గల్లా జయదేవ్.. ఈ పేరు విని చాలా రోజులే అయ్యింది అంటారా? నిజమే…గల్లా జయదేవ్ పేరు విని చాలా రోజులే అయ్యింది. తెలుగు నేలలో పారిశ్రామికంగా సత్తా చాటిన కుటుంబాల్లో ఒకటైన గల్లా ఫ్యామిలీ నుంచి వచ్చిన జయదేవ్.. ఇండస్ట్రియలిస్ట్ గా తనను తాను నిరూపించుకున్నారు. ఆపైై రాజకీయాల్లోకీ ఎంట్రీ ఇచ్చి… వచ్చీరావడంతోనే గుంటూరు ఎంపీగా విజయం సాధించి చట్టసభల్లో అడుగు పెట్టేశారు. అయితే 2019లో ఏపీలో అధికారం చేపట్టిన వైసీపీ సర్కారు హయంలో ఏం జరిగిందో తెలియదు గానీ… రాజకీయాలతో పాటుగా పారిశ్రామికంగానూ జయదేవ్ చాలా కాలం పాటు అడ్రెస్ లేకుండాపోయారు. తాజాగా ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు కొలువుదీరగానే తిరిగి ఆయన యాక్టివ్ అయిపోయారు.
మొన్నటికి మొన్న దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుల్లో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడలతో కలిసి కనిపించి జయదేవ్ తన రీ ఎంట్రీని గ్రాండ్ గానే చూపించారు. దావోస్ సదస్సు ముగిసిందో.. లేదో… ఏపీలో జయదేవ్ ఓ భారీ కాంట్రాక్టును చేజిక్కించుకున్నారు. 300 మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తి యూనిట్ ను నిర్మించే కాంట్రాక్టును జయదేవ్ నేతృత్వంలోని అమరరాజా ఇన్ ఫ్రా చేజిక్కించుకుంది. ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి వద్ద సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెకీ చేపట్టే ఈ కేంద్రాన్ని నిర్మించి ఇచ్చే భారీ కాంట్రాక్టును అమరరాజా చేజిక్కించుకుంది. 1,100 ఎకరాల్లో విస్తరించే ఈ కేంద్రాన్ని అమరరాజా కేవలం ఒక్క ఏడాదిలోనే పూర్తి చేసి కేంద్రానికి అప్పగించనుంది. ఈ కేంద్రానికి అవసరమైన బ్యాలెన్స్ ఆఫ్ సిస్టమ్స్, 220 కేవీ పూలింగ్ సబ్ స్టేషన్, 220 కేవీ వపర్ ట్రాన్స్ మిషన్ మౌలిక సదుపాయాలను అమరరాజా రికార్డు సమయంలో ఏర్పాటు చేయనుంది. ఇదిలా ఉంటే…ఈ ప్రాజెక్టు వ్యయం ఎంత అన్న వివరాలు తెలియరాలేదు.
This post was last modified on February 26, 2025 11:34 am
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…