Political News

క్యూలో నిల‌బ‌డి ఓటేసిన చంద్ర‌బాబు, లోకేష్‌!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు, మంత్రి నారా లోకేష్‌.. గురువారం ఉద‌యం ఎమ్మెల్సీ ఎన్ని క‌ల్లో త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. ఇరువురి ఓటు హక్కు మంగ‌ళ‌గిరి ప‌రిధిలో ఉండ‌డంతో వారుఇక్క‌డే త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. తాజాగా జ‌రుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జోరుగా సాగుతున్నాయి. ఎక్కువ మంది ఓట‌ర్లు వ‌చ్చి త‌మ హ‌క్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు, లోకేష్‌లు ఓటు వేయాల్సిన బూతులోనూ ఎక్కువ మంది క్యూలో ఉన్నారు.

దీనిని గ‌మ‌నించిన చంద్ర‌బాబు.. తాను కూడా.. తొలి నుంచి క్యూలో నిల‌బ‌డి ఓటు హ‌క్కు వినియోగించు కున్నారు. నారా లోకేష్‌, చంద్ర‌బాబు ఇద్ద‌రూ తాడేప‌ల్లిలో ఏర్పాటు చేసిన బూత్‌లో ఓటు వేశారు. ఇదిలా వుంటే.. ఉమ్మ‌డి గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీమాజీ మంత్రి, సీనియ ర్ నాయ‌కుడు ఆల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్ పోటీ చేస్తున్నారు. ఇక్క‌డ నుంచి పీడీఎఫ్ అభ్య‌ర్థిగా మాజీ ఎమ్మెల్సీ కేఎస్ ల‌క్ష్మ‌ణ‌రావు బ‌రిలో ఉన్నారు.

వాస్త‌వానికి 25 మంది అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నా.. ఆల‌పాటి, కేఎస్‌ల మ‌ధ్యే తీవ్ర‌మైన పోటీ నెల‌కొంది. వైసీ పీ కేఎస్‌కు ప‌రోక్షంగా, ప్ర‌త్య‌క్షంగా కూడా మ‌ద్ద‌తిస్తున్న విష‌యం తెలిసిందే. దీంతో పోరు తీవ్రంగా మారిం ది. మ‌రోవైపు.. వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ ఓటు వేయ‌లేక‌పోయారు. ఆయ‌న ఓటు హ‌క్కు.. క‌డ‌ప‌లోనే ఉండిపోయింది. వాస్త‌వానికి.. గ‌తంలో చంద్రబాబు ఓటు కూడా కుప్పంలో ఉండేది. కానీ, ఆయ‌న గ‌త ఎన్నికల్లో మంగ‌ళగిరికి మార్చుకున్నారు. దీంతో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అవ‌కాశం చిక్కింది.

This post was last modified on February 27, 2025 1:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విస్మయపరిచే ‘రామ’ పరిచయం

బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…

1 hour ago

ఒకవేళ జగన్ వస్తే రాజధాని మారుతుందా?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి చ‌ట్ట‌బద్ధ‌త క‌ల్పించే ల‌క్ష్యంతో గ‌త నెల 28న ఏపీ అసెంబ్లీ ప్ర‌త్యేకంగా భేటీ అయి.. దీనిపై…

2 hours ago

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

6 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

8 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

12 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

12 hours ago