Political News

టీడీపీ ఆఫీసుపై దాడి.. 30 మందికి బెయిల్‌

గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరిలోని తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాల‌యంపై 2022లో జ‌రిగిన దాడి.. విధ్వంసం కేసులో మాజీ మంత్రి జోగి ర‌మేష్ స‌హా.. యువ నాయ‌కుడు దేవినేని అవినాష్‌, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వంటి మొత్తం 30 మంది  నాయ‌కుల‌కు సుప్రీంకోర్టు రెగ్యుల‌ర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ మేర‌కు తాజాగా సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం ఉత్త‌ర్వులు జారీ చేసింది. అయితే.. కేసు విచార‌ణ సంద‌ర్భంగా ఇటు స‌ర్కారు త‌ర‌ఫున‌, అటు వైసీపీ త‌ర‌ఫున హోరా హోరీ వాద‌న‌లు జ‌రిగాయి.

స‌ర్కారు త‌ర‌ఫున సిద్ధార్థ‌లూథ్రా వాద‌న‌లు వినిపించారు. ఇది కుట్ర పూరిత నేర‌మ‌ని.. కార్యాల‌యాన్ని ధ్వంసం చేయ‌డ‌మే ఉద్దేశం కాద‌ని.. అందులో ఉన్న నాయ‌కుల‌ను కూడా.. హ‌త్య చేయాల‌ని ప‌న్నాగం ఉంద‌న్నారు. అయితే.. ఇది నేర పూరిత కుట్ర అనేందుకు బ‌ల‌మైన సాక్ష్యాల‌ను ప్రొడ్యూస్ చేయ‌లేక పోయార‌ని.. సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం పేర్కొంది. పైగా మూడేళ్లు తాత్సారం చేశార‌ని.. ప్ర‌భుత్వాల‌తో త‌మ‌కు ప‌నిలేద‌ని.. పోలీసులు ఏం చేశారో చెప్పాల‌ని ప్ర‌శ్నించింది.

అయితే.. పోలీసులు త‌ర‌ఫున కూడా లూథ్రావాద‌న‌లు వినిపిస్తూ.. వారు కేసు న‌మోదు చేశార‌ని.. కానీ, నిందితులు హైకోర్టును ఆశ్ర‌యించ‌డ‌తో ఆల‌స్యం జ‌రిగింద‌న్నారు. ఇక‌, పిటిష‌నర్ల త‌ర‌ఫున‌.. పొన్న‌వోలు సుధాక‌ర్‌, క‌పిల్ సిబాల్ వంటి సీనియ‌ర్లు వాద‌న‌లు వినిపిస్తూ.. ఇది నేర పూరిత కుట్ర కాద‌న్నారు. కొంద‌రు రెచ్చ‌గొట్ట‌డం వ‌ల్ల జ‌రిగిన పొర‌పాటుగా పేర్కొన్నారు. అయిన‌ప్ప‌టికీ.. నిందితులు.. త‌మ పాస్ పోర్టును అప్ప‌గించేశార‌ని తెలిపారు.

ఈ వివ‌రాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. 30 మంది నిందితుల‌కు రెగ్యుల‌ర్ బెయిల్ మంజూరు చేసింది. పైగా.. ఈ కేసులో ఏదైనా వాద‌న‌లు ఉంటే.. ప్ర‌భుత్వం హైకోర్టుకు చెప్పుకోవాల‌ని సూచించింది. అనంతరం.. ఈ కేసును మూసి వేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఇదిలావుంటే.. గ‌తంలో ఈ కేసులో జోగి ర‌మేష్ స‌హా.. లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్‌ల‌ను పోలీసులు విచారించారు. అనంత‌రం.. వీరు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. 

This post was last modified on February 25, 2025 2:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

గ‌ద్ద‌ర్ అవార్డుల్లో గందరగోళం.. ఏం జరిగింది?

గ‌త ఏడాది ప్ర‌తిష్ఠాత్మ‌కంగా గ‌ద్ద‌ర్ అవార్డుల‌ను మొద‌లుపెట్టిన తెలంగాణ ప్ర‌భుత్వం.. ఒకేసారి చాలా ఏళ్ల‌కు క‌లిపి అవార్డులు ప్ర‌క‌టించిన సంగ‌తి…

16 minutes ago

యూత్ హీరోలు రూటు మారుస్తున్నారు

దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…

3 hours ago

హెచ్చరికలు వృథా.. చర్యలు ఎప్పుడూ?

ఏపీలో టీడీపీ నాయ‌కులు దారి త‌ప్పుతున్నార‌న్న విష‌యంపై స‌మీక్ష‌లు చేయ‌డం.. వారిపై సీరియ‌స్ అయిన‌ట్టుగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం..…

7 hours ago

పెద్దిరెడ్డీ అనుచ‌రుల అరెస్టు.. ఏం జ‌రిగింది?

వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్‌గా భావిస్తున్న ఇద్దరు కీలక…

7 hours ago

పవర్ స్టార్ మేజిక్ పని చేస్తోంది

ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…

7 hours ago

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

8 hours ago