Political News

ఎస్ఎల్బీసీ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదివారం శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) వద్దకు వెళ్లనున్నారు. ఎల్ఎల్బీసీ సొరంగం పనుల్లో బాగంగా గత నెల 22న ప్రమాదం చోటుచేసుకోగా… సొరంగంలోకి వెళ్లిన చాలా మంది అప్పటికప్పుడు అప్రమత్తమై బయటకు వచ్చేయగా.. ఇద్దరు ఇంజినీర్లు సహా ఆరుగురు కార్మికులు సొరంగంలోనే చిక్కుకుపోయారు. ఈ ప్రమాదం జరిగి ఆదివారం నాటికి దాదాపుగా 9 రోజులు అవుతోంది. ఈ నేపథ్యంలో సొరంగంలోకి చిక్కుకుపోయిన 8 మంది బ్రతికి ఉండే ఛాన్సే లేదని సమాచారం. 8 మంది కూడా బురదలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రమాదం జరిగిన వెంటనే నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అదే రోజున దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ వద్దకు చేరుకున్నారు. రోజంతా అక్కడే ఉండి సొరంగంలో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసే సహాయక చర్యలను ఆయన పరిశీలించారు. ఆ తర్వాత నిత్యం ఉత్తమ్ అదే పని మీద ఉన్నారు. సొరంగం దాదాపుగా 14 కీలో మీటర్లకు పైగా ఉండటం… ఎక్కడికక్కడ నీరు జమ అయిపోతున్న నేపథ్యంలో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఈ కారణంగానే బాధితులను బయటకు తీసుకురావడం కుదరట్లేదు. ఈ క్రమంలో ఉత్తమ్ తో పాటు మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు కూడా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

ఇలాంటి సమయంలో మొన్న బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్లి సహాయక చర్యలపై తమదైన శైలి విమర్శలు గుప్పించారు. ప్రమాదం జరిగి వారం దాటినా సీఎం ఇంకా ఇక్కడికి రానే లేదని వారు ఆరోపించారు. విపక్షాల ఆరోపణలనే కాదు గానీ… సహాయక చర్యలకు ఆటంకం కలిగించకూడదన్న భావనతోనే ఇప్పటిదాకా సీఎం అక్కడికి వెళ్లలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సహాయక చర్యలు తుది దశకు చేరుకున్న సమయంలో ఆదివారం దోమలపెంట వెళ్లేందుకు రేవంత్ సిద్ధమయ్యారు. ఆదివారం సాయంత్రం ఆయన వనపర్తి నుంచి నేరుగా దోమలపెంట వెళ్లనున్నారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను పరిశీలించనున్న ఆయన… అక్కడే ఉన్నతాధికారులతో ఓ అత్యున్నత స్థాయి సమీక్షను నిర్వహించనున్నారు. ఈ సమీక్ష తర్వాత సహాయక చర్యలు మరింత ముమ్మరం కానున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.

This post was last modified on March 2, 2025 12:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

19 minutes ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

8 hours ago