గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై 2022లో జరిగిన దాడి.. విధ్వంసం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ సహా.. యువ నాయకుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వంటి మొత్తం 30 మంది నాయకులకు సుప్రీంకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు తాజాగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. కేసు విచారణ సందర్భంగా ఇటు సర్కారు తరఫున, అటు వైసీపీ తరఫున హోరా హోరీ వాదనలు జరిగాయి.
సర్కారు తరఫున సిద్ధార్థలూథ్రా వాదనలు వినిపించారు. ఇది కుట్ర పూరిత నేరమని.. కార్యాలయాన్ని ధ్వంసం చేయడమే ఉద్దేశం కాదని.. అందులో ఉన్న నాయకులను కూడా.. హత్య చేయాలని పన్నాగం ఉందన్నారు. అయితే.. ఇది నేర పూరిత కుట్ర అనేందుకు బలమైన సాక్ష్యాలను ప్రొడ్యూస్ చేయలేక పోయారని.. సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. పైగా మూడేళ్లు తాత్సారం చేశారని.. ప్రభుత్వాలతో తమకు పనిలేదని.. పోలీసులు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించింది.
అయితే.. పోలీసులు తరఫున కూడా లూథ్రావాదనలు వినిపిస్తూ.. వారు కేసు నమోదు చేశారని.. కానీ, నిందితులు హైకోర్టును ఆశ్రయించడతో ఆలస్యం జరిగిందన్నారు. ఇక, పిటిషనర్ల తరఫున.. పొన్నవోలు సుధాకర్, కపిల్ సిబాల్ వంటి సీనియర్లు వాదనలు వినిపిస్తూ.. ఇది నేర పూరిత కుట్ర కాదన్నారు. కొందరు రెచ్చగొట్టడం వల్ల జరిగిన పొరపాటుగా పేర్కొన్నారు. అయినప్పటికీ.. నిందితులు.. తమ పాస్ పోర్టును అప్పగించేశారని తెలిపారు.
ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. 30 మంది నిందితులకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. పైగా.. ఈ కేసులో ఏదైనా వాదనలు ఉంటే.. ప్రభుత్వం హైకోర్టుకు చెప్పుకోవాలని సూచించింది. అనంతరం.. ఈ కేసును మూసి వేస్తున్నట్టు ప్రకటించింది. ఇదిలావుంటే.. గతంలో ఈ కేసులో జోగి రమేష్ సహా.. లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్లను పోలీసులు విచారించారు. అనంతరం.. వీరు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఏపీలో టీడీపీ-వైసీపీల మధ్య మాటల తూటాలు.. మరింత భారీ రేంజ్లో పేలుతున్నాయి. నిన్న మొన్నటి వరకు టీడీపీ చేసిన వ్యాఖ్యలపై…
వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి రానివ్వను. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ.. 2024 ఎన్నికలకు ముందు భీషణ ప్రతిజ్ఞ చేసిన…
ఏపీ ప్రతిపక్షం(ప్రధాన కాదు) వైసీపీ సోషల్ మీడియాలో దూకుడుగా ఉంటున్న విషయం తెలిసిందే. యూట్యూబ్, ఇన్స్టా, వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్..…
గత ఏడాది తమిళ, తెలుగు భాషల్లో పెద్ద హిట్ అయిన సినిమాల్లో ‘డ్యూడ్’ ఒకటి. లవ్ టుడే, డ్రాగన్ చిత్రాలతో…
బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేస్తున్న హాలీవుడ్ మూవీ అబ్సెషన్ ఇప్పుడప్పుడే ఆగేలా లేదు. రెండు గంటల లోపే నిడివితో థ్రిల్లర్…
ఏపీలో అధికార కూటమిలో కీలక భాగస్వామి అయిన జనసేన.. దేశ రాజధాని ఢిల్లీలో రేపు ఓ కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది.…