Political News

చంద్రబాబు డబుల్ ధమాకా.. 2 లక్షల మందికి లబ్ధి

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం తన సొంత జిల్లా చిత్తూరు పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. సామాజిక పింఛన్ల పంపిణీలో పాలుపంచుకునే నిమిత్తం చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు నియోజకవర్గ పరిధిలోని రామానాయుడుపల్లెకు వెళ్లారు. అక్కడ పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లిన చంద్రబాబు… ఆయా కుటుంబ సభ్యులతో హుషారుగా గడిపారు. ఆయా కుటుంబాల సమస్యలను అడిగి తెలుసుకుని మరీ వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఇద్దరు బాలికలకు రెండేసి లక్షల రూపాయల చొప్పున డిపాజిట్ చేసి… వారి భవిష్యత్తుకు భరోసా ఇచ్చారు. ఈ పర్యటనకు బయలుదేరే ముందే చంద్రబాబు రెండు కీలక నిర్ణయాలపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మరీ తన ఇంటి నుంచి బయలుదేరారు.

చంద్రబాబు తీసుకున్న ఆ రెండు నిర్ణయాల కారణంగా ఏకంగా 2 లక్షల మంది దాకా ఉద్యోగులకు భారీ ఊరట లబించిందని చెప్పాలి. వాటిలో మొదటిదాని విషయానికి వస్తే… రాష్ట్రంలో గ్రామ స్వరాజ్యం అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రామాలు, పట్టణాల్లో గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వీటిలో జగన్ సర్కారు ఏకంగా 1.6 లక్షల మంది ఉద్యోగులను నియమించింది. ప్రభుత్వ నిబంధనల మేరకే వీరి నియామకం జరగడంతో వాలంటీర్ల మాదిరిగా వీరిని సర్వీసు నుంచి తొలగించడం కుదరలేదు.

దీంతో వీరి సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించిన చంద్రబాబు సర్కారు… వారిని ఆయా సచివాలయాల్లో సర్దుబాటు, మిగిలిన వారిని ఇతర శాఖలకు మళ్లించడం వంటి హేతుబద్ధీకరణకు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి శనివారం చంద్రబాబు ఆమోద ముద్ర వేశారు. ఫలితంగా 1.6 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆయన ఉద్యోగ భద్రతను కల్పించినట్లైంది.

ఇక చంద్రబాబు తీసుకున్న రెండో నిర్ణయం ఏమిటంటే… రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న ఆశా వర్కర్ల రిటైర్ మెంట్ వయసును ఏపీ ప్రభుత్వం 62 ఏళ్లకు పెంచింది. అంటే… వారి కొలువుల కాల పరిమితిని మరో రెండేళ్లు పెంచడమే కదా. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో పనిచేస్తున్న దాదాపు 42 వేల మంది ఆశా వర్కర్లకు లబ్ధి చేకూరనుంది. ఇక వీరికి ఇప్పటిదాకా అందుతున్న ఇతరత్రా ప్రయోజనాలను కూడా మరింతగా పెంచుతూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

ఆశా వర్కర్లకు తొలి రెండు ప్రసవాలకు 180 రోజుల చొప్పున వేతనంతో కూడిన సెలవును మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగ విరమణ తర్వాత ఇతర శాఖల ఉద్యోగుల మాదిరే ఆశా వర్కర్లకు కూడా ఆర్థిక భరోసా అందించేలా గ్రాట్యూటీ ఇవ్వాలని కూడా చంద్రబాబు సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో పదవీ విరమణ సమయంలో ఒక్కో ఆశా వర్కర్ కు రూ.1.5 లక్షల మేర ప్రయోజనం దక్కనుంది.

Satya

Recent Posts

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

1 hour ago

రాజాసాబ్‌ ఫలితంతో నాకు స‌బంధం లేదు – ఎస్కేఎన్

ప్ర‌భాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ల‌లో ఒక‌ట‌వుతుంద‌ని అభిమానులు అంచ‌నాలు పెట్టుకున్న చిత్రం.. రాజాసాబ్. ముందు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ప్రభాస్ సినిమా…

1 hour ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

3 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

3 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

4 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

4 hours ago