అటు జీవీ రెడ్డి, ఇటు ఐఏఎస్ అధికారి దినేశ్ కుమార్ పంతాలు, పట్టింపుల కారణంగా పెను వివాదానికి కేంద్రంగా మారిన ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ దిద్దుబాటులో భాగంగా రెండో దశ చర్యలకు తొలి అడుగు పడింది. ఇప్పటికే సంస్థను వివాదంలోకి నెట్టిన జీవీ రెడ్డి సంస్థ చైర్మన్ పదవికి రాజీనామా చేయగా… తన వంతు ఆజ్యం పోసిన దినేశ్ ను చంద్రబాబు సర్కారు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. దినేశ్ కుమార్ బదిలీ జరిగి ఒక్క రోజు కూడా గడవకుండానే.. ఆ సంస్థకు నూతన అధికారిని ఎండీగా నియమించారు.
యువ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ఆదిత్య సీవీ ని ఫైబర్ నెట్ కార్పొరేషన్ నూతన ఎండీగా నియమితులు అయ్యారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రానికే ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రవీణ్ ఆదిత్యను రెగ్యులర్ ఎండీగా కాకుండా ఇంచార్జీ ఎండీగా నియమించింది. అంతేకాకుండా ఫైబర్ ఎండీ హోదాలో దినేశ్ కుమార్ నేతృత్వం వహించిన రియల్ టైం గవర్నెన్స్ సీఈఓగా, గ్యాస్, డ్రోన్ కార్పోరేషన్ల ఎండీగానూ ప్రవీణ్ కు బాధ్యతలు అప్పగించారు.
ప్రస్తుతం ప్రవీణ్ ఆదిత్య…ఏపీ మారిటైం బోర్డు సీఈఓగా విధులు నిర్వర్తిస్తున్నారు. 2016 ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన ఆదిత్య తమిళనాడులోని కోయంబత్తూరు ఇన్ స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ పట్టా సాధించారు. ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరైన ఆయన మంచి ర్యాంకు సాధించి.. ఐఏఎస్ కేడర్ కు ఎంపికయ్యారు. సివిల్ సర్వీసెస్ లో చేరిన తర్వాతే ప్రవీణ్… కేరళ కేడర్ ఐఏఎస్ కు చెందిన ఇలాకియాను వివాహం చేసుకున్నారు. ప్రవీణ్ తో వివాహం తర్వాత ఇలాకియాను కేంద్రం కేరళ కేడర్ నుంచి ఏపీ కేడర్ కు బదిలీ చేసింది.
This post was last modified on February 25, 2025 9:51 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…