Political News

వైసీపీ నేతలకు అనిత మాస్ వార్నింగ్!

2024 ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం వైసీపీని ఒక్కొక్కరూ వీడుతోన్న సంగతి తెలిసిందే. బాలినేని మొదలు మోపిదేవి వరకు జగన్ కు సన్నిహితంగా ఉండే నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఇలా, వైసీపీలో అంతర్యుద్ధం మొదలై పీక్స్ కు చేరుకుంటున్న తరుణంలో కూటమి ప్రభుత్వంలో అంతర్యుద్ధం మొదలైంది అంటూ వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలకు హోం మంత్రి అనిత కౌంటర్ ఇచ్చారు.

కూటమిలో అంతర్యుద్ధం లేదని.. వైసీపీలో అంతర్యుద్ధం రాకుండా వైసీపీ నేతలు చూసుకోవాలని హోం మంత్రి అనిత చురకలంటించారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే కుదరదని, ఇది ఎన్డీయే ప్రభుత్వమని అన్నారు. వాక్ స్వాతంత్ర్యం ఉందని ఏది పడితే అది మాట్లాడితే కుదరదని వార్నింగ్ ఇచ్చారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని, రెడ్ బుక్ ఫాలో అయితే వైసీపీ నేతలెవరూ రోడ్లపై తిరగలేరని హెచ్చరించారు.

ఇక, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళిపై రాష్ట్రవ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయని అనిత వెల్లడించారు. తాము కక్షా రాజకీయాలకు పాల్పడడం లేదని, తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తున్నామని క్లారిటీనిచ్చారు. పోసానికి సజ్జల రామకృష్ణారెడ్డి లేదా మరెవరో స్క్రిప్ట్ ఇచ్చినా…అనుభవించేది ‘రాజా’నే అంటూ పోసానిపై సెటైర్లు వేశారు. గత ఐదేళ్లలో పోలీస్ శాఖలో 900 కోట్లు బకాయి పెట్టారని, అవన్నీ తాము తీరుస్తున్నామని అన్నారు. ఏపీకీ ‘అప్పా’ లేదని, గ్రే హౌండ్స్ బెటాలియన్ లేదని, త్వరలో ‘అప్పా’కు భూమి పూజ చేస్తామని అనిత తెలిపారు.

This post was last modified on March 1, 2025 5:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

26 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

5 hours ago