భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కడ్ సెలవు రోజు ఆదివారం తెలంగాణ రాజధాని హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. సతీసమేతంగా భాగ్యనగరికి వచ్చిన ధన్ కడ్ కు తెలంగాణ ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలికింది. హైదరాబాద్ టూర్ లో భాగంగా సంగారెడ్డి సమీపంలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ని సందర్శించారు. ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులతో ఆయన ముఖాముఖీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముగించుకుని ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.
తెలుగు నేలకు వచ్చిన ఉపరాష్ట్రపతి ధన్ కడ్ దంపతులకు తెలంగాణ ప్రభుత్వంతో పాటుగా ఏపీ ప్రభుత్వం తరఫున కూడా ఘన స్వాగతం లభించింది. తెలంగాణ సర్కారు నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ ఉపరాష్ట్రపతి ధన్ కడ్ కు స్వాగతం పలికారు. ఏపీ ప్రభుత్వం తరఫున ఆ రాష్ట్రంలో అధికార పార్టీ టీడీపీకి చెందిన శాసన మండలి సభ్యుడు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డితో పాటుగా ఏపీకి చెందిన టీడీపీ రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్ లు ఉపరాష్ట్రపతి దంపతులకు స్వాగతం పలికారు.
ఇదిలా ఉంటే… రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నానంటూ ప్రకటించిన వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి కూడా ఉపరాష్ట్రపతి ధన్ కడ్ దంపతులకు ఘన స్వాగతం పలికారు. రాజకీయాలను వదిలేసి వ్వవసాయం చేసుకుంటానంటూ ప్రకటించిన సాయిరెడ్డి… ఉపరాష్ట్రపతి టూర్ లో ప్రత్యక్షమవడంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇక హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన దన్ కడ్ దంపతులు ఆ తర్వాత తిరిగి ఢిల్లీ వెళ్లిపోయారు.
This post was last modified on March 2, 2025 9:50 pm
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో టెస్ట్ ఎదురు కానుందా? మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం చూస్తున్న నేపథ్యంలో ఆయన ఎవరిని…
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…