ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినంతనే… వైసీపీ హయాంలో మీడియా, సోషల్ మీడియా వేదికలుగా వైరి వర్గాల నేతలు, వారి కుటుంబాలపై విచక్షణ లేకుండా వ్యాఖ్యలు చేసిన వారు వరుసగా అరెస్ట్ అవుతూ వస్తున్నారు. ఈ తరహా అరెస్టులపై అటు వైసీపీతో పాటు కొన్ని మీడియా సంస్థలు గగ్గోలు పెడుతున్నాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో అమలు అవుతోందని, అందులో భాగంగానే విపక్షానికి చెందిన నేతలను అరెస్ట్ చేస్తున్నారన్న విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి. ఈ తరహా ప్రశ్నలకు జనసేన కీలక నేత, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ శనివారం అదిరిపోయే సమాధానం ఇచ్చారు.
శనివారం కందుల దుర్గేశ్ మీడియా సమావేశం ఏర్పాటు చేయగా… అందులోనూ కొందరు మీడియా ప్రతినిధుల నుంచి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందంటూ ఓ ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్న విన్నంతనే… వెంటనే రియాక్ట్ అయిన మంత్రి… ఒక్కటంటే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా సమాధానం ఇచ్చారు. కక్షపూరితంగా వ్యవహరిస్తున్నామంటే… తాము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఈ అరెస్టులు జరిగేవి కదా అంటూ మంత్రి దుర్గేశ్ సమాధానమిచ్చారు. ఈ ఒక్క ప్రశ్నతో రెడ్ బుక్ తరహా ప్రశ్నలన్నింటికీ దుర్గేశ్ సింగిల్ మాటతో ఆన్సరిచ్చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇక ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్టును ప్రస్తావించిన మీడియా ప్రతినిధులు… పోసాని వ్యాఖ్యల వెనుక వైసీపీ కీలక నేత, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం ఉందని చెప్పారు కదా అని గుర్తు చేశారు. పోసాని చెప్పిన దాని ప్రకారం సజ్జలపై చర్యలు ఉంటాయా? అని కూడా మీడియా ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు కూడా తనదైన శైలిలో సమాధానం ఇచ్చిన దుర్గేశ్ చట్టం తన పని తాను చేసుకుపోతుందని బదులిచ్చారు. ఈ మాటకు ముందు ఆయన రొటీన్ డైలాగే అయినా ఇదే కరెక్ట్ సమాధానమని వ్యాఖ్యానించి మీడియా ప్రతినిధులను నవ్వుల్లో ముంచేశారు.
This post was last modified on March 1, 2025 1:48 pm
టిల్లు సిరీస్ తర్వాత సిద్దు జొన్నలగడ్డ చేస్తున్న సినిమాగా జాక్ మీద ఈపాటికి భారీ అంచనాలు నెలకొనాలి. అయితే బయట…
ఏపీ సీఎం చంద్రబాబుపై జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరోసారి పొగడ్తల వర్షం కురిపించారు. బాబు ఔదార్యం…
దేశంలో మహిళలు, బాలికలకు భద్రతే లేకుండా పోయింది. ఈ మాటలు కాస్తంత కఠువుగా ఉన్నా.. వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలు…
కొన్ని పాత్రల విషయంలో మేకర్స్ చాలా పర్టికులర్గా ఉంటారు. ఒక పాత్రను ఫలానా వాళ్లు చేస్తేనే సినిమా చేయాలని లేదంటే లేదని…
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకుంటున్న పలు నిర్ణయాలు ప్రవాస భారతీయుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోన్న సంగతి…
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం అల్లూరి సీతారామ రాజు జిల్లా పర్యటనకు వెళ్లారు. గిరి…