ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినంతనే… వైసీపీ హయాంలో మీడియా, సోషల్ మీడియా వేదికలుగా వైరి వర్గాల నేతలు, వారి కుటుంబాలపై విచక్షణ లేకుండా వ్యాఖ్యలు చేసిన వారు వరుసగా అరెస్ట్ అవుతూ వస్తున్నారు. ఈ తరహా అరెస్టులపై అటు వైసీపీతో పాటు కొన్ని మీడియా సంస్థలు గగ్గోలు పెడుతున్నాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో అమలు అవుతోందని, అందులో భాగంగానే విపక్షానికి చెందిన నేతలను అరెస్ట్ చేస్తున్నారన్న విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి. ఈ తరహా ప్రశ్నలకు జనసేన కీలక నేత, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ శనివారం అదిరిపోయే సమాధానం ఇచ్చారు.
శనివారం కందుల దుర్గేశ్ మీడియా సమావేశం ఏర్పాటు చేయగా… అందులోనూ కొందరు మీడియా ప్రతినిధుల నుంచి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందంటూ ఓ ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్న విన్నంతనే… వెంటనే రియాక్ట్ అయిన మంత్రి… ఒక్కటంటే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా సమాధానం ఇచ్చారు. కక్షపూరితంగా వ్యవహరిస్తున్నామంటే… తాము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఈ అరెస్టులు జరిగేవి కదా అంటూ మంత్రి దుర్గేశ్ సమాధానమిచ్చారు. ఈ ఒక్క ప్రశ్నతో రెడ్ బుక్ తరహా ప్రశ్నలన్నింటికీ దుర్గేశ్ సింగిల్ మాటతో ఆన్సరిచ్చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇక ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్టును ప్రస్తావించిన మీడియా ప్రతినిధులు… పోసాని వ్యాఖ్యల వెనుక వైసీపీ కీలక నేత, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం ఉందని చెప్పారు కదా అని గుర్తు చేశారు. పోసాని చెప్పిన దాని ప్రకారం సజ్జలపై చర్యలు ఉంటాయా? అని కూడా మీడియా ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు కూడా తనదైన శైలిలో సమాధానం ఇచ్చిన దుర్గేశ్ చట్టం తన పని తాను చేసుకుపోతుందని బదులిచ్చారు. ఈ మాటకు ముందు ఆయన రొటీన్ డైలాగే అయినా ఇదే కరెక్ట్ సమాధానమని వ్యాఖ్యానించి మీడియా ప్రతినిధులను నవ్వుల్లో ముంచేశారు.
This post was last modified on March 1, 2025 1:48 pm
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…
ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…
దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…