ఏపీ అసెంబ్లీలో వైసీపీకి నిబంధనల ప్రకారం ప్రతిపక్ష పార్టీ హోదా దక్కదు అన్న విషయం తెలిసిందే. కానీ, తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని వైసీపీ నేతలు మారాం చేస్తున్నారు. దీంతో, జగన్ అండ్ కోపై టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీకి బీజేపీ సీనియర్ నేత, ఫైర్ బ్రాండ్ లాయర్ సుబ్రహ్మణ్యస్వామి బాసటగా నిలిచిన వైనం చర్చనీయాంశమైంది.
టెక్నికల్ గా ఏ శాసన సభలో అయినా 10 శాతం సీట్లు దక్కించుకున్ పార్టీకే ప్రతిపక్ష హోదా దక్కుతుందని స్వామి చెప్పారు. కానీ, ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేనల కూటమి అధికారంలో ఉందని, కాబట్టి, వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడంలో తప్పేమీ లేదని ఆయన తేల్చి చెప్పారు.
ఇటీవల తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగిన హింసపై స్వామి ఏపీ హైకోర్టులో పిల్ వేశారు. ఈ సందర్భంగా నేడు మీడియాతో మాట్లాడిన స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా దురదృష్టకరమైన ఘటనలు జరిగాయని, చాలామందిని భయపెట్టి దాడులు చేశారని ఆయన అన్నారు. ఆ ఘటనపై కేవలం ఎఫ్ఐఆర్ మాత్రమే నమోదు చేశారని, తదుపరి చర్యలు లేవని అన్నారు. ఎన్నికల వేళ హింసను నివారించేందుకు తీవ్రమైన చర్యలు తీసుకోవాని పిల్ వేశానని చెప్పారు. ఆ పిల్ మార్చి 12న విచారణకు వస్తుందని మీడియాకు వెల్లడించారు.
ఇక, తిరుపతి లడ్డూ అంశంపై కూడా స్వామి మాట్లాడారు. ఆ అంశం ముగిసిపోయిందని, కల్తీ లాంటి అంశాలు జరగకుండా చూడాలని అన్నారు. లడ్డూను కల్తీ చేయాలని నిజమైన భక్తులు ఎవరూ అనుకోరని, మంచి విషయం ఎవరు చెప్పినా పార్టీలకతీతంగా అంగీకరించాలని చెప్పారు.
This post was last modified on February 25, 2025 10:02 pm
గత ఏడాది ప్రతిష్ఠాత్మకంగా గద్దర్ అవార్డులను మొదలుపెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. ఒకేసారి చాలా ఏళ్లకు కలిపి అవార్డులు ప్రకటించిన సంగతి…
దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…