Political News

వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వొచ్చన్న బీజేపీ ఫైర్ బ్రాండ్

ఏపీ అసెంబ్లీలో వైసీపీకి నిబంధనల ప్రకారం ప్రతిపక్ష పార్టీ హోదా దక్కదు అన్న విషయం తెలిసిందే. కానీ, తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని వైసీపీ నేతలు మారాం చేస్తున్నారు. దీంతో, జగన్ అండ్ కోపై టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీకి బీజేపీ సీనియర్ నేత, ఫైర్ బ్రాండ్ లాయర్ సుబ్రహ్మణ్యస్వామి బాసటగా నిలిచిన వైనం చర్చనీయాంశమైంది.

టెక్నికల్ గా ఏ శాసన సభలో అయినా 10 శాతం సీట్లు దక్కించుకున్ పార్టీకే ప్రతిపక్ష హోదా దక్కుతుందని స్వామి చెప్పారు. కానీ, ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేనల కూటమి అధికారంలో ఉందని, కాబట్టి, వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడంలో తప్పేమీ లేదని ఆయన తేల్చి చెప్పారు.

ఇటీవల తిరుపతి డిప్యూటీ మేయర్‌ ఎన్నిక సందర్భంగా జరిగిన హింసపై స్వామి ఏపీ హైకోర్టులో పిల్ వేశారు. ఈ సందర్భంగా నేడు మీడియాతో మాట్లాడిన స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి డిప్యూటీ మేయర్‌ ఎన్నిక సందర్భంగా దురదృష్టకరమైన ఘటనలు జరిగాయని, చాలామందిని భయపెట్టి దాడులు చేశారని ఆయన అన్నారు. ఆ ఘటనపై కేవలం ఎఫ్ఐఆర్ మాత్రమే నమోదు చేశారని, తదుపరి చర్యలు లేవని అన్నారు. ఎన్నికల వేళ హింసను నివారించేందుకు తీవ్రమైన చర్యలు తీసుకోవాని పిల్‌ వేశానని చెప్పారు. ఆ పిల్‌ మార్చి 12న విచారణకు వస్తుందని మీడియాకు వెల్లడించారు.

ఇక, తిరుపతి లడ్డూ అంశంపై కూడా స్వామి మాట్లాడారు. ఆ అంశం ముగిసిపోయిందని, కల్తీ లాంటి అంశాలు జరగకుండా చూడాలని అన్నారు. లడ్డూను కల్తీ చేయాలని నిజమైన భక్తులు ఎవరూ అనుకోరని, మంచి విషయం ఎవరు చెప్పినా పార్టీలకతీతంగా అంగీకరించాలని చెప్పారు.

This post was last modified on February 25, 2025 10:02 pm

Share
Show comments
Published by
Satya
Tags: BJPYS Jagan

Recent Posts

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

28 minutes ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

4 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

5 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

5 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

5 hours ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

6 hours ago