Political News

పార్టీలు వేరైతే… బంధుత్వం ఉందిగా?

నిజమే.. పై ఫొటోలో కనిపిస్తున్న ఈ ఇద్దరు నేతలను చూస్తుంటే… ఠక్కున ఇదే మాట గుర్తుకు వస్తోంది. ఈ ఫొటోలో చేతులు ఒడిలో పెట్టుకుని కూర్చున్న నేత వైసీపీలో కీలక నేతగానే కాకుండా… ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీగానూ కొనసాగుతున్న తోట త్రిమూర్తులు. తోట పక్కన కూర్చున్న నేత మొన్నటిదాకా వైసీపీలో కొనసాగి… వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటుగా.. ఆయన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డితోనూ మంచి అనుబంధం కలిగిన నేత, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉధయభాను. ఇటీవలే వైసీపీని వీడిన ఈయన జనసేనలో చేరిపోయారు. జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న నేత.

రాజకీయ వైరం పరంగా చూస్తే.. వీరిద్దరూ బద్ధ శత్రువుల కిందే లెక్క. జగన్ అంటే జనసేన సేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు అస్సలు పొసగడం లేదు. పవన్ అన్నా కూడా జగన్ అదే రీతిన సాగుతున్న వైనం తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో వైసీపీ, జనసేనలకు చెందిన ఇద్దరు కీలక నేతలు కలిసి ఫొటోలకు ఫోజులివ్వడం ఓ డేరింగ్ నిర్ణయమేనని చెప్పక తప్పదు. వాస్తవానికి వీరిద్దరూ వియ్యంకులు. పార్టీలు వేరేతై మాత్రం బంధుత్వాన్ని వీడాల్సిన పని లేదు కదా. నిజమే. బావ, బావమరదులు మహాశివరాత్రి సందర్భంగా కలిశారు. ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆలయంలోనే ఇలా కూర్చుని ఫొటోలు దిగారు.

తన బావ మరిది సామినేనితో కలిసి దిగిన ఫొటోను తోట త్రిమూర్తులు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. రాజకీయంగా వీరిద్దరి ప్రస్థానాలు భిన్నంగానే సాగాయి. టీడీపీతో రాజకీయాలు మొదలుపెట్టిన తోట… ఆ పార్టీలో సీనియర్ మోస్ట్ నేతగా, తూర్పు గోదావరి జిల్లాలో కీలక నేతగా ఎదిగారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. ఇక సామినేని ఆది నుంచి వైఎస్ ఫ్యామిలీతోనే సాగారు. కాంగ్రెస్ తో రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన ఆ తర్వాత వైసీపీలో జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీని వీడి జనసేనలో చేరిపోయారు.

This post was last modified on February 26, 2025 8:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

3 hours ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

4 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

5 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

5 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

7 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

8 hours ago