శనివారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఓ ఘటన నిజంగానే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రాజకీయాల్లో తూటాల్లాంటి మాటలను పేల్చడమే కాకుండా… ప్రత్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేయగల సత్తా కలిగిన ఓ పవర్ ఫుల్ నేతగానే జనానికి తెలిసిన బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి గుండకంట్ల జగదీశ్ రెడ్డి… చిన్న పిల్లాడికి మల్లే వెక్కి వెక్కి ఏడ్చేసినంత పనిచేశారు. ఉబికి వస్తున్న కన్నీటిని ఆయన ఆపుకోలేకపోయారు. ఎంత ఆపుకుందామనుకున్నా… ఆగకుండా ధారగా కారుతున్న కన్నీటిని ఆయన చేతి రుమాలుతో తుడుచుకుంటూ తీవ్ర భావోద్వేగంలో ముగినిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నిజంగానే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది.
అయినా జగదీశ్ రెడ్డిని అంతగా ఇబ్బందికి, భావోద్వేగానికి గురి చేసిన అంశం ఏమిటన్న విషయంలోకి వెళ్లిపోదాం పదండి. సూర్యాపేట జిల్లాకు చెందిన జగదీశ్ రెడ్డి శనివారం తన జిల్లా పరిధిలోనే పెన్ పహాడ్ మండలం చిన్న గారకుంట తండా, గాజుల మల్కాపురంలలో పర్యటించారు. ఈ సందర్భంగా సాగునీరు అందక ఎండిపోతున్న పచ్చని పొలాలు ఆయన కంటబడ్డాయి. ఎంతైనా జగదీశ్ రెడ్డి కూడా రైతు బిడ్డే కదా. కాల్వలు అందుబాటులో ఉన్నా… సాగు నీరందక పంటలు ఎండిపోతున్న వైనాన్ని చూపుతూ ప్రభుత్వాన్ని నిలదీద్దామన్న భావనతో ఆయన మీడియా ప్రతినిధులను కూడా పిలిచారు. మీడియాతో మాట్లాడేందుకు సిద్ధమైన సందర్భంగా ఒక్కసారిగా జగదీశ్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక… సాగు నీటి ప్రాజెక్టులు పెద్ద ఎత్తున నిర్మాణం జరిగింది. ఫలితంగా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం కూడా భారీగానే పెరిగింది. గడచిన పదేళ్ల పాటు కేసీఆర్ కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా పనిచేసిన జగదీశ్ రెడ్డి… బీఆర్ఎస్ పాలనలో రైతులకు న్యాయం జరిగిందని వాదిస్తారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ఆయన ఆరోపిస్తున్నారు. కాలువలు ఉన్నా నీటి లభ్యత లేకుండా పోయిందని గత కొంత కాలంగా బీఆర్ఎస్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఫలితంగా ఎలాంటి పచ్చని పంట పొలాలు… ఇలా నీళ్లు లేక ఎండిపోతున్న వైనాన్ని చూసి తట్టుకోలేక జగదీశ్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారని చెప్పాలి.
This post was last modified on March 1, 2025 5:17 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…