Political News

చంద్రబాబు డబుల్ ధమాకా.. 2 లక్షల మందికి లబ్ధి

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం తన సొంత జిల్లా చిత్తూరు పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. సామాజిక పింఛన్ల పంపిణీలో పాలుపంచుకునే నిమిత్తం చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు నియోజకవర్గ పరిధిలోని రామానాయుడుపల్లెకు వెళ్లారు. అక్కడ పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లిన చంద్రబాబు… ఆయా కుటుంబ సభ్యులతో హుషారుగా గడిపారు. ఆయా కుటుంబాల సమస్యలను అడిగి తెలుసుకుని మరీ వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఇద్దరు బాలికలకు రెండేసి లక్షల రూపాయల చొప్పున డిపాజిట్ చేసి… వారి భవిష్యత్తుకు భరోసా ఇచ్చారు. ఈ పర్యటనకు బయలుదేరే ముందే చంద్రబాబు రెండు కీలక నిర్ణయాలపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మరీ తన ఇంటి నుంచి బయలుదేరారు.

చంద్రబాబు తీసుకున్న ఆ రెండు నిర్ణయాల కారణంగా ఏకంగా 2 లక్షల మంది దాకా ఉద్యోగులకు భారీ ఊరట లబించిందని చెప్పాలి. వాటిలో మొదటిదాని విషయానికి వస్తే… రాష్ట్రంలో గ్రామ స్వరాజ్యం అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రామాలు, పట్టణాల్లో గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వీటిలో జగన్ సర్కారు ఏకంగా 1.6 లక్షల మంది ఉద్యోగులను నియమించింది. ప్రభుత్వ నిబంధనల మేరకే వీరి నియామకం జరగడంతో వాలంటీర్ల మాదిరిగా వీరిని సర్వీసు నుంచి తొలగించడం కుదరలేదు.

దీంతో వీరి సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించిన చంద్రబాబు సర్కారు… వారిని ఆయా సచివాలయాల్లో సర్దుబాటు, మిగిలిన వారిని ఇతర శాఖలకు మళ్లించడం వంటి హేతుబద్ధీకరణకు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి శనివారం చంద్రబాబు ఆమోద ముద్ర వేశారు. ఫలితంగా 1.6 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆయన ఉద్యోగ భద్రతను కల్పించినట్లైంది.

ఇక చంద్రబాబు తీసుకున్న రెండో నిర్ణయం ఏమిటంటే… రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న ఆశా వర్కర్ల రిటైర్ మెంట్ వయసును ఏపీ ప్రభుత్వం 62 ఏళ్లకు పెంచింది. అంటే… వారి కొలువుల కాల పరిమితిని మరో రెండేళ్లు పెంచడమే కదా. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో పనిచేస్తున్న దాదాపు 42 వేల మంది ఆశా వర్కర్లకు లబ్ధి చేకూరనుంది. ఇక వీరికి ఇప్పటిదాకా అందుతున్న ఇతరత్రా ప్రయోజనాలను కూడా మరింతగా పెంచుతూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

ఆశా వర్కర్లకు తొలి రెండు ప్రసవాలకు 180 రోజుల చొప్పున వేతనంతో కూడిన సెలవును మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగ విరమణ తర్వాత ఇతర శాఖల ఉద్యోగుల మాదిరే ఆశా వర్కర్లకు కూడా ఆర్థిక భరోసా అందించేలా గ్రాట్యూటీ ఇవ్వాలని కూడా చంద్రబాబు సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో పదవీ విరమణ సమయంలో ఒక్కో ఆశా వర్కర్ కు రూ.1.5 లక్షల మేర ప్రయోజనం దక్కనుంది.

Satya

Recent Posts

టాలీవుడ్‌పై బాలీవుడ్ ఏడుపుకిది నిదర్శనం

ఒకప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్ వాళ్లు ఎంత తక్కువగా చూశారో తెలిసిందే. కానీ ‘బాహుబలి’ సినిమా తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి.…

47 minutes ago

జగన్ అటాక్ మోడ్ లోకి వచ్చినట్టేనా…?

ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…

1 hour ago

సీబీఎన్ @ 361 డిగ్రీస్..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. పాల‌న‌, ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలు.. వేస్తున్న అడుగులు, భ‌విష్య‌త్తు ఆంధ్ర ప్ర‌దేశ్ నిర్మాణం.. వంటి ప‌లు…

2 hours ago

పవన్ కొత్త టార్గెట్ ఇదే!

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…

4 hours ago

`అన్న‌లు` నా పార్టీలోనే ఉన్నారు: క‌విత షాకింగ్ కామెంట్స్‌

తెలంగాణ ర‌క్ష‌ణ‌ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడ‌తార‌న్న పేరుంది. పైగా మాట‌ల విష‌యంలో ఆమె…

4 hours ago

అమర్ నాథ్ వ్యాఖ్యలపై అనిత రియాక్షన్

ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…

5 hours ago