ఏపీ అసెంబ్లీలో వైసీపీకి నిబంధనల ప్రకారం ప్రతిపక్ష పార్టీ హోదా దక్కదు అన్న విషయం తెలిసిందే. కానీ, తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని వైసీపీ నేతలు మారాం చేస్తున్నారు. దీంతో, జగన్ అండ్ కోపై టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీకి బీజేపీ సీనియర్ నేత, ఫైర్ బ్రాండ్ లాయర్ సుబ్రహ్మణ్యస్వామి బాసటగా నిలిచిన వైనం చర్చనీయాంశమైంది.
టెక్నికల్ గా ఏ శాసన సభలో అయినా 10 శాతం సీట్లు దక్కించుకున్ పార్టీకే ప్రతిపక్ష హోదా దక్కుతుందని స్వామి చెప్పారు. కానీ, ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేనల కూటమి అధికారంలో ఉందని, కాబట్టి, వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడంలో తప్పేమీ లేదని ఆయన తేల్చి చెప్పారు.
ఇటీవల తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగిన హింసపై స్వామి ఏపీ హైకోర్టులో పిల్ వేశారు. ఈ సందర్భంగా నేడు మీడియాతో మాట్లాడిన స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా దురదృష్టకరమైన ఘటనలు జరిగాయని, చాలామందిని భయపెట్టి దాడులు చేశారని ఆయన అన్నారు. ఆ ఘటనపై కేవలం ఎఫ్ఐఆర్ మాత్రమే నమోదు చేశారని, తదుపరి చర్యలు లేవని అన్నారు. ఎన్నికల వేళ హింసను నివారించేందుకు తీవ్రమైన చర్యలు తీసుకోవాని పిల్ వేశానని చెప్పారు. ఆ పిల్ మార్చి 12న విచారణకు వస్తుందని మీడియాకు వెల్లడించారు.
ఇక, తిరుపతి లడ్డూ అంశంపై కూడా స్వామి మాట్లాడారు. ఆ అంశం ముగిసిపోయిందని, కల్తీ లాంటి అంశాలు జరగకుండా చూడాలని అన్నారు. లడ్డూను కల్తీ చేయాలని నిజమైన భక్తులు ఎవరూ అనుకోరని, మంచి విషయం ఎవరు చెప్పినా పార్టీలకతీతంగా అంగీకరించాలని చెప్పారు.
This post was last modified on February 25, 2025 10:02 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…