Political News

హంగూ ఆర్బాటాల్లేవ్.. రైల్లో వచ్చిన మీనాక్షి

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ (టీపీసీసీ)కి కొత్త ఇంచార్జీగా నియమితురాలైన మీనాక్షి నటరాజన్ కార్యరంగంలోకి దిగేశారు. అసలే అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ నూతన ఇంచార్జీగా నియమితురాలైన మీనాక్షి ఏ రేంజిలో ఎంట్రీ ఇస్తారోనని అంతా అనుకున్నారు. అయితే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ నటరాజన్… ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు రైల్లో వచ్చారు.

హైదరాబాద్ లోని కాచిగూడ రైల్వే స్టేషన లో రైలు దిగిన ఆమెను చూసి కాంగ్రెస్ శ్రేణులే విస్తుపోయాయి. ఎలాంటి హంగు లేదు… ఆర్భాటం అసలే లేదు. భుజానికి ఓ హ్యాండ్ బ్యాగు… వీపున దుస్తులతో కూడిన ఓ లగేజీ బ్యాగు… చాలా సింపుల్ గా ట్రెయిన్ దిగిన ఆమెకు టీపీసీపీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్… పార్టీ కండువాతో ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కనీసం బొకేలు, పూల మాలలు కూడా కనిపించకపోవడం గమనార్హం.

కాచిగూడ రైల్వే స్టేషన్ లో దిగిన మీనాక్షి… మహేశ్ కుమార్ ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి నేరుగా దిల్ కుషా గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. అక్కడ ఆమెకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖలతో పాటు కొందరు పార్టీ ముఖ్యులు ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగానూ ఎక్కడా లాంఛనాలు, సత్కారాలు కనిపించలేదు. సీఎం రేవంత్ మాత్రం, ఓ బొకే, మరో శాలువాతో ఆమెను సత్కరించారు. అంతటితో స్వాగత కార్యక్రమాలను పూర్తి చేసుకున్న నటరాజన్… నేరుగా కార్యరంగంలోకి దిగిపోయారు. సీఎం, టీపీసీసీ చీఫ్ లతో ఆమె వేర్వేరుగా భేటీ అయ్యారు. పార్టీ పరిస్థితులపై వారి నుంచి ప్రాథమిక వివరాలను సేకరించినట్టు సమాచారం. ఈ సందర్భంగా పార్టీలోని వర్గ విభేదాలు, ఇటీవల చోటుచేసుకున్న పలు కీలక పరిణామాలను రేవంత్, మహేశ్ లు ఆమె దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

చూడటానికి సాదాసీదాగా కనిపిస్తున్న మీనాక్షి నటరాజన్… పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ బృందంలో అత్యంత ముఖ్యురాలుగా కొనసాగుతున్నారు. అసలే దేశవ్యాప్తంగా పార్టీ తీవ్ర విపత్కర పరిస్థితుల్లో ఉంది. అధికారంలో ఉన్న రాష్ట్రంలో అయినా పార్టీని కాస్తంత చక్కదిద్దకపోతే కష్టమేనన్న భావనతో రాహుల్ గాంధీనే స్వయంగా మీనాక్షిని రంగంలోకి దింపినట్లు సమాచారం.

ఇటీవలే కొందరు ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమావేశం ఏర్పాటు చేసుకున్నారన్న వార్తలు కలకలమే రేపాయి. అదే సమయంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తరచూ చేస్తున్న సంచలన వ్యాఖ్యలు పార్టీలో కలవరాన్ని రేపుతోంది. వీటిని ఎక్కడికక్కడ నిలువరించడంలో మునుపటి ఇంచార్జీ దీపాదాస్ మున్షీ సఫలం కాలేకపోవడంతో ఆమె స్థానంలో మీనాక్షి బాధ్యతలు తీసుకున్నారు. స్టైల్లో సింపుల్ గానే కనిపిస్తున్న మీనాక్షి పని తీరులో మాత్రం నిక్కచ్చిగానే కాకుండా కఠినంగా వ్యవహరించే నేతగా పేరుంది. మరి టీపీసీసీని ఆమె ఏ రీతిన దారిలో పెడతారో చూడాలి.

This post was last modified on February 28, 2025 2:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘మామిడి’ మోసం… ఇదిగో హెచ్చరిక

వేసవి వచ్చిందంటే చాలు.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంతా మామిడి పండ్ల కోసమే ఎదురుచూస్తారు. ఒకప్పుడు వేసవి సెలవుల్లో…

29 minutes ago

బీహార్‌పై బీజేపీ ముద్ర‌… ప్రాంతీయ పార్టీల‌కు అలెర్ట్

బీహార్లో బిజెపి ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన సామ్రాట్ చౌదరి…

3 hours ago

జగన్ అన్నా క్యాంటీన్లను తీసేసింది అందుకేనా?

వైసీపీ హ‌యాంలో రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకున్న జ‌గ‌న్‌.. పేద‌ల‌కు ప‌ట్టెడ‌న్నం కూడా పెట్ట‌లేక పోయార‌ని సీఎం చంద్ర‌బాబు విమ‌ర్శించారు.…

8 hours ago

అమరావతిపై ఇంత విషమేంటి నాని గారు?

ఏపీ రాజ‌ధాని అమ‌రావతిపై వైసీపీ నాయ‌కులు అదే అక్క‌సు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. రాజ‌ధానిపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే ఉన్నారు. జ‌గ‌న్ ప్ర‌తిపాదించిన…

9 hours ago

లాయర్ అవతారమెత్తిన రాజు గారు

కనుమూరి రఘురామకృష్ణరాజు... ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. లోక్ సభ సభ్యుడిగా, ఆ తర్వాత శాసనసభ్యుడిగా ఎన్నికైన రాజు..…

9 hours ago

ఎట్టకేలకు వర్మ త్యాగానికి ఫలితం

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎట్టకేలకు ఫలితం…

9 hours ago