2024 ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం వైసీపీని ఒక్కొక్కరూ వీడుతోన్న సంగతి తెలిసిందే. బాలినేని మొదలు మోపిదేవి వరకు జగన్ కు సన్నిహితంగా ఉండే నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఇలా, వైసీపీలో అంతర్యుద్ధం మొదలై పీక్స్ కు చేరుకుంటున్న తరుణంలో కూటమి ప్రభుత్వంలో అంతర్యుద్ధం మొదలైంది అంటూ వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలకు హోం మంత్రి అనిత కౌంటర్ ఇచ్చారు.
కూటమిలో అంతర్యుద్ధం లేదని.. వైసీపీలో అంతర్యుద్ధం రాకుండా వైసీపీ నేతలు చూసుకోవాలని హోం మంత్రి అనిత చురకలంటించారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే కుదరదని, ఇది ఎన్డీయే ప్రభుత్వమని అన్నారు. వాక్ స్వాతంత్ర్యం ఉందని ఏది పడితే అది మాట్లాడితే కుదరదని వార్నింగ్ ఇచ్చారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని, రెడ్ బుక్ ఫాలో అయితే వైసీపీ నేతలెవరూ రోడ్లపై తిరగలేరని హెచ్చరించారు.
ఇక, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళిపై రాష్ట్రవ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయని అనిత వెల్లడించారు. తాము కక్షా రాజకీయాలకు పాల్పడడం లేదని, తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తున్నామని క్లారిటీనిచ్చారు. పోసానికి సజ్జల రామకృష్ణారెడ్డి లేదా మరెవరో స్క్రిప్ట్ ఇచ్చినా…అనుభవించేది ‘రాజా’నే అంటూ పోసానిపై సెటైర్లు వేశారు. గత ఐదేళ్లలో పోలీస్ శాఖలో 900 కోట్లు బకాయి పెట్టారని, అవన్నీ తాము తీరుస్తున్నామని అన్నారు. ఏపీకీ ‘అప్పా’ లేదని, గ్రే హౌండ్స్ బెటాలియన్ లేదని, త్వరలో ‘అప్పా’కు భూమి పూజ చేస్తామని అనిత తెలిపారు.
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…
మళ్ళీ ఓజి 2 హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి పవన్, దర్శకుడు సుజిత్…
హీరోల స్టార్ పవర్ పెద్దగా పని చేయట్లేదు ఈ రోజుల్లో. కంటెంట్ను బట్టే సినిమాలు చూస్తున్నారు. స్టార్లను చూసి ఎగబడి…
టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…
బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…