జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాజాగా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో ఇటువంటి ప్రతిపాదనలే వచ్చినట్లు సమాచారం. పోలవరం ప్రాజెకక్టు సవరించిన అంచనా వ్యయం రూ . 47725 కోట్లుగా కేంద్రమే ఆమోదించింది. అలాంటిది కొత్తగా సవరించిన అంచనా వ్యయం రూ. 20,398 కోట్లే అని చెప్పటంపై జగన్ తీవ్రంగా మండిపోయారు. జరిగిన పనులకు సంబంధించి రూ. 2234 కోట్లు ఇచ్చేసిన తర్వాత మిగిలిన రూ. 4013 కోట్లను కేంద్రం ఇచ్చేస్తే సరిపోతుందని కేంద్ర జలవనరుల శాఖ, ఆర్ధిక శాఖల నుండి రాష్ట్రప్రభుత్వానికి లేఖ అందింది. ఆ లేఖ విషయంపైనే జగన్ సమీక్ష జరిపారు.
నిజానికి రాష్ట్ర విభజన సందర్భంగా పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా విభజన చట్టంలో చెప్పారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి కేంద్రమే కడుతుందని కూడా విభజన చట్టంలో ఉంది. అయితే 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్రప్రభుత్వం చేతుల్లోకి తీసుకున్నారు. అప్పటి నుండి కేంద్ర-రాష్ట్రాల మధ్య నిధుల పంచాయితీ జరుగుతునే ఉంది. ఇప్పటికి ఒకటికి రెండు, మూడుసార్లు నిర్మాణ అంచనాలను సవరించింది రాష్ట్రప్రభుత్వం.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రాజెక్టు ఖరీదు కన్నా భూసమీకరణలో భాగంగా నిర్వాసితులకు చెల్లించాల్సిన నష్టపరిహారమే చాలా ఎక్కువ. ప్రాజెక్టు ఖరీదు+నష్టపరిహారం అంతా కలిపి సుమారు రూ. 55548 కోట్లుగా చంద్రబాబునాయుడు హయాంలో కేంద్రం అంగీకరిచింది. అయితే తర్వాత కేంద్రంలోని జలశక్తి ఉన్నతాధికారులు, ప్రాజెక్టు అథారిటి తదితరుల జోక్యం కారణంగా అంచనా వ్యయం రూ. 47,725 కోట్లకు అంగీకారం కుదిరింది.
అయితే తాజాగా ఈ మొత్తంలో కూడా కేంద్రం బాగా కోసేసి చివరకు రూ. 20,398 కోట్లకు లెక్క కట్టడమే ఆశ్చర్యంగా ఉంది. కేంద్రవైఖరి చూస్తుంటే ప్రాజెక్టు పూర్తి చేయటానికి అవసరమైన నిధులను ఇచ్చేట్లు లేదనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను మళ్ళీ కేంద్రానికి ఇఛ్చేస్తే సరిపోతుందనే విషయం కూడా చర్చ జరిగిందట. అయితే ఎటువటం నిర్ణయం తీసుకోలేదు. కానీ సవరించిన అంచనాలు ఇవ్వటానికి కేంద్రం గనుక అంగీకరించకపోతే మొత్తం ప్రాజెక్టునే మళ్ళీ కేంద్రానికి బదలాయించేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
This post was last modified on October 25, 2020 11:07 am
లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.…
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…