Political News

వైసీపీ నేతలకు అనిత మాస్ వార్నింగ్!

2024 ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం వైసీపీని ఒక్కొక్కరూ వీడుతోన్న సంగతి తెలిసిందే. బాలినేని మొదలు మోపిదేవి వరకు జగన్ కు సన్నిహితంగా ఉండే నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఇలా, వైసీపీలో అంతర్యుద్ధం మొదలై పీక్స్ కు చేరుకుంటున్న తరుణంలో కూటమి ప్రభుత్వంలో అంతర్యుద్ధం మొదలైంది అంటూ వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలకు హోం మంత్రి అనిత కౌంటర్ ఇచ్చారు.

కూటమిలో అంతర్యుద్ధం లేదని.. వైసీపీలో అంతర్యుద్ధం రాకుండా వైసీపీ నేతలు చూసుకోవాలని హోం మంత్రి అనిత చురకలంటించారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే కుదరదని, ఇది ఎన్డీయే ప్రభుత్వమని అన్నారు. వాక్ స్వాతంత్ర్యం ఉందని ఏది పడితే అది మాట్లాడితే కుదరదని వార్నింగ్ ఇచ్చారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని, రెడ్ బుక్ ఫాలో అయితే వైసీపీ నేతలెవరూ రోడ్లపై తిరగలేరని హెచ్చరించారు.

ఇక, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళిపై రాష్ట్రవ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయని అనిత వెల్లడించారు. తాము కక్షా రాజకీయాలకు పాల్పడడం లేదని, తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తున్నామని క్లారిటీనిచ్చారు. పోసానికి సజ్జల రామకృష్ణారెడ్డి లేదా మరెవరో స్క్రిప్ట్ ఇచ్చినా…అనుభవించేది ‘రాజా’నే అంటూ పోసానిపై సెటైర్లు వేశారు. గత ఐదేళ్లలో పోలీస్ శాఖలో 900 కోట్లు బకాయి పెట్టారని, అవన్నీ తాము తీరుస్తున్నామని అన్నారు. ఏపీకీ ‘అప్పా’ లేదని, గ్రే హౌండ్స్ బెటాలియన్ లేదని, త్వరలో ‘అప్పా’కు భూమి పూజ చేస్తామని అనిత తెలిపారు.

This post was last modified on March 1, 2025 5:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

19 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago