ఏపీలో కూటమి ప్రభుత్వం ఉన్న పథకాలు, కార్యక్రమాలకు తోడు కొత్తగా మరిన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఆయా కార్యక్రమాలకు నిధుల కేటాయింపు భారమే అయినప్పటికీ.. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులకు శ్రీకారం చుడుతున్నట్టు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. అదేవిధంగా కేంద్రం అమలు చేస్తున్న అనేక పథకాలను అందిపుచ్చుకోనున్నట్టు ఆయన చెప్పారు. వీటి ద్వారా మరింత స్వావలంబన దిశగా రాష్ట్రాన్ని నడిపించనున్నట్టు ఆయన తెలిపారు.
పాఠశాలలకు ఉచిత విద్యుత్
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా విద్యుత్ను అందించే కార్యక్రమాన్ని బడ్జెట్లో ప్రతిపాదించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 92000 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రాథమిక, మధ్యమిక, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటన్నింటికీ వచ్చే ఏడాది నుంచి ఉచితంగా విద్యుత్ అందనుందని మంత్రి చెప్పారు. అయితే.. కేంద్రం అమలు చేస్తున్న సూర్యఘర్ యోజనను ఈ పాఠశాలలకు అనుసంధానం చేయనున్నారు. తద్వారా పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందనుంది.
తొలిసారిగా భాషాభివృద్ధికి నిధుల కేటాయింపు
రాష్ట్రంలో తొలిసారి ప్రాంతీయ భాషాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. తెలుగు భాషాభి వృద్ధికి రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. తెలుగు భాషను కాపాడుకోవడం.. ముందు తరాలకు ఈ భాషను అందించడం.. మన కర్తవ్యంగా పేర్కొన్న పయ్యావుల.. అన్ని దశల్లోనూ తెలుగును అభివృద్ధి చేయనున్నట్టు వివరించారు. గత వైసీపీ ప్రభుత్వం తెలుగుకు పాతర వేసే పనులు చేపట్టిందని.. తెలుగు మీడియంను రద్దు చేసి.. ఇంగ్లీషు మీడియంను ప్రవేశ పెట్టి.. విద్యావ్యవస్థను నాశనం చేసిందని విమర్శించారు. అయితే.. తాము తెలుగుతో పాటు ఇంగ్లీషుకు కూడా సమాంతర ప్రాధాన్యం ఇస్తామని పయ్యావుల ప్రకటించారు.
This post was last modified on February 28, 2025 1:29 pm
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…