భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కడ్ సెలవు రోజు ఆదివారం తెలంగాణ రాజధాని హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. సతీసమేతంగా భాగ్యనగరికి వచ్చిన ధన్ కడ్ కు తెలంగాణ ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలికింది. హైదరాబాద్ టూర్ లో భాగంగా సంగారెడ్డి సమీపంలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ని సందర్శించారు. ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులతో ఆయన ముఖాముఖీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముగించుకుని ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.
తెలుగు నేలకు వచ్చిన ఉపరాష్ట్రపతి ధన్ కడ్ దంపతులకు తెలంగాణ ప్రభుత్వంతో పాటుగా ఏపీ ప్రభుత్వం తరఫున కూడా ఘన స్వాగతం లభించింది. తెలంగాణ సర్కారు నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ ఉపరాష్ట్రపతి ధన్ కడ్ కు స్వాగతం పలికారు. ఏపీ ప్రభుత్వం తరఫున ఆ రాష్ట్రంలో అధికార పార్టీ టీడీపీకి చెందిన శాసన మండలి సభ్యుడు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డితో పాటుగా ఏపీకి చెందిన టీడీపీ రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్ లు ఉపరాష్ట్రపతి దంపతులకు స్వాగతం పలికారు.
ఇదిలా ఉంటే… రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నానంటూ ప్రకటించిన వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి కూడా ఉపరాష్ట్రపతి ధన్ కడ్ దంపతులకు ఘన స్వాగతం పలికారు. రాజకీయాలను వదిలేసి వ్వవసాయం చేసుకుంటానంటూ ప్రకటించిన సాయిరెడ్డి… ఉపరాష్ట్రపతి టూర్ లో ప్రత్యక్షమవడంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇక హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన దన్ కడ్ దంపతులు ఆ తర్వాత తిరిగి ఢిల్లీ వెళ్లిపోయారు.
This post was last modified on March 2, 2025 9:50 pm
త్రివిక్రమ్ అన్నట్టు కొన్ని అద్భుతాలు ఎవరూ ఊహించరు, అవి జరిగినప్పుడు చూస్తూ ఉండిపోవాలంతే. దానికి గొప్ప ఉదాహరణగా బాలీవుడ్ 'హనుమాన్…
పాతిక రోజులకు చేరుకున్నా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తూనే ఉన్న ఇరుముడి ఎట్టకేలకు థియేటర్ రన్ ముగింపుకి వచ్చినట్టే. నెట్…
నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…
శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయన అనుకూల…
మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…
విశాఖపట్నంలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఆశలు గల్లంతవుతున్నాయి. గతంలో ఉన్న పట్టు.. ఇప్పుడు లేకపోవడం.. గతంలో సాయిరెడ్డి వంటి…