వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ముప్పేట ఉచ్చు బిగుసుకుంది. విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు. టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త సత్వర్థన్ను కిడ్నాప్ చేసి, బెదిరించిన కేసులో నేరుగా ఆయనను విచారించాలన్న పోలీసుల అభ్యర్థనను పరిగణనలో తీసుకున్న న్యాయస్థానం.. మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతించింది.
దీంత వంశీతో పాటు A7 శ్రీపతి, A8 శివరామకృష్ణ ప్రసాద్ లను కస్టడీలోకి తీసుకున్న విజయవాడ పోలీసులు, ప్రభుత్వ ఆసుపత్రి లో వైద్య పరీక్షల కోసం తీసుకువెళ్లారు. అనంతరం కృష్ణ లంక పోలీస్టేషన్ కు తరలించి.. నేరుగా విచారించనున్నారు. మూడు రోజుల పాటు ఈ ముగ్గురినీ విచారణ చేయనున్న పోలీసులు సదరు నివేదికను కోర్టుకు సమర్పిస్తారు. ఇదిలావుంటే.. మరోవైపు.. గన్నవరం పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదైంది.
గన్నవరంలోని గాంధీ బొమ్మ సెంటర్ లో 10 కోట్ల రూపాయల విలువైన స్థలం కబ్జాపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైకోర్ట్ న్యాయవాది సతీమణి సుంకర సీతామహాలక్ష్మి పేరిట ఉన్న స్థలం కబ్జా చేసినట్టు ఫిర్యాదు రావడంతో వ్యవస్థీకృత నేరం క్రింద కేసు నమోదు చేసినట్టు బాధితురాలు చెప్పారు. ఈ కేసులోనూ వల్లభనేని వంశీ తో పాటు మరో 15 మంది పై ఫిర్యాదు చేసినప్పటికీ.. ప్రాథమికంగా వంశీపై కేసు పెట్టినట్టు పోలీసులు తెలిపారు.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…