కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఎవరో తెలుసు కదా. ఇటీవలి పాన్ ఇండియా సెన్సేషన్ మూవీ పుష్ప హీరో అల్లు అర్జున్ మామ గారు. కంచర్ల కూతురే అల్లు అర్జున్ సతీమణి. అంతేనా తెలంగాణలో అదికార కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న కీలక నేత. పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వెళ్లడం, అక్కడ తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు గాయపడటం… ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ కావడం.. ఇలా వెంటవెంటనే జరిగిన పరిణామాలు కంచర్లను కాంగ్రెస్ కు ఒకింత దూరం చేశాయన్న వాదనలు ఉన్నాయి.
అయితే ఇప్పుడు ఆ దూరం మరింతగా పెరిగే పరిణామం ఒకటి జరిగింది. హైదరాబాద్ లోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ ఎదురుగా ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు (కేబీఆర్ పార్కు) విస్తరణను వ్యతిరేకిస్తూ కంచర్ల తాజాగా హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. కేబీఆర్ పార్కు విస్తరణలో బాగంగా తన ఇంటికి నష్టం కలగని రీతిలో ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలంటూ కంచర్ల తన పిటిషన్ లో హైకోర్టును అభ్యర్థించారు. వాస్తవానికి ఈ రీతిన కోర్టుకెక్కిన వారిలో కంచర్లనే ప్రథములు కాదు. కంచర్ల మాదిరే ఇదివరకే ఓ నలుగురు వ్యక్తులు కేబీఆర్ పార్కు విస్తరణను వ్యతిరేకిస్తూ కోర్టుకు ఎక్కారు.వీరి పిటిషన్లు కోర్టులో విచారణ దశలో ఉన్నాయి. వాటికి ఇప్పుడు కంచర్ల పిటిషన్ అదనంగా జత అయ్యింది.
కేబీఆర్ పార్కు అనేది ఎవరు ఔనన్నా… ఎవరు కాదన్నా… హైదరాబాద్ లో అత్యంత ప్రాదాన్యం కలిగిన ప్రదేశమేనని చెప్పాలి. నిత్యం ఉదయం, సాయంత్రం వేళ ప్రముఖులతో పాటు సాధారణ జనం కూడా ఈ పార్కులో సేదదీరుతూ ఉంటారు. నగరం నడిబొడ్డున ఉన్న ఈ పార్కు మీదుగా ఫ్లై ఓవర్లు, పార్కు కింద అండర్ పాస్ లను ఏర్పాటు చేసే దిశగా రేవంత్ రెడ్డి సర్కారు ఓ ప్రణాళికలను సిద్ధం చేసింది. అయితే కేబీఆర్ పార్కును ఈ ప్రణాళికలు ద్వంసం చేస్తాయని చాలా వర్గాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు పార్కును ఆనుకుని ఇళ్లు కట్టుకున్న కంచర్ల లాంటి ప్రముఖులు తమ ఇళ్లను కాపాడుకునే క్రమంలో ఏకంగా కోర్టుకే ఎక్కారు. మరి ఈ పిటిషన్లపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు గానీ… ఈ పిటిషన్ తో రేవంత్ కు కంచర్ల మరింత దూరమయ్యే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on March 2, 2025 3:24 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…