తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హన్మంతరావు తన సామాజిక వర్గం మున్నూరు కాపు నేతలతో శనివారం తన ఇంటిలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ హయాంలో మున్నూరు కాపులకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని భావిస్తున్న ఆయన… పరిస్థితిని చక్కదిద్దే క్రమంలోనే ఈ భేటీని నిర్వహించినట్లుగా సమాచారం. అయితే ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటుగా బీఆర్ఎస్, బీజేపీల్లో ఉన్న మున్నూరు కాపు నేతలను కూడా వీహెచ్ ఆహ్వానించారు. వీహెచ్ ఆహ్వానాన్ని మన్నించిన ఆ పార్టీల నేతలు కూడా ఈ భేటీకి హాజరయ్యారు.
ఈ బేటీ గురించిన సమాచారం…ఒక్కటంటే ఒక్క రోజులోనే కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ చెవిలో పడిపోయిది. నేతలు ఎవరన్న దానిని చూడకుండా…పార్టీ లైన్ దాటిన వారిపై కఠినంగా వ్యవహరిస్తున్న మీనాక్షి… శనివారం ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై చర్యలకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో మల్లన్నపై పార్టీ క్రమశిక్షణా కమిటీ సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీలో జరుగుతున్న ఈ తరహా వ్యవహారాలపై ఒకింత గుర్రుగానే ఉన్న మీనాక్షి… వీహెచ్ ఇంటిలో జరిగిన భేటీ తెలిసినంతనే ఆగ్రహం వ్యక్తం చేశారట.
కుల సంఘం సమావేశం ఏర్పాటు చేసుకున్న వీహెచ్ తీరుపై ఒకింత లోతుగానే పరిశీలన చేసిన మీనాక్షి… ఆదివారం వీహెచ్ ను పిలిపించుకుని మరీ క్లాస్ పీకారట. ఎంత కుల సంఘం సమావేశమైతే మాత్రం ప్రత్యర్థి పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులతో పాటు ఆయా పార్టీలకు చెందిన కీలక నేతలను సమావేశానికి ఎలా ఆహ్వానిస్తారని ఆమె వీహెచ్ ను ప్రశ్నించార,ట. పార్టీలో సీనియర్ మోస్ట్ నేతగా ఉన్న మీరే ఈ తరహా చర్యలకు పాల్పడితే… ఇక యువతరం నేతలకు అడ్డుకట్ట వేయగలమా? అని కూడా ఆమె ఆయనను నిలదీశారట. మీనాక్షి ఆగ్రహంతో విస్తుపోయిన వీహెచ్ నోట నుంచి మాట కూడా పెగల్లేదట. మొత్తంగా వీహెచ్ ప్లాన్ రివర్స్ అయ్యిందన్న కోణంలో ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.
This post was last modified on March 2, 2025 9:52 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…