Political News

పోలవరం బాధ్యతను మళ్ళీ కేంద్రానికి అప్పగించేస్తుందా ?

జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాజాగా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో ఇటువంటి ప్రతిపాదనలే వచ్చినట్లు సమాచారం. పోలవరం ప్రాజెకక్టు సవరించిన అంచనా వ్యయం రూ . 47725 కోట్లుగా కేంద్రమే ఆమోదించింది. అలాంటిది కొత్తగా సవరించిన అంచనా వ్యయం రూ. 20,398 కోట్లే అని చెప్పటంపై జగన్ తీవ్రంగా మండిపోయారు. జరిగిన పనులకు సంబంధించి రూ. 2234 కోట్లు ఇచ్చేసిన తర్వాత మిగిలిన రూ. 4013 కోట్లను కేంద్రం ఇచ్చేస్తే సరిపోతుందని కేంద్ర జలవనరుల శాఖ, ఆర్ధిక శాఖల నుండి రాష్ట్రప్రభుత్వానికి లేఖ అందింది. ఆ లేఖ విషయంపైనే జగన్ సమీక్ష జరిపారు.

నిజానికి రాష్ట్ర విభజన సందర్భంగా పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా విభజన చట్టంలో చెప్పారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి కేంద్రమే కడుతుందని కూడా విభజన చట్టంలో ఉంది. అయితే 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్రప్రభుత్వం చేతుల్లోకి తీసుకున్నారు. అప్పటి నుండి కేంద్ర-రాష్ట్రాల మధ్య నిధుల పంచాయితీ జరుగుతునే ఉంది. ఇప్పటికి ఒకటికి రెండు, మూడుసార్లు నిర్మాణ అంచనాలను సవరించింది రాష్ట్రప్రభుత్వం.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రాజెక్టు ఖరీదు కన్నా భూసమీకరణలో భాగంగా నిర్వాసితులకు చెల్లించాల్సిన నష్టపరిహారమే చాలా ఎక్కువ. ప్రాజెక్టు ఖరీదు+నష్టపరిహారం అంతా కలిపి సుమారు రూ. 55548 కోట్లుగా చంద్రబాబునాయుడు హయాంలో కేంద్రం అంగీకరిచింది. అయితే తర్వాత కేంద్రంలోని జలశక్తి ఉన్నతాధికారులు, ప్రాజెక్టు అథారిటి తదితరుల జోక్యం కారణంగా అంచనా వ్యయం రూ. 47,725 కోట్లకు అంగీకారం కుదిరింది.

అయితే తాజాగా ఈ మొత్తంలో కూడా కేంద్రం బాగా కోసేసి చివరకు రూ. 20,398 కోట్లకు లెక్క కట్టడమే ఆశ్చర్యంగా ఉంది. కేంద్రవైఖరి చూస్తుంటే ప్రాజెక్టు పూర్తి చేయటానికి అవసరమైన నిధులను ఇచ్చేట్లు లేదనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను మళ్ళీ కేంద్రానికి ఇఛ్చేస్తే సరిపోతుందనే విషయం కూడా చర్చ జరిగిందట. అయితే ఎటువటం నిర్ణయం తీసుకోలేదు. కానీ సవరించిన అంచనాలు ఇవ్వటానికి కేంద్రం గనుక అంగీకరించకపోతే మొత్తం ప్రాజెక్టునే మళ్ళీ కేంద్రానికి బదలాయించేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

This post was last modified on October 25, 2020 11:07 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మెగా ఫ్యామిలీ నుంచి ఇంకో నిర్మాత?

టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…

1 hour ago

ధనుష్‌కు మాత్రం ఎలా సాధ్యం?

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…

3 hours ago

ఆవిడ వల్లే ఎన్టీఆర్‌కు భారత రత్న రావట్లేదా?

టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…

5 hours ago

పిఠాపురం ఫ్లెక్సీల రగడ… వర్మదే తప్పన్న బాబు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…

5 hours ago

సినిమా చేయనందుకు హీరో 10 కోట్ల పరిహారం

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…

6 hours ago

IPL: ఛాన్స్ మిస్ చేసుకుంటున్న పెద్ది

ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…

6 hours ago