భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కడ్ సెలవు రోజు ఆదివారం తెలంగాణ రాజధాని హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. సతీసమేతంగా భాగ్యనగరికి వచ్చిన ధన్ కడ్ కు తెలంగాణ ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలికింది. హైదరాబాద్ టూర్ లో భాగంగా సంగారెడ్డి సమీపంలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ని సందర్శించారు. ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులతో ఆయన ముఖాముఖీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముగించుకుని ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.
తెలుగు నేలకు వచ్చిన ఉపరాష్ట్రపతి ధన్ కడ్ దంపతులకు తెలంగాణ ప్రభుత్వంతో పాటుగా ఏపీ ప్రభుత్వం తరఫున కూడా ఘన స్వాగతం లభించింది. తెలంగాణ సర్కారు నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ ఉపరాష్ట్రపతి ధన్ కడ్ కు స్వాగతం పలికారు. ఏపీ ప్రభుత్వం తరఫున ఆ రాష్ట్రంలో అధికార పార్టీ టీడీపీకి చెందిన శాసన మండలి సభ్యుడు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డితో పాటుగా ఏపీకి చెందిన టీడీపీ రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్ లు ఉపరాష్ట్రపతి దంపతులకు స్వాగతం పలికారు.
ఇదిలా ఉంటే… రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నానంటూ ప్రకటించిన వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి కూడా ఉపరాష్ట్రపతి ధన్ కడ్ దంపతులకు ఘన స్వాగతం పలికారు. రాజకీయాలను వదిలేసి వ్వవసాయం చేసుకుంటానంటూ ప్రకటించిన సాయిరెడ్డి… ఉపరాష్ట్రపతి టూర్ లో ప్రత్యక్షమవడంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇక హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన దన్ కడ్ దంపతులు ఆ తర్వాత తిరిగి ఢిల్లీ వెళ్లిపోయారు.
రిషికొండ ప్యాలెస్… ఏమాత్రం పరిచయం అక్కర్లేని కట్టడం. రిషికొండ ప్యాలెస్ పేరు వినిపిస్తే… ఆ మరుక్షణమే దానిని కట్టించిన వైసీపీ…
ఒకప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్ వాళ్లు ఎంత తక్కువగా చూశారో తెలిసిందే. కానీ ‘బాహుబలి’ సినిమా తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి.…
ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…
ఏపీ సీఎం చంద్రబాబు.. పాలన, ఆయన తీసుకున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులు, భవిష్యత్తు ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణం.. వంటి పలు…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…