ఏపీలో కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత.. ప్రవేశ పెట్టే తొలి పూర్తిస్థాయి బడ్జెట్పై చాలానే అంచనాలు ఉన్నాయి. ఈ బడ్జెట్ ద్వారా ఏపీ ముఖ చిత్రం మారేందుకు, మార్చేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్ని స్తున్నారు. విజన్-2047తోపాటు.. వికసిత ఆంధ్రప్రదేశ్, పీ-4 లక్ష్యాలకు అనుగుణంగా.. తీర్చిదిద్దిన బడ్జెట్ రాష్ట్రాన్ని మరో 25 సంవత్సరాల పాటు అభివృద్దిలోపురోగమించేంలా పక్కా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఒకవైపు నిధుల కొరత వెంటాడుతున్నా… మరోవైపు అభివృద్ది మంత్రంతో ముందుకు సాగాలని నిర్ణయించారు.
ప్రధానంగా పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వాలన్న సంకల్పంతో కూటమిసర్కారు ముందుకు సాగుతోంది. తద్వారా.. ఎన్నికలకు ముందు చెప్పిన ఏటా 4 లక్షల ఉద్యోగాలను సాకారం చేసే దిశగా అడుగులు వేస్తోంది. రానున్న ఐదేళ్ల కాలంలో 20 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కల్పించనుంది. దీంతో బడ్జెట్లో పెట్టుబడిదారులకు వరాలుకురవనున్నాయి. పెట్టుబడులతో వచ్చే వారికి ఏకగవాక్ష(సింగిల్ విండో) విధానంలో అనుమతులు ఇచ్చే ప్రతిపాదనను తీసుకువస్తున్నారు.
అదేవిధంగా ప్రజల జీవన శైలిని మరింత సులభతరం చేసేందుకు వీలుగా వృత్తి నైపుణ్యాలను మరింత మెరుగు పరిచే చర్యలు తీసుకుంటారు. దీనిలో భాగంగా ప్రతి జిల్లాలో ఒక నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కనీసం 10వ తరగతి చదివిన వారికి సొంత కాళ్లపై నిలబడేలా శిక్షణ ఇవ్వనున్నా రు. తద్వారా నిరుద్యోగానికి చెక్ పెట్టనున్నారు. ఇక, పీ-4 విధానాన్ని అటుఅభివృద్ది, ఇటు సంక్షేమంలో నూ అమలు చేయనున్నారు. దీంతో రాష్ట్రంలో రహదారులు, కాల్వల అభివృద్ధి శరవేగంగా జరగనుంది.
పేదలను గుర్తించి.. వారిని పైకి తీసుకువచ్చే బాధ్యతను ఉన్నతస్థాయి వర్గాలకు అప్పగించనున్నారు. దీంతో పేదరికంపైనా కూటమి ప్రభుత్వం విజయం దక్కించుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నా రు. ఇక, మెజారిటీ ఓటర్లు మహిళలే కాబట్టి.. వారిని ఆకర్షించేందుకు పెట్టుబడి సాయంతోపాటు.. అన్ని రంగాల్లోనూ వారిని ప్రోత్సహించే విధానాలను ప్రవేశపెట్టడం ద్వారా.. మహిళా సాధికారతను మరింత పైస్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మొత్తంగా బడ్జెట్తో ఏపీ ముఖ చిత్రం మారుతుందని చంద్రబాబు భావిస్తున్నారు.
This post was last modified on February 28, 2025 10:39 am
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…