తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ ఎస్ కీలక నేత హరీష్రావుపై హైదరాబాద్ లోని బాచుపల్లి పోలీసులు.. కేసు నమోదు చేశారు. తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని.. తనకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ .. బాచుపల్లికి చెందిన చక్రధర్ గౌడ్ అనే 42 ఏళ్ల వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు. హరీష్ రావుతో పాటు.. సంతోష్కుమార్, రాములు, వంశీ అనే వ్యక్తులు తనను బెదిరిస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నా రు. వారినుంచి తనకు ప్రాణ రక్షణ కల్పించాలని వేడుకున్నారు.
చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీసులు హరీష్రావుపై భారతీయ న్యాయ సంహిత (బీ ఎన్ ఎస్)లోని సెక్షన్ 351(2)(నేర పూరిత కుట్ర), రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనంతరం ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. దీనిలో రెండో నిందితుడిగా(ఏ-2) హరీష్రావును పేర్కొన్నారు. త్వరలోనే ఆయనకు నోటీసులు ఇవ్వనున్నట్టు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అన్ని కోణాల్లోనూ పరిశీలించిన తర్వాతే.. ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.
టన్నెల్ పై తగువు!
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాద ఘటన రాజకీయంగా దుమారానికి దారి తీసింది. ఇక్కడకు మాజీ మంత్రి హరీష్రావు రావడం.. ఆయనను పోలీసులు అడ్డుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో హరీష్రావు రాష్ట్ర సర్కారుపై విమర్శలు గుప్పించారు. తాజాగా ఈ వ్యవహారంపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. రాజకీయ దురుద్దేశంతోనే హరీష్రావు విమర్శలు చేస్తున్నారని అన్నారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ ఆయన కుటుంబం… ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు.
ఈ సందర్భంగా హరీష్రావుకు జూపల్లి మూడు ప్రశ్నలు సంధించారు.
1) టన్నెల్ను 200 మీటర్లు తవ్వి మిగతాది ఎందుకు వదిలేశారు?
2) కాంట్రాక్లులో తక్కువ లాభం వస్తుందన్న అంచనాతోనే వదిలేశారా?
3) కాంగ్రెస్ హయాంలో చేపట్టిన టన్నెల్ నిర్మాణం పూర్తి అయితే మీకు పేరు రాదు కాబట్టి వదిలేశారా? అని నిలదీశారు. ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడే హక్కు కేసీఆర్ కుటుంబానికి, బీఆర్ ఎస్ నాయకులకు లేదన్నారు.
This post was last modified on February 28, 2025 4:01 pm
అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…