ఏపీలో కూటమి ప్రభుత్వం ఉన్న పథకాలు, కార్యక్రమాలకు తోడు కొత్తగా మరిన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఆయా కార్యక్రమాలకు నిధుల కేటాయింపు భారమే అయినప్పటికీ.. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులకు శ్రీకారం చుడుతున్నట్టు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. అదేవిధంగా కేంద్రం అమలు చేస్తున్న అనేక పథకాలను అందిపుచ్చుకోనున్నట్టు ఆయన చెప్పారు. వీటి ద్వారా మరింత స్వావలంబన దిశగా రాష్ట్రాన్ని నడిపించనున్నట్టు ఆయన తెలిపారు.
పాఠశాలలకు ఉచిత విద్యుత్
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా విద్యుత్ను అందించే కార్యక్రమాన్ని బడ్జెట్లో ప్రతిపాదించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 92000 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రాథమిక, మధ్యమిక, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటన్నింటికీ వచ్చే ఏడాది నుంచి ఉచితంగా విద్యుత్ అందనుందని మంత్రి చెప్పారు. అయితే.. కేంద్రం అమలు చేస్తున్న సూర్యఘర్ యోజనను ఈ పాఠశాలలకు అనుసంధానం చేయనున్నారు. తద్వారా పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందనుంది.
తొలిసారిగా భాషాభివృద్ధికి నిధుల కేటాయింపు
రాష్ట్రంలో తొలిసారి ప్రాంతీయ భాషాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. తెలుగు భాషాభి వృద్ధికి రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. తెలుగు భాషను కాపాడుకోవడం.. ముందు తరాలకు ఈ భాషను అందించడం.. మన కర్తవ్యంగా పేర్కొన్న పయ్యావుల.. అన్ని దశల్లోనూ తెలుగును అభివృద్ధి చేయనున్నట్టు వివరించారు. గత వైసీపీ ప్రభుత్వం తెలుగుకు పాతర వేసే పనులు చేపట్టిందని.. తెలుగు మీడియంను రద్దు చేసి.. ఇంగ్లీషు మీడియంను ప్రవేశ పెట్టి.. విద్యావ్యవస్థను నాశనం చేసిందని విమర్శించారు. అయితే.. తాము తెలుగుతో పాటు ఇంగ్లీషుకు కూడా సమాంతర ప్రాధాన్యం ఇస్తామని పయ్యావుల ప్రకటించారు.
This post was last modified on February 28, 2025 1:29 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…