Political News

నిర్మాత కేదార్ మృతి ఓ మిస్టరీ: రేవంత్ రెడ్డి

తెలుగు చలన చిత్ర సీమ టాలీవుడ్ కు చెందిన నిర్మాత సెలగంశెట్టి కేదార్ దుబాయిలో అనూహ్య పరిణామాల నేపథ్యంలో మరణించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఓ వివాహానికి హాజరయ్యేందుకు టాలీవుడ్ కు చెందిన చాలా మంది ప్రముఖులు దుబాయి వెళ్లారు. వీరిలో కేదార్ కూడా ఉన్నారు. అయితే మిగిలిన వారంతా క్షేమంగానే తిరిగి రాగా.. కేదార్ మాత్రం విగత జీవిగా తిరిగి వచ్చారు. దుబాయిలో అనారోగ్యం కారణంగా కేదార్ మరణించారని తొలుత వార్తలు రాగా…ఆ తర్వాత ఈ మరణం వెనుక ఓ పెద్ద మిస్టరీ ఉందంటూ స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ ముగిసిన తర్వాత అక్కడే మీడియా మాట్లాడిన సందర్భంగా రేవంత్…కేదార్ మృతిపై సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దుబాయిలో కేదార్ మరణించారన్న విషయం ప్రస్తావనకు వచ్చినంతనే.. కేదార్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు వ్యాపార భాగస్వామిగా, మిత్రుడిగా రేవంత్ అభివర్ణించారు. దుబాయిలో కేదార్ మరణం ఓ పెద్ద మిస్టరీనేనని ఆయన వ్యాఖ్యానించారు. ఆ మిస్టరీ ఏమిటని కూడా ఆయన మీడియాను ఎదురు ప్రశ్నించడం గమనార్హం. ఇటీవలే హైదరాబాద్ లో ఓ రాజకీయ ప్రముఖుడు ఇచ్చిన డ్రగ్స్ పార్టీ రాడిసన్ హోటల్ లో జరిగిందని… అందులో కేదార్ కూడా పాలుపంచుకున్నారని కూడా రేవంత్ అన్నారు.

”కేసులలో ఉన్న వారు వరుసగా చనిపోవడం వెనుక ఉన్న మిస్టరీ ఏమిటి? ముందు సంజీవ రెడ్డి, ఆ తర్వాత రాజలింగం, ఇప్పుడు కేదార్..వీరి మరణాల వెనుక మిస్టరీ ఉంది. దీనిపై కేటీఆర్ ఎందుకు విచారణ కోరడం లేదు. ఫిర్యాదులు వస్తే దర్యాప్తు చేస్తాం” అని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణతో పాటు టాలీవుడ్ లోనూ పెను ప్రకంపనలే సృష్టిస్తున్నాయి. కేటీఆర్ డ్రగ్స్ వాడతారంటూ గతంలోనే రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కేదార్ మరణం, అది కూడా దుబాయి వేదికగా చోటుచేసుకోవడం, మరణానికి గల కారణాలు తెలియకపోవడంపై పెద్ద చర్చే నడుస్తోంది.

టాలీవుడ్ లోని పలువురు ప్రముఖులతో మంచి సంబంధాలు కలిగిన కేదార్ పెద్దగా సినిమాలేమీ నిర్మించలేదు. విజయ్ దేవరకొండ సోదరుడితో ఇటీవలే ఆయన గంగం గణేశా అనే చిత్రాన్ని తీశారు. అంతకుముందు ఒకటో, రెండో చిత్రాలను మాత్రమే ఆయన నిర్మించారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఆయనకు మంచి స్నేహం ఉందని కూడా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దుబాయిలో జరిగిన ఓ ప్రీ వెడ్డింగ్ వేడుకకు హాజరై ఆ తర్వాత తనకు కేటాయించిన గదికి వెళ్లి నిద్రించిన కేదార్.. నిద్రలోనే మరణించారు. ఆ సమయంలో కేదార్ తో పాటు తెలంగాణకు చెందిన ఓ తాజా మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నారట. ఓ మాజీ ఎమ్మెల్యేను ఇప్పటికే దుబాయి పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా కేదార్ మరణంపై రేవంత్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

This post was last modified on February 26, 2025 6:08 pm

Share

Recent Posts

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

4 hours ago

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

11 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

12 hours ago

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…

13 hours ago

ఇప్పుడైనా ‘అన్న’తనం చూపించాలి జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…

15 hours ago

సుధీర్ బాబు రిస్కు వెనుక కారణం ఏమిటో

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…

18 hours ago