ఏపీలో కూటమి అధికారం చేపట్టిన తర్వాత ఈ నెల 8న తొలి మహిళా దినోత్సవం జరుగుతోంది. మహిళల అభ్యున్నతి కోసం నిత్యం ఏదో ఒక కొత్త పథకానికి రూపకల్పన చేస్తున్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు… ఈ దఫా సరిగ్గా ప్రపంచ మహిళా దినోత్సవం నాడే… వారికి ఓ అదిరిపోయే గిఫ్ట్ ను అందించేందుకు సిద్ధపడ్డారు. ఈ మేరకు ఇప్పటికే చంద్రబాబు నుంచి ఆదేశాలు జారీ కాగా… దాదాపుగా లక్ష మందికి పైగా మహిళలకు ఈ గిఫ్ట్ ను అందించేందుకు అధికార యంత్రాంగం కార్యరంగాన్ని సిద్ధం చేసింది.
మహిళలను ఆర్థికంగా స్వయం సమృద్ధం చేసే దిశగా ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలను చేపట్టిన చంద్రబాబు… ఈ దఫా టైలరింగ్ లో వారికి శిక్షణ ఇచ్చేందుకు భారీ ప్రణాళికను రచించారు. ఈ నెల 8న ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మొదలు కానున్న ఈ టైలరింగ్ శిక్షణలో ఏకంగా 1,02,832 మంది మహిళలు పాలుపంచుకోనున్నారు. శిక్షణ తర్వాత టైలరింగ్ లో సదరు మహిళలు ఆర్థికార్జనకు అవసరమైన ఇతరత్రా చేయూతను కూడా బాబు సర్కారు అందించనుంది. వెరసి ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని లక్ష మందికి పైగా మహిళలకు లబ్ధి చేకూరనుంది.
90 రోజుల పాటు జరగనున్న టైలరింగ్ శిక్షణా కార్యక్రమాలకు బీసీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (ఈబీఎస్), కాపు సామాజిక వర్గాలకు చెందిన మహిళలు అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ శిక్షణకు అవసరమైన నిధులను బీసీ, ఈబీసీ, కాపు కార్పొరేషన్ల ద్వారానే సమకూరుస్తారు. ఇక ఈ శిక్షణ కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆయా వర్గాలకు చెందిన మహిళలు తమ పేర్లను నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు కానున్న ఈ శిక్షణా కేంద్రాల్లో 70 శాతం హాజరు ఉన్న మహిళలకు మాత్రమే ఉచితంగా కుట్టు మిషన్లను ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…