వైసీపీ మాజీ నేత, ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి మరిన్ని చిక్కులు మొదలైనట్లేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. గత వారం అన్నమయ్య జిల్లా పోలీసులు హైదరాబాద్ వెళ్లి మరీ పోసానిని అరెస్టు చేసి ఓబులవారిపల్లెకు తీసుకుని వచ్చారు. సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరు పరచిన పోలీసులు… కోర్టు ఆదేశాలతో పోసానిని రాజంపేట సబ్ జైలుకు తరలించారు. సోమవారం ఉదయం దాకా రాజంపేట సబ్ జైలులోనే ఉన్న పోసానిని… సోమవారం ఉదయం పల్నాడు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను పీటీ వారెంట్ మీద నరసరావు పేటకు తరలిస్తున్నారు.
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్, జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లపై వైసీపీ అధికారంలో ఉండగా… పోసాని అసభ్య పదజాలంతో దూషణలకు దిగిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఏపీ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పోసానిపై కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. తొలుత అన్నమయ్య జిల్లా పోలీసులు ఓబులవారిపల్లె పీఎస్ లో నమోదు అయిన కేసులో పోసానిని అరెస్టు చేయగా… తాజాగా నరసరావుపేట పీఎస్ లో నమోదు అయిన కేసులో పల్నాడు జిల్ల ా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మరి నరసరావుపేటలో విచారణ అనంతరం పోసానికి ఎలాంటి పరిస్థితులు స్వాగతం చెబుతాయోనన్న వాదనలు ఆసక్తి రేపుతున్నాయి.
వాస్తవానికి పోలీసులు అరెస్టు చేసిన తర్వాత అయినా ఆయా కేసుల్లో నిందితులు కాస్తంతైనా ఒద్దికగా ఉండాలి. అయితే తాను చేసింది తప్పేనని ఒప్పుకున్న తర్వాత కూడా పోసాని… అనారోగ్యం పేరిట పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించారు. తనకేమీ కాకున్నా కూడా ఛాతీలో నొప్పి అని కొంతసేపు, కడుపులో నొప్పి అని మరికొంత సేపు చెబుతూ పోలీసులను టెన్షన్ కు గురి చేశారు. అసలే సినీ ఇండస్ట్రీకి చెందిన పోసానికి ఏమైనా అయితే ఇబ్బందేనని భావించిన పోలీసులు ఆయన చెప్పింది నిజమేనని నమ్మి… తొలుత రాజంపేట ఆసుపత్రికి, ఆ తర్వాత కడపలోని రిమ్స్ కు తరలించి అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించారు. అయితే చివరకు పోసాని చెప్పినదంతా అబద్ధమేనని, అనారోగ్యం పేరిట ఆయన నాటకాలాడినట్టుగా తేలింది. తాజాగా పల్నాడు జిల్లా పోలీసులు పోసానిని అదుపులోకి తీసుకోగానే… పోలీసులను ఇబ్బంది పెట్టిన పోసానికి ఇలా జరగాల్సిందేనన్న సెటైర్లు పడిపోతున్నాయి.
This post was last modified on March 3, 2025 10:52 am
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…