ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినంతనే… వైసీపీ హయాంలో మీడియా, సోషల్ మీడియా వేదికలుగా వైరి వర్గాల నేతలు, వారి కుటుంబాలపై విచక్షణ లేకుండా వ్యాఖ్యలు చేసిన వారు వరుసగా అరెస్ట్ అవుతూ వస్తున్నారు. ఈ తరహా అరెస్టులపై అటు వైసీపీతో పాటు కొన్ని మీడియా సంస్థలు గగ్గోలు పెడుతున్నాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో అమలు అవుతోందని, అందులో భాగంగానే విపక్షానికి చెందిన నేతలను అరెస్ట్ చేస్తున్నారన్న విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి. ఈ తరహా ప్రశ్నలకు జనసేన కీలక నేత, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ శనివారం అదిరిపోయే సమాధానం ఇచ్చారు.
శనివారం కందుల దుర్గేశ్ మీడియా సమావేశం ఏర్పాటు చేయగా… అందులోనూ కొందరు మీడియా ప్రతినిధుల నుంచి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందంటూ ఓ ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్న విన్నంతనే… వెంటనే రియాక్ట్ అయిన మంత్రి… ఒక్కటంటే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా సమాధానం ఇచ్చారు. కక్షపూరితంగా వ్యవహరిస్తున్నామంటే… తాము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఈ అరెస్టులు జరిగేవి కదా అంటూ మంత్రి దుర్గేశ్ సమాధానమిచ్చారు. ఈ ఒక్క ప్రశ్నతో రెడ్ బుక్ తరహా ప్రశ్నలన్నింటికీ దుర్గేశ్ సింగిల్ మాటతో ఆన్సరిచ్చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇక ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్టును ప్రస్తావించిన మీడియా ప్రతినిధులు… పోసాని వ్యాఖ్యల వెనుక వైసీపీ కీలక నేత, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం ఉందని చెప్పారు కదా అని గుర్తు చేశారు. పోసాని చెప్పిన దాని ప్రకారం సజ్జలపై చర్యలు ఉంటాయా? అని కూడా మీడియా ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు కూడా తనదైన శైలిలో సమాధానం ఇచ్చిన దుర్గేశ్ చట్టం తన పని తాను చేసుకుపోతుందని బదులిచ్చారు. ఈ మాటకు ముందు ఆయన రొటీన్ డైలాగే అయినా ఇదే కరెక్ట్ సమాధానమని వ్యాఖ్యానించి మీడియా ప్రతినిధులను నవ్వుల్లో ముంచేశారు.
This post was last modified on March 1, 2025 1:48 pm
నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిణామాలను గమనిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్కు యువత పెద్ద ఎత్తున…
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ డెబ్యూ ఫలితం తేలిపోయింది. కుర్రాడి నటనకు కాసిన్ని ప్రశంసలు దక్కినప్పటికీ కంటెంట్ పరంగా…
త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు తెరదీయనున్నారు. సెప్టెంబరు-అక్టోబరు మధ్య మునిసిపాలిటీ… నవంబరు-డిసెంబరు మధ్య కార్పోరేషన్లు, జనవరిలో పంచాయతీ ఎన్నికలు…
శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్…
ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా…