ఇటు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే, అనంతపురం జిల్లా తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ గా కొనసాగుతున్న జేసీ ప్రభాకర్ రెడ్డి… అటు రాజకీయ నేతగా మారిన సినీ నటి మాధవీ లత… ఇద్దరు కూడా ఒకరికి ఒకరు ఏమాత్రం తగ్గకుండా సాగుతున్నారు. ఓ చిన్న వివాదం వీరిద్దరి మధ్య రచ్చకు కారణంగా నిలవగా.. ఆ రచ్చ దాదాపుగా రెండు నెలల తరబడి కొనసాగుతుండటం గమనార్హం. ఓ వైపేమో వీరిద్దరి పార్టీలు మిత్రపక్షాలుగా సాగుతున్నా.. వీరిద్దరు మాత్రం బద్ధ శత్రువుల మాదిరిగా కీచులాడుకుంటున్నారు. వెరసి వీరి వివాదం ఎప్పటికప్పుడు కొత్త ట్విస్టులతో రక్తి కడుతోంది.
మొన్నటి న్యూ ఇయర్ వేడుక సందర్భంగా తాడిపత్రిలో మహిళలకు మాత్రమే అంటూ జేసీ ఓ ప్రకటన చేస్తే… దానిపై మాధవీ లత భగ్గుమన్నారు. మహిళలకు మాత్రమే ప్రత్యేక వేడుకలేంటి?. అది కూడా తాడిపత్రిలో భద్రత అంతంతమాత్రంగా ఉండే… జులాయిలు అధికంగా తిరిగే ప్రాంతంలోనా అంటూ ఆమె విరుచుకుపడ్డారు. ఈ వ్యాఖ్యలపై హై టెన్షన్ తో ఊగిపోయిన జేసీ.. మాధవీ లతపై బూతుల పర్వం అందుకున్నారు. గతంలో తాడిపత్రి వచ్చినప్పుడు ఎలా వ్యవహరించావో నా వద్ద వీడియోలు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కలకలం రేపగా.. ఓ మహిళగా మాధవీ లతపై తాను అలా మాట్లాడి ఉండకూదని చెప్పిన జేసీ సిన్సియర్ గానే సారీ చెప్పారు.
అప్పటిదాకా స్ట్రాంగ్ గానే కనిపించిన మాధవీ లత.. జేసీ సారీ వీడియో చూసినంతనే బోరుమన్నారు. కొన్ని రోజులు సైలెంట్ గానే ఉన్న మాధవీ లత ఒకానొక రోజు జేసీపై ఏకంగా సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సైబరాబాద్ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఆ తర్వాత విచారణ, ఇతరత్రా చర్యలేవీ పోలీసులు చేపట్టలేదు గానీ.. ఇప్పుడు జేసీ వంతు వచ్చినట్టుంది. తాడిపత్రికి చెందిన టీడీపీ మహిళా నేత, మాల కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ.. మాధవీ లతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ మనోభావాలు దెబ్బతీశారంటూ మాధవీ లతపై ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. మరి ఈ వివాదం ఎప్పుడు ముగుస్తుందో… వీరి మధ్య సయోధ్య ఎప్పుడు కుదురుతుందో చూడాలి.
This post was last modified on February 25, 2025 3:25 pm
'ఫౌజీ' సినిమా నుంచి ఇప్పటిదాకా వచ్చిన పోస్టర్లు చూస్తుంటే మేకర్స్ ఇంటెన్షన్ క్లియర్ గా అర్థమవుతోంది. ప్రభాస్ ను సాఫ్ట్…
ఎన్నికల్లో నోట్లు పంపిణీ చేస్తేనే ఓట్లు వేయడం మామూలైపోయింది. గత కొన్నేళ్లుగా ఈ దుస్సాంప్రదాయం పెరిగిపోయింది. దీంతో నిజంగా ప్రజలకు…
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన ఒక వీడియో ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారింది.…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) అధినేత అభిజిత్ దీప్కే ఇటీవల ప్రకటించిన `పాఠశాలల అభివృద్ధి` కార్యక్రమానికి 80వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలే…
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశమంతా జాతీయ పతాకాన్ని ఎగరేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి లోని రాయపూడి గ్రౌండ్స్…
గత కొన్ని రోజులుగా మలయాళ కథానాయిక అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.…