Political News

బడ్జెట్ లో ఎపుడూ లేని కొత్త అంశాలివే!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఉన్న ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌కు తోడు కొత్త‌గా మ‌రిన్ని కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టింది. ఆయా కార్య‌క్ర‌మాల‌కు నిధుల కేటాయింపు భారమే అయిన‌ప్ప‌టికీ.. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పుల‌కు శ్రీకారం చుడుతున్న‌ట్టు ఆర్థిక మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ వ్యాఖ్యానించారు. అదేవిధంగా కేంద్రం అమ‌లు చేస్తున్న అనేక ప‌థ‌కాల‌ను అందిపుచ్చుకోనున్న‌ట్టు ఆయ‌న చెప్పారు. వీటి ద్వారా మ‌రింత స్వావ‌లంబ‌న దిశ‌గా రాష్ట్రాన్ని న‌డిపించ‌నున్న‌ట్టు ఆయ‌న తెలిపారు.

పాఠ‌శాల‌ల‌కు ఉచిత విద్యుత్‌

రాష్ట్రంలోని అన్ని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌కు ఉచితంగా విద్యుత్‌ను అందించే కార్య‌క్ర‌మాన్ని బ‌డ్జెట్‌లో ప్ర‌తిపాదించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 92000 పాఠ‌శాల‌లు ఉన్నాయి. వీటిలో ప్రాథ‌మిక‌, మ‌ధ్య‌మిక‌, ఉన్న‌త పాఠ‌శాల‌లు ఉన్నాయి. వీట‌న్నింటికీ వ‌చ్చే ఏడాది నుంచి ఉచితంగా విద్యుత్ అంద‌నుంద‌ని మంత్రి చెప్పారు. అయితే.. కేంద్రం అమ‌లు చేస్తున్న సూర్య‌ఘ‌ర్ యోజ‌న‌ను ఈ పాఠ‌శాల‌ల‌కు అనుసంధానం చేయ‌నున్నారు. త‌ద్వారా పాఠ‌శాల‌ల‌కు ఉచిత విద్యుత్ అంద‌నుంది.

తొలిసారిగా భాషాభివృద్ధికి నిధుల కేటాయింపు

రాష్ట్రంలో తొలిసారి ప్రాంతీయ భాషాభివృద్ధికి రాష్ట్ర ప్ర‌భుత్వం నిధులు కేటాయించింది. తెలుగు భాషాభి వృద్ధికి రూ.10 కోట్లు కేటాయిస్తున్న‌ట్టు మంత్రి ప్ర‌క‌టించారు. తెలుగు భాష‌ను కాపాడుకోవ‌డం.. ముందు త‌రాల‌కు ఈ భాష‌ను అందించ‌డం.. మ‌న క‌ర్త‌వ్యంగా పేర్కొన్న ప‌య్యావుల‌.. అన్ని ద‌శ‌ల్లోనూ తెలుగును అభివృద్ధి చేయ‌నున్న‌ట్టు వివ‌రించారు. గ‌త వైసీపీ ప్ర‌భుత్వం తెలుగుకు పాత‌ర వేసే ప‌నులు చేప‌ట్టింద‌ని.. తెలుగు మీడియంను ర‌ద్దు చేసి.. ఇంగ్లీషు మీడియంను ప్ర‌వేశ పెట్టి.. విద్యావ్య‌వ‌స్థ‌ను నాశ‌నం చేసింద‌ని విమ‌ర్శించారు. అయితే.. తాము తెలుగుతో పాటు ఇంగ్లీషుకు కూడా స‌మాంతర ప్రాధాన్యం ఇస్తామ‌ని ప‌య్యావుల ప్ర‌క‌టించారు.

This post was last modified on February 28, 2025 1:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

26 minutes ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago