Political News

జ‌గ‌న్ చేసిన అన్యాయం.. బాబు, ప‌వ‌న్ చేసిన న్యాయం

2019-24 మ‌ధ్య ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను ప‌రిపాలించిన వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం.. ఆ ఐదేళ్లు చేసిన త‌ప్పుల‌కు ఎన్నిక‌ల్లో భారీ మూల్య‌మే చెల్లించుకుంది. ఐతే త‌మ‌కు తెలిసి జ‌రిగిన త‌ప్పుల‌కు ప్ర‌జ‌లు ఆ శిక్ష వేస్తే.. తెలియ‌ని త‌ప్పుల గురించి కూడా తెలిస్తే ఎలా స్పందించేవారో అని ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క‌మాన‌దు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక మ‌రుగున ప‌డ్డ ఎన్నో త‌ప్పులు బ‌య‌టికి వ‌చ్చాయి.

తాజాగా మంత్రి, జన‌సేన నేత నాదెండ్ల మ‌నోహ‌ర్.. జ‌గ‌న్ స‌ర్కారు చేసిన ఘోర‌మైన త‌ప్పిదం ఒక‌టి బ‌య‌ట‌పెట్టారు. దేశ‌వ్యాప్తంగా తాగునీటి స‌మ‌స్య‌ను తీర్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం కొన్నేళ్లుగాజ‌ల్ జీవ‌న్ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్రాల‌కు వేల కోట్లు ఇస్తోంది. ఒక్క ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు మాత్ర‌మే గ‌త కొన్నేళ్ల‌లో క‌లిపి ఈ ప‌థ‌కం కింద‌ ఏకంగా రూ.14 వేల కోట్లు మంజూరు చేసింద‌ట మోడీ స‌ర్కారు. కానీ జ‌గ‌న్ స‌ర్కారు అందులో ఎంత‌మేర వినియోగించుకుందో తెలిస్తే షాక‌వ‌క త‌ప్ప‌దు.

కేవ‌లం రూ.2200 కోట్ల మేర మాత్ర‌మే ఈ ప‌థ‌కం కింద ఖ‌ర్చు చేసింద‌ట జ‌గ‌న్ ప్ర‌భుత్వం. ఏపీలో ఇంకా తాగునీరు అంద‌ని ప్రాంతాలు, గ్రామాలు బోలెడ‌న్ని ఉన్నాయి. కేంద్రం అంత భారీ మొత్తంలో నిధులు ఇస్తుంటే.. మొత్తం రాష్ట్రంలో ఎక్క‌డా తాగునీటి స‌మ‌స్య లేకుండా చేయ‌డానికి అవ‌కాశ‌ముంది. కానీ జ‌గ‌న్ప్ర‌భుత్వం దీన్ని ఉప‌యోగించుకోలేదు. ఐతే కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక డిప్యూటీ సీఎం ఈ నిధుల విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకున్నార‌ని మ‌నోహ‌ర్ వెల్ల‌డించారు.

నిజానికి మ‌రి కొన్ని నెల‌ల్లోనే ఈ ప‌థకం గ‌డువు ముగిసిపోయేద‌ని, ఐతే ప‌వ‌న్‌తో పాటు చంద్ర‌బాబు కేంద్ర ప్ర‌భుత్వంతో మాట్లాడి.. రాష్ట్రంలో తాగునీటి స‌మ‌స్య లేకుండా చూస్తామ‌ని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విష‌యాన్ని గుర్తు చేసి.. ఈ నిధులు తాము ఉప‌యోగించుకుంటామ‌ని.. రాష్ట్రంలో తాగునీరు అందాల్సిన ప్రాంతాలు చాలా ఉన్నాయ‌ని.. ప‌థ‌కం గ‌డువు పెంచేలా చూశార‌ని మ‌నోహ‌ర్ వెల్ల‌డించారు. వారి విజ్ఞ‌ప్తిని మ‌న్నించి రాష్ట్రంలో ఇంకో నాలుగేళ్ల‌కు ప‌థ‌కాన్ని పొడిగించిన‌ట్లు మ‌నోహ‌ర్ వెల్ల‌డించారు.

Satya

Recent Posts

టాలీవుడ్‌పై బాలీవుడ్ ఏడుపుకిది నిదర్శనం

ఒకప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్ వాళ్లు ఎంత తక్కువగా చూశారో తెలిసిందే. కానీ ‘బాహుబలి’ సినిమా తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి.…

48 minutes ago

జగన్ అటాక్ మోడ్ లోకి వచ్చినట్టేనా…?

ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…

1 hour ago

సీబీఎన్ @ 361 డిగ్రీస్..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. పాల‌న‌, ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలు.. వేస్తున్న అడుగులు, భ‌విష్య‌త్తు ఆంధ్ర ప్ర‌దేశ్ నిర్మాణం.. వంటి ప‌లు…

2 hours ago

పవన్ కొత్త టార్గెట్ ఇదే!

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…

4 hours ago

`అన్న‌లు` నా పార్టీలోనే ఉన్నారు: క‌విత షాకింగ్ కామెంట్స్‌

తెలంగాణ ర‌క్ష‌ణ‌ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడ‌తార‌న్న పేరుంది. పైగా మాట‌ల విష‌యంలో ఆమె…

4 hours ago

అమర్ నాథ్ వ్యాఖ్యలపై అనిత రియాక్షన్

ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…

5 hours ago