ఏపీలో కూటమి అధికారం చేపట్టిన తర్వాత ఈ నెల 8న తొలి మహిళా దినోత్సవం జరుగుతోంది. మహిళల అభ్యున్నతి కోసం నిత్యం ఏదో ఒక కొత్త పథకానికి రూపకల్పన చేస్తున్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు… ఈ దఫా సరిగ్గా ప్రపంచ మహిళా దినోత్సవం నాడే… వారికి ఓ అదిరిపోయే గిఫ్ట్ ను అందించేందుకు సిద్ధపడ్డారు. ఈ మేరకు ఇప్పటికే చంద్రబాబు నుంచి ఆదేశాలు జారీ కాగా… దాదాపుగా లక్ష మందికి పైగా మహిళలకు ఈ గిఫ్ట్ ను అందించేందుకు అధికార యంత్రాంగం కార్యరంగాన్ని సిద్ధం చేసింది.
మహిళలను ఆర్థికంగా స్వయం సమృద్ధం చేసే దిశగా ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలను చేపట్టిన చంద్రబాబు… ఈ దఫా టైలరింగ్ లో వారికి శిక్షణ ఇచ్చేందుకు భారీ ప్రణాళికను రచించారు. ఈ నెల 8న ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మొదలు కానున్న ఈ టైలరింగ్ శిక్షణలో ఏకంగా 1,02,832 మంది మహిళలు పాలుపంచుకోనున్నారు. శిక్షణ తర్వాత టైలరింగ్ లో సదరు మహిళలు ఆర్థికార్జనకు అవసరమైన ఇతరత్రా చేయూతను కూడా బాబు సర్కారు అందించనుంది. వెరసి ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని లక్ష మందికి పైగా మహిళలకు లబ్ధి చేకూరనుంది.
90 రోజుల పాటు జరగనున్న టైలరింగ్ శిక్షణా కార్యక్రమాలకు బీసీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (ఈబీఎస్), కాపు సామాజిక వర్గాలకు చెందిన మహిళలు అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ శిక్షణకు అవసరమైన నిధులను బీసీ, ఈబీసీ, కాపు కార్పొరేషన్ల ద్వారానే సమకూరుస్తారు. ఇక ఈ శిక్షణ కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆయా వర్గాలకు చెందిన మహిళలు తమ పేర్లను నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు కానున్న ఈ శిక్షణా కేంద్రాల్లో 70 శాతం హాజరు ఉన్న మహిళలకు మాత్రమే ఉచితంగా కుట్టు మిషన్లను ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
This post was last modified on March 2, 2025 9:47 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…