Political News

2029లోనూ టికెట్ కావాలంటే… ఏం చేయాలో చెప్పిన బాబు

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కీలక ఘట్టమైన బడ్జెట్ ప్రవేశపెట్టడం శుక్రవారం పూర్తి అయ్యింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ 2025-26 వార్షిక బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం వ్యవసాయ శాఖ బడ్జెట్ ను ఆ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సభ్యులకు ప్రత్యేకించి కొత్తగా సభకు ఎన్నికైన సభ్యులను ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

బడ్జెట్ పై సమగ్ర అధ్యయనం చేయాలని… ఆయా పద్దులపై సమగ్ర అవగాహన పెంచుకోవాలని… ప్రభుత్వ కేటాయింపులను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని.. బడ్జెట్ పై జరిగే ప్రసంగంలో ప్రతి ఒక్కరూ చురుగ్గా పాలుపంచుకోవాలని… ఏదో సుదీర్ఘంగా మాట్లాడటం కాకుండా అతి తక్కువ సమయంలో బడ్జెట్ స్వరూపాన్ని ఆసక్తిగా అభివర్ణించేలా చేయాలని… ఇలా పలు సూచనలు చేశారు.

అనంతరం సభను స్పీకర్ సోమవారానికి వాయిదా వేయగా… టీడీపీ సభ్యులతో ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు టీడీఎల్పీ భేటీని నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న చెప్పిన మాటలనే చంద్రబాబు కూడా మరోమారు చెప్పారు. బడ్జెట్ స్వరూపం… నిధుల లేమిలో కూడా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా కేటాయింపులు జరిపిన తీరుపై ఒకింత లెంగ్తీగానే మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ ఎమ్మెల్యేలు… ప్రత్యేకించి నూతన ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

2029లో మరోమారు పార్టీ టికెట్లు కావాలంటే.. పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రజలతో మమేకం అవడంతో పాటుగా ప్రభుత్వం చేస్తున్న మంచిని వారికి వివరించాలన్నారు. పార్టీలో విభేదాలు లేకుండా చూసుకోవాలన్నారు. ఎంపీలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. అంతిమంగా పార్టీపైనా, ప్రభుత్వంపైనా ప్రజల్లో సద్భావన కలిగేలా చేయాలని ఆయన సూచించారు.

ఇవన్నీ చేస్తే… 2029 ఎన్నికల్లోనూ రెండో సారి కూడా టికెట్ దక్కుతుందని చంద్రబాబు కొత్త ఎమ్మెల్యేలకు చెప్పారు. అయితే ఇదేమంత ఈజీ అయిన విషయం కాదని కూడా ఆయన అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలపై నిత్యం అవగాహన పెంపొందించుకుంటూ ఉండాలన్నారు. వాటిని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయాలన్నారు. అలా జరగాలంటే నిత్యం ప్రజల్లోనే ఉండాలన్నారు. పార్టీ కార్యక్రమాలతో పాటుగా ప్రభుత్వ కార్యక్రమాలకు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. ఫలితంగా పార్టీపైనా, ప్రభుత్వ వ్యవహారాల మీద పట్టు వస్తుందన్నారు.

ఇవన్నీ చేసే ఏ నేత అయినా ఓటమిని ఎరుగకుండా ముందుకు సాగుతారని ఆయన చెప్పుకొచ్చారు . మొత్తంగా ప్రజా ప్రతినిధులుగా నిత్యం ప్రజలతోనే ఉండే నేతలకు తిరుగు లేదని… అలాంటి వారికి మరోమారు టికెట్ ఇచ్చేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా చంద్రబాబు చెప్పుకొచ్చారు.

This post was last modified on February 28, 2025 6:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

1 hour ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

4 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

7 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

10 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago