనికి కారణం ఏంటి? అంటే.. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చింది. దీంతో ఆశావహులు.. వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. కొందరు.. నేరుగా సీఎం చంద్రబాబును కలుస్తున్నారు. వీరిలో టీడీ జనార్దన్, నెట్టెం రఘురాం వంటి సీనియర్ మోస్టులు కూడా ఉన్నారు. ఇక, గత ఎన్నికల్లో టికెట్ వదులుకున్న వారు సరేసరి! వారు నేరుగా చంద్రబాబును కలవక పోయినా.. తమను గుర్తు తెచ్చేలా నియోజకవర్గాల్లో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
తాజాగా రా.. కదలిరా! కార్యక్రమం ప్రారంభించి.. ఏడాది పూర్తయిందంటూ.. గుంటూరులో జంగా కృష్ణమూర్తి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇదే కార్యక్రమంపై మైలవరంలోమాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమా అనుచరులు కూడా పోస్టులు పెడుతున్నారు. అంటే.. ఆయా కార్యక్రమాలను గుర్తు చేయడం ద్వారా.. తాము లైవ్లో ఉన్నామన్న విషయాన్ని వారు చెప్పకనే చెబుతున్నారు. ఇక, చంద్రబాబు అప్పాయింట్మెంటు దొరకని వారు.. నారా లోకేష్ చెబితే పని అవుతుందన్న నమ్మకం ఉన్నవారు.. ఆదిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.
దీంతో గత రెండు రోజుల నుంచి నారా లోకేష్ను కలవాలని కోరుతూ.. అప్పాయింట్మెంటు ఇప్పించాలని అభ్యర్థిస్తూ.. అనేక మంది నాయకులు క్యూ కడుతున్నారు. అయితే.. గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న నారా లోకేస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యే వరకు.. ఇలాంటి అభ్యర్థనలతో ముందుకు వచ్చే ఎవరికీ అప్పాయింట్మెంటు ఇవ్వరాదని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. దీంతో ఆయన పీఏలు, సెక్రటరీలు.. సార్ బిజీగా ఉన్నారంటూ పోన్లు పెట్టేస్తున్నారట.
సాయికృష్ణ అదృశ్యం కేసులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఘటనపై అన్ని కోణాల్లో లోతైన దర్యాప్తు జరిపేందుకు ప్రత్యేక…
2024 చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా వచ్చిన విశ్వంభర టీజర్ మీద నెగటివ్ రియాక్షన్లు చాలా వచ్చాయి. ట్రోలింగ్ జరిగింది. దెబ్బకు…
టాలీవుడ్ బాక్సాఫీస్ జూన్ నెల నుంచి ఊపందుకుంది. ఓవర్సీస్, నార్త్ పక్కనపెడితే తెలుగు రాష్ట్రాల వరకు పెద్ది బ్లాక్ బస్టర్…
టాలీవుడ్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న సంగీత దర్శకులు ఎవరయ్యా అంటే ముందు వినిపించే పేరు తమన్. అది నిజం…
టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్…
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…