ఏపీ అసెంబ్లీలో వైసీపీకి నిబంధనల ప్రకారం ప్రతిపక్ష పార్టీ హోదా దక్కదు అన్న విషయం తెలిసిందే. కానీ, తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని వైసీపీ నేతలు మారాం చేస్తున్నారు. దీంతో, జగన్ అండ్ కోపై టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీకి బీజేపీ సీనియర్ నేత, ఫైర్ బ్రాండ్ లాయర్ సుబ్రహ్మణ్యస్వామి బాసటగా నిలిచిన వైనం చర్చనీయాంశమైంది.
టెక్నికల్ గా ఏ శాసన సభలో అయినా 10 శాతం సీట్లు దక్కించుకున్ పార్టీకే ప్రతిపక్ష హోదా దక్కుతుందని స్వామి చెప్పారు. కానీ, ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేనల కూటమి అధికారంలో ఉందని, కాబట్టి, వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడంలో తప్పేమీ లేదని ఆయన తేల్చి చెప్పారు.
ఇటీవల తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగిన హింసపై స్వామి ఏపీ హైకోర్టులో పిల్ వేశారు. ఈ సందర్భంగా నేడు మీడియాతో మాట్లాడిన స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా దురదృష్టకరమైన ఘటనలు జరిగాయని, చాలామందిని భయపెట్టి దాడులు చేశారని ఆయన అన్నారు. ఆ ఘటనపై కేవలం ఎఫ్ఐఆర్ మాత్రమే నమోదు చేశారని, తదుపరి చర్యలు లేవని అన్నారు. ఎన్నికల వేళ హింసను నివారించేందుకు తీవ్రమైన చర్యలు తీసుకోవాని పిల్ వేశానని చెప్పారు. ఆ పిల్ మార్చి 12న విచారణకు వస్తుందని మీడియాకు వెల్లడించారు.
ఇక, తిరుపతి లడ్డూ అంశంపై కూడా స్వామి మాట్లాడారు. ఆ అంశం ముగిసిపోయిందని, కల్తీ లాంటి అంశాలు జరగకుండా చూడాలని అన్నారు. లడ్డూను కల్తీ చేయాలని నిజమైన భక్తులు ఎవరూ అనుకోరని, మంచి విషయం ఎవరు చెప్పినా పార్టీలకతీతంగా అంగీకరించాలని చెప్పారు.
This post was last modified on February 25, 2025 10:02 pm
టిల్లు సిరీస్ తర్వాత సిద్దు జొన్నలగడ్డ చేస్తున్న సినిమాగా జాక్ మీద ఈపాటికి భారీ అంచనాలు నెలకొనాలి. అయితే బయట…
ఏపీ సీఎం చంద్రబాబుపై జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరోసారి పొగడ్తల వర్షం కురిపించారు. బాబు ఔదార్యం…
దేశంలో మహిళలు, బాలికలకు భద్రతే లేకుండా పోయింది. ఈ మాటలు కాస్తంత కఠువుగా ఉన్నా.. వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలు…
కొన్ని పాత్రల విషయంలో మేకర్స్ చాలా పర్టికులర్గా ఉంటారు. ఒక పాత్రను ఫలానా వాళ్లు చేస్తేనే సినిమా చేయాలని లేదంటే లేదని…
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకుంటున్న పలు నిర్ణయాలు ప్రవాస భారతీయుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోన్న సంగతి…
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం అల్లూరి సీతారామ రాజు జిల్లా పర్యటనకు వెళ్లారు. గిరి…