Political News

ఈ ప్రభుత్వానికి రంగు, రుచి, వాసన లేవు: అచ్చెన్న

ఏసీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు వర్సెస్ మాజీ మంత్రి బొత్స అన్న రీతిలో మాటల యుద్ధం జరిగింది. వైసీపీ నేతలు గాలికి వచ్చారంటూ అచ్చెన్న చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా తాను ఎవరిపై విమర్శలు చేయలేదని, ఈ వ్యాఖ్యలను అచ్చెన్న వెనక్కి తీసుకోవాలని బొత్స అన్నారు. ఇక, పథకాలపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదని, అర్హులైన లబ్ధిదారులకు పార్టీలకతీతంగా పథకాలు ఇవ్వాల్సిన భాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పారు. ఈ క్రమంలోనే బొత్సకు అచ్చెన్న కౌంటర్ ఇచ్చారు.

42 సంవత్సరాల అనుభవమున్న పార్టీ టీడీపీ అని, ఎన్నికల వరకే రాజకీయాలు అని అచ్చెన్న చెప్పారు. ఈ పార్టీకి, ఎన్డీఏ ప్రభుత్వానికి రంగు, రుచి, వాసన లేవని, ధనవంతుడు లేడని…..పేద వాడే పార్టీకి క్రైటీరియా..పేదరికమే అని అన్నారు. కులం, మతం, రాజకీయం చూడబోమని, అర్హులైన వారందరికీ అన్ని పథకాలిస్తామని స్పష్టం చేశారు. అంతేకాదు, అర్హులైన వారెవరికైనా పథకాలు అందకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలంటూ వైసీపీ సభ్యులకు సూచించారు. చంద్రబాబు మాటలను వక్రీకరించారని అన్నారు.

ఐదేళ్ల వైసీపీ పాలనతో బిల్డింగులకు రంగులు వేయడం తప్ప వైసీపీ చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఐదేళ్లలో మాట్లాడాలంటే భయపడే పరిస్థితులున్నాయని, ప్రశ్నించే హక్కు లేదని చెప్పారు. ఏదైనా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమానికి వెళదామంటే తెల్లవారుజామునే పోలీసులు హౌస్ అరెస్టులు చేసేవారని గుర్తు చేసుకున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన కొద్ది నెలల్లోనే వైసీపీ నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని, అయినా సరే హౌస్ అరెస్టులు వంటి కక్షపూరిత చర్యలు తమ ప్రభుత్వం చేయడం లేదని గుర్తు చేశారు.

This post was last modified on March 4, 2025 9:44 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

59 minutes ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

1 hour ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

1 hour ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

2 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

3 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

4 hours ago