Political News

పార్టీలు వేరైతే… బంధుత్వం ఉందిగా?

నిజమే.. పై ఫొటోలో కనిపిస్తున్న ఈ ఇద్దరు నేతలను చూస్తుంటే… ఠక్కున ఇదే మాట గుర్తుకు వస్తోంది. ఈ ఫొటోలో చేతులు ఒడిలో పెట్టుకుని కూర్చున్న నేత వైసీపీలో కీలక నేతగానే కాకుండా… ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీగానూ కొనసాగుతున్న తోట త్రిమూర్తులు. తోట పక్కన కూర్చున్న నేత మొన్నటిదాకా వైసీపీలో కొనసాగి… వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటుగా.. ఆయన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డితోనూ మంచి అనుబంధం కలిగిన నేత, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉధయభాను. ఇటీవలే వైసీపీని వీడిన ఈయన జనసేనలో చేరిపోయారు. జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న నేత.

రాజకీయ వైరం పరంగా చూస్తే.. వీరిద్దరూ బద్ధ శత్రువుల కిందే లెక్క. జగన్ అంటే జనసేన సేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు అస్సలు పొసగడం లేదు. పవన్ అన్నా కూడా జగన్ అదే రీతిన సాగుతున్న వైనం తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో వైసీపీ, జనసేనలకు చెందిన ఇద్దరు కీలక నేతలు కలిసి ఫొటోలకు ఫోజులివ్వడం ఓ డేరింగ్ నిర్ణయమేనని చెప్పక తప్పదు. వాస్తవానికి వీరిద్దరూ వియ్యంకులు. పార్టీలు వేరేతై మాత్రం బంధుత్వాన్ని వీడాల్సిన పని లేదు కదా. నిజమే. బావ, బావమరదులు మహాశివరాత్రి సందర్భంగా కలిశారు. ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆలయంలోనే ఇలా కూర్చుని ఫొటోలు దిగారు.

తన బావ మరిది సామినేనితో కలిసి దిగిన ఫొటోను తోట త్రిమూర్తులు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. రాజకీయంగా వీరిద్దరి ప్రస్థానాలు భిన్నంగానే సాగాయి. టీడీపీతో రాజకీయాలు మొదలుపెట్టిన తోట… ఆ పార్టీలో సీనియర్ మోస్ట్ నేతగా, తూర్పు గోదావరి జిల్లాలో కీలక నేతగా ఎదిగారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. ఇక సామినేని ఆది నుంచి వైఎస్ ఫ్యామిలీతోనే సాగారు. కాంగ్రెస్ తో రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన ఆ తర్వాత వైసీపీలో జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీని వీడి జనసేనలో చేరిపోయారు.

This post was last modified on February 26, 2025 8:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

10 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

54 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

2 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago