ఏపీలో కూటమి అధికారం చేపట్టిన తర్వాత ఈ నెల 8న తొలి మహిళా దినోత్సవం జరుగుతోంది. మహిళల అభ్యున్నతి కోసం నిత్యం ఏదో ఒక కొత్త పథకానికి రూపకల్పన చేస్తున్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు… ఈ దఫా సరిగ్గా ప్రపంచ మహిళా దినోత్సవం నాడే… వారికి ఓ అదిరిపోయే గిఫ్ట్ ను అందించేందుకు సిద్ధపడ్డారు. ఈ మేరకు ఇప్పటికే చంద్రబాబు నుంచి ఆదేశాలు జారీ కాగా… దాదాపుగా లక్ష మందికి పైగా మహిళలకు ఈ గిఫ్ట్ ను అందించేందుకు అధికార యంత్రాంగం కార్యరంగాన్ని సిద్ధం చేసింది.
మహిళలను ఆర్థికంగా స్వయం సమృద్ధం చేసే దిశగా ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలను చేపట్టిన చంద్రబాబు… ఈ దఫా టైలరింగ్ లో వారికి శిక్షణ ఇచ్చేందుకు భారీ ప్రణాళికను రచించారు. ఈ నెల 8న ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మొదలు కానున్న ఈ టైలరింగ్ శిక్షణలో ఏకంగా 1,02,832 మంది మహిళలు పాలుపంచుకోనున్నారు. శిక్షణ తర్వాత టైలరింగ్ లో సదరు మహిళలు ఆర్థికార్జనకు అవసరమైన ఇతరత్రా చేయూతను కూడా బాబు సర్కారు అందించనుంది. వెరసి ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని లక్ష మందికి పైగా మహిళలకు లబ్ధి చేకూరనుంది.
90 రోజుల పాటు జరగనున్న టైలరింగ్ శిక్షణా కార్యక్రమాలకు బీసీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (ఈబీఎస్), కాపు సామాజిక వర్గాలకు చెందిన మహిళలు అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ శిక్షణకు అవసరమైన నిధులను బీసీ, ఈబీసీ, కాపు కార్పొరేషన్ల ద్వారానే సమకూరుస్తారు. ఇక ఈ శిక్షణ కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆయా వర్గాలకు చెందిన మహిళలు తమ పేర్లను నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు కానున్న ఈ శిక్షణా కేంద్రాల్లో 70 శాతం హాజరు ఉన్న మహిళలకు మాత్రమే ఉచితంగా కుట్టు మిషన్లను ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
This post was last modified on March 2, 2025 9:47 pm
గత ఏడాది ప్రతిష్ఠాత్మకంగా గద్దర్ అవార్డులను మొదలుపెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. ఒకేసారి చాలా ఏళ్లకు కలిపి అవార్డులు ప్రకటించిన సంగతి…
దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…