Political News

టీడీపీ ఆఫీసుపై దాడి.. 30 మందికి బెయిల్‌

గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరిలోని తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాల‌యంపై 2022లో జ‌రిగిన దాడి.. విధ్వంసం కేసులో మాజీ మంత్రి జోగి ర‌మేష్ స‌హా.. యువ నాయ‌కుడు దేవినేని అవినాష్‌, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వంటి మొత్తం 30 మంది  నాయ‌కుల‌కు సుప్రీంకోర్టు రెగ్యుల‌ర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ మేర‌కు తాజాగా సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం ఉత్త‌ర్వులు జారీ చేసింది. అయితే.. కేసు విచార‌ణ సంద‌ర్భంగా ఇటు స‌ర్కారు త‌ర‌ఫున‌, అటు వైసీపీ త‌ర‌ఫున హోరా హోరీ వాద‌న‌లు జ‌రిగాయి.

స‌ర్కారు త‌ర‌ఫున సిద్ధార్థ‌లూథ్రా వాద‌న‌లు వినిపించారు. ఇది కుట్ర పూరిత నేర‌మ‌ని.. కార్యాల‌యాన్ని ధ్వంసం చేయ‌డ‌మే ఉద్దేశం కాద‌ని.. అందులో ఉన్న నాయ‌కుల‌ను కూడా.. హ‌త్య చేయాల‌ని ప‌న్నాగం ఉంద‌న్నారు. అయితే.. ఇది నేర పూరిత కుట్ర అనేందుకు బ‌ల‌మైన సాక్ష్యాల‌ను ప్రొడ్యూస్ చేయ‌లేక పోయార‌ని.. సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం పేర్కొంది. పైగా మూడేళ్లు తాత్సారం చేశార‌ని.. ప్ర‌భుత్వాల‌తో త‌మ‌కు ప‌నిలేద‌ని.. పోలీసులు ఏం చేశారో చెప్పాల‌ని ప్ర‌శ్నించింది.

అయితే.. పోలీసులు త‌ర‌ఫున కూడా లూథ్రావాద‌న‌లు వినిపిస్తూ.. వారు కేసు న‌మోదు చేశార‌ని.. కానీ, నిందితులు హైకోర్టును ఆశ్ర‌యించ‌డ‌తో ఆల‌స్యం జ‌రిగింద‌న్నారు. ఇక‌, పిటిష‌నర్ల త‌ర‌ఫున‌.. పొన్న‌వోలు సుధాక‌ర్‌, క‌పిల్ సిబాల్ వంటి సీనియ‌ర్లు వాద‌న‌లు వినిపిస్తూ.. ఇది నేర పూరిత కుట్ర కాద‌న్నారు. కొంద‌రు రెచ్చ‌గొట్ట‌డం వ‌ల్ల జ‌రిగిన పొర‌పాటుగా పేర్కొన్నారు. అయిన‌ప్ప‌టికీ.. నిందితులు.. త‌మ పాస్ పోర్టును అప్ప‌గించేశార‌ని తెలిపారు.

ఈ వివ‌రాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. 30 మంది నిందితుల‌కు రెగ్యుల‌ర్ బెయిల్ మంజూరు చేసింది. పైగా.. ఈ కేసులో ఏదైనా వాద‌న‌లు ఉంటే.. ప్ర‌భుత్వం హైకోర్టుకు చెప్పుకోవాల‌ని సూచించింది. అనంతరం.. ఈ కేసును మూసి వేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఇదిలావుంటే.. గ‌తంలో ఈ కేసులో జోగి ర‌మేష్ స‌హా.. లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్‌ల‌ను పోలీసులు విచారించారు. అనంత‌రం.. వీరు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. 

This post was last modified on February 25, 2025 2:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: కేర‌ళ‌.. ఇక‌పై కేర‌ళం!

త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల విష‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కీల‌క క‌స‌ర‌త్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…

6 hours ago

సత్యతో పోలికలు సబబు కాదు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…

7 hours ago

ఒక్క ఎపిసోడుతో హాట్ టాపిక్ అయ్యింది

ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…

8 hours ago

బిర్యానీ రేంజులో ‘ప్యారడైజ్’ పాట

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…

8 hours ago

తిరుమల జీవోలపై చంద్రబాబు క్లారిటీ

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…

9 hours ago

శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…

11 hours ago