శనివారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఓ ఘటన నిజంగానే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రాజకీయాల్లో తూటాల్లాంటి మాటలను పేల్చడమే కాకుండా… ప్రత్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేయగల సత్తా కలిగిన ఓ పవర్ ఫుల్ నేతగానే జనానికి తెలిసిన బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి గుండకంట్ల జగదీశ్ రెడ్డి… చిన్న పిల్లాడికి మల్లే వెక్కి వెక్కి ఏడ్చేసినంత పనిచేశారు. ఉబికి వస్తున్న కన్నీటిని ఆయన ఆపుకోలేకపోయారు. ఎంత ఆపుకుందామనుకున్నా… ఆగకుండా ధారగా కారుతున్న కన్నీటిని ఆయన చేతి రుమాలుతో తుడుచుకుంటూ తీవ్ర భావోద్వేగంలో ముగినిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నిజంగానే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది.
అయినా జగదీశ్ రెడ్డిని అంతగా ఇబ్బందికి, భావోద్వేగానికి గురి చేసిన అంశం ఏమిటన్న విషయంలోకి వెళ్లిపోదాం పదండి. సూర్యాపేట జిల్లాకు చెందిన జగదీశ్ రెడ్డి శనివారం తన జిల్లా పరిధిలోనే పెన్ పహాడ్ మండలం చిన్న గారకుంట తండా, గాజుల మల్కాపురంలలో పర్యటించారు. ఈ సందర్భంగా సాగునీరు అందక ఎండిపోతున్న పచ్చని పొలాలు ఆయన కంటబడ్డాయి. ఎంతైనా జగదీశ్ రెడ్డి కూడా రైతు బిడ్డే కదా. కాల్వలు అందుబాటులో ఉన్నా… సాగు నీరందక పంటలు ఎండిపోతున్న వైనాన్ని చూపుతూ ప్రభుత్వాన్ని నిలదీద్దామన్న భావనతో ఆయన మీడియా ప్రతినిధులను కూడా పిలిచారు. మీడియాతో మాట్లాడేందుకు సిద్ధమైన సందర్భంగా ఒక్కసారిగా జగదీశ్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక… సాగు నీటి ప్రాజెక్టులు పెద్ద ఎత్తున నిర్మాణం జరిగింది. ఫలితంగా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం కూడా భారీగానే పెరిగింది. గడచిన పదేళ్ల పాటు కేసీఆర్ కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా పనిచేసిన జగదీశ్ రెడ్డి… బీఆర్ఎస్ పాలనలో రైతులకు న్యాయం జరిగిందని వాదిస్తారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ఆయన ఆరోపిస్తున్నారు. కాలువలు ఉన్నా నీటి లభ్యత లేకుండా పోయిందని గత కొంత కాలంగా బీఆర్ఎస్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఫలితంగా ఎలాంటి పచ్చని పంట పొలాలు… ఇలా నీళ్లు లేక ఎండిపోతున్న వైనాన్ని చూసి తట్టుకోలేక జగదీశ్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారని చెప్పాలి.
This post was last modified on March 1, 2025 5:17 pm
ఏపీ సీఎం చంద్రబాబు... `బీసీ బాబు`గా మారనున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారా? అంటే.. ఔననే…
జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…