Political News

నిర్మాత కేదార్ మృతి ఓ మిస్టరీ: రేవంత్ రెడ్డి

తెలుగు చలన చిత్ర సీమ టాలీవుడ్ కు చెందిన నిర్మాత సెలగంశెట్టి కేదార్ దుబాయిలో అనూహ్య పరిణామాల నేపథ్యంలో మరణించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఓ వివాహానికి హాజరయ్యేందుకు టాలీవుడ్ కు చెందిన చాలా మంది ప్రముఖులు దుబాయి వెళ్లారు. వీరిలో కేదార్ కూడా ఉన్నారు. అయితే మిగిలిన వారంతా క్షేమంగానే తిరిగి రాగా.. కేదార్ మాత్రం విగత జీవిగా తిరిగి వచ్చారు. దుబాయిలో అనారోగ్యం కారణంగా కేదార్ మరణించారని తొలుత వార్తలు రాగా…ఆ తర్వాత ఈ మరణం వెనుక ఓ పెద్ద మిస్టరీ ఉందంటూ స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ ముగిసిన తర్వాత అక్కడే మీడియా మాట్లాడిన సందర్భంగా రేవంత్…కేదార్ మృతిపై సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దుబాయిలో కేదార్ మరణించారన్న విషయం ప్రస్తావనకు వచ్చినంతనే.. కేదార్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు వ్యాపార భాగస్వామిగా, మిత్రుడిగా రేవంత్ అభివర్ణించారు. దుబాయిలో కేదార్ మరణం ఓ పెద్ద మిస్టరీనేనని ఆయన వ్యాఖ్యానించారు. ఆ మిస్టరీ ఏమిటని కూడా ఆయన మీడియాను ఎదురు ప్రశ్నించడం గమనార్హం. ఇటీవలే హైదరాబాద్ లో ఓ రాజకీయ ప్రముఖుడు ఇచ్చిన డ్రగ్స్ పార్టీ రాడిసన్ హోటల్ లో జరిగిందని… అందులో కేదార్ కూడా పాలుపంచుకున్నారని కూడా రేవంత్ అన్నారు.

”కేసులలో ఉన్న వారు వరుసగా చనిపోవడం వెనుక ఉన్న మిస్టరీ ఏమిటి? ముందు సంజీవ రెడ్డి, ఆ తర్వాత రాజలింగం, ఇప్పుడు కేదార్..వీరి మరణాల వెనుక మిస్టరీ ఉంది. దీనిపై కేటీఆర్ ఎందుకు విచారణ కోరడం లేదు. ఫిర్యాదులు వస్తే దర్యాప్తు చేస్తాం” అని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణతో పాటు టాలీవుడ్ లోనూ పెను ప్రకంపనలే సృష్టిస్తున్నాయి. కేటీఆర్ డ్రగ్స్ వాడతారంటూ గతంలోనే రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కేదార్ మరణం, అది కూడా దుబాయి వేదికగా చోటుచేసుకోవడం, మరణానికి గల కారణాలు తెలియకపోవడంపై పెద్ద చర్చే నడుస్తోంది.

టాలీవుడ్ లోని పలువురు ప్రముఖులతో మంచి సంబంధాలు కలిగిన కేదార్ పెద్దగా సినిమాలేమీ నిర్మించలేదు. విజయ్ దేవరకొండ సోదరుడితో ఇటీవలే ఆయన గంగం గణేశా అనే చిత్రాన్ని తీశారు. అంతకుముందు ఒకటో, రెండో చిత్రాలను మాత్రమే ఆయన నిర్మించారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఆయనకు మంచి స్నేహం ఉందని కూడా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దుబాయిలో జరిగిన ఓ ప్రీ వెడ్డింగ్ వేడుకకు హాజరై ఆ తర్వాత తనకు కేటాయించిన గదికి వెళ్లి నిద్రించిన కేదార్.. నిద్రలోనే మరణించారు. ఆ సమయంలో కేదార్ తో పాటు తెలంగాణకు చెందిన ఓ తాజా మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నారట. ఓ మాజీ ఎమ్మెల్యేను ఇప్పటికే దుబాయి పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా కేదార్ మరణంపై రేవంత్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

This post was last modified on February 26, 2025 6:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

గ‌ద్ద‌ర్ అవార్డుల్లో గందరగోళం.. ఏం జరిగింది?

గ‌త ఏడాది ప్ర‌తిష్ఠాత్మ‌కంగా గ‌ద్ద‌ర్ అవార్డుల‌ను మొద‌లుపెట్టిన తెలంగాణ ప్ర‌భుత్వం.. ఒకేసారి చాలా ఏళ్ల‌కు క‌లిపి అవార్డులు ప్ర‌క‌టించిన సంగ‌తి…

3 hours ago

యూత్ హీరోలు రూటు మారుస్తున్నారు

దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…

6 hours ago

హెచ్చరికలు వృథా.. చర్యలు ఎప్పుడూ?

ఏపీలో టీడీపీ నాయ‌కులు దారి త‌ప్పుతున్నార‌న్న విష‌యంపై స‌మీక్ష‌లు చేయ‌డం.. వారిపై సీరియ‌స్ అయిన‌ట్టుగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం..…

10 hours ago

పెద్దిరెడ్డీ అనుచ‌రుల అరెస్టు.. ఏం జ‌రిగింది?

వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్‌గా భావిస్తున్న ఇద్దరు కీలక…

10 hours ago

పవర్ స్టార్ మేజిక్ పని చేస్తోంది

ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…

10 hours ago

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

11 hours ago