Political News

వల్లభనేని వంశీకి ముప్పేట ఉచ్చు

వైసీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీకి ముప్పేట ఉచ్చు బిగుసుకుంది. విజ‌య‌వాడ స‌బ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని పోలీసులు త‌మ క‌స్ట‌డీకి తీసుకున్నారు. టీడీపీ సోష‌ల్ మీడియా కార్య‌క‌ర్త స‌త్వ‌ర్థ‌న్‌ను కిడ్నాప్ చేసి, బెదిరించిన కేసులో నేరుగా ఆయ‌న‌ను విచారించాల‌న్న పోలీసుల అభ్య‌ర్థ‌న‌ను ప‌రిగ‌ణ‌న‌లో తీసుకున్న న్యాయ‌స్థానం.. మూడు రోజుల పాటు క‌స్ట‌డీకి అనుమ‌తించింది.

దీంత వంశీతో పాటు A7 శ్రీపతి, A8 శివరామకృష్ణ ప్రసాద్ లను కస్టడీలోకి తీసుకున్న విజ‌య‌వాడ పోలీసులు, ప్రభుత్వ ఆసుపత్రి లో వైద్య పరీక్షల కోసం తీసుకువెళ్లారు. అనంతరం కృష్ణ లంక పోలీస్టేషన్ కు తరలించి.. నేరుగా విచారించ‌నున్నారు. మూడు రోజుల పాటు ఈ ముగ్గురినీ విచారణ చేయనున్న పోలీసులు స‌ద‌రు నివేదిక‌ను కోర్టుకు స‌మ‌ర్పిస్తారు. ఇదిలావుంటే.. మ‌రోవైపు.. గన్నవరం పోలీస్ స్టేషన్ లో మ‌రో కేసు నమోదైంది.

గన్నవరంలోని గాంధీ బొమ్మ సెంటర్ లో 10 కోట్ల రూపాయ‌ల‌ విలువైన స్థలం కబ్జాపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైకోర్ట్ న్యాయవాది సతీమణి సుంకర సీతామహాలక్ష్మి పేరిట ఉన్న స్థలం కబ్జా చేసినట్టు ఫిర్యాదు రావ‌డంతో వ్యవస్థీకృత నేరం క్రింద కేసు నమోదు చేసిన‌ట్టు బాధితురాలు చెప్పారు. ఈ కేసులోనూ వల్లభనేని వంశీ తో పాటు మరో 15 మంది పై ఫిర్యాదు చేసినప్ప‌టికీ.. ప్రాథ‌మికంగా వంశీపై కేసు పెట్టిన‌ట్టు పోలీసులు తెలిపారు.

This post was last modified on February 25, 2025 3:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

1 hour ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

6 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

6 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

9 hours ago