ఏపీ రాజధాని అమరావతి పనులకు సంబంధించి రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత కీలక అప్డేట్ ఇచ్చారు. రాజధానికి సంబంధించిన పనులకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చిందని పేర్కొన్నారు. మరో 10 రోజుల్లో టెండర్లను ఖరారు చేసి, పనులు అప్పగించనున్నట్టు వెల్లడించారు. దీంతో మార్చి 15వ తేదీ నుంచి పనులు శరవేగంగా జరుగుతాయన్నారు. కేంద్రం నుంచి సాయం.. సహా.. ఇతర ఆర్థిక సంస్థల నుంచి తీసుకుంటున్న రుణాలతో రాజధాని నిర్మాణాన్ని వడివడిగా ముందుకు తీసుకువెళ్లేందుకు సీఎం చంద్రబాబుఎంతో కృషి చేస్తున్నారని మంత్రి వివరించారు.
అయితే.. మార్చి 15లోగానే.. హోం శాఖకు సంబంధించి.. అంతర్జాతీయ స్థాయి ఫోరెన్సిక్ లేబొరేటరీ నిర్మాణం పూర్తవుతుందని మంత్రి అనిత వివరించారు. తాజాగా ఈ నిర్మాణ పనులను పరిశీలించిన ఆమె.. ప్రస్తుతం 90 శాతం నిర్మాణం పూర్తయినట్టు వివరించారు. మిగిలిన 10 పనులు కూడా వచ్చే పది రోజుల్లో పూర్తవుతాయని అధికారులు తనకు చెప్పారని వివరించారు. అమరావతి లో నిర్మిస్తున్న అంతర్జాతీయ స్థాయి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నిర్మాణానికి 2017 డిసెంబర్లో తుళ్లూరులో అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి వివరించారు. అయితే.. వైసీపీ రాకతో పనులు ఆగిపోయాయని.. కూటమి వచ్చాక పనులు శరవేగంగా పూర్తవుతున్నాయని వివరించారు.
ఏంటీ లేబొరేటరీ..
క్రిమినల్ నేరాలకు సంబంధించి నేరస్థులను పట్టుకోవడంతో పాటు, నేర నిరూపణలో శాస్త్రీయ ఆధారాల విశ్లేషణకు ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్మాణం చేపట్టాలని గత టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో రాజధానిలో నిర్మించాలని సంకల్పించింది. దీనిలో భాగంగా తుళ్లూరులో మొత్తం మూడు బ్లాక్లలో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నిర్మాణం జరుగుతోంది. ప్రస్తుతం బ్లాక్ 1 నిర్మాణం పూర్తి కావొచ్చింది. దీనిలో డీఎన్ఏ, నార్కోటిక్స్, బయోమెట్రిక్స్, సైబర్, బాలిస్టిక్స్, ఫోరెన్సిక్ అకౌంటింగ్కు సంబంధించిన ఎక్స్లెన్స్ కేంద్రాలు, ట్రైనింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాలు ఏర్పాటు చేయనున్నారు.
This post was last modified on February 27, 2025 7:33 am
గత ఏడాది ప్రతిష్ఠాత్మకంగా గద్దర్ అవార్డులను మొదలుపెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. ఒకేసారి చాలా ఏళ్లకు కలిపి అవార్డులు ప్రకటించిన సంగతి…
దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…