Political News

జ‌గ‌న్ తెలుసుకోవాలి: ప్ర‌తిప‌క్ష హోదానే ప్రామాణిక‌మా ..!

ప్ర‌తిప‌క్ష హోదానే ప్రామాణిక‌మా? ఇదీ.. కొన్నాళ్లుగా రాష్ట్రంలో జ‌రుగుతున్న చ‌ర్చ‌. తాజాగా మ‌రోసారి ర‌చ్చ‌కెక్కింది. ప్ర‌తిప‌క్ష హోదా కోరుతూ.. అసెంబ్లీలో వైసీపీ స‌భ్యులు చేసిన ఆందోళ‌న‌, నిర‌స‌న వంటివి పెద్ద ఎత్తున మీడియాలో చ‌ర్చ‌కు వ‌చ్చాయి. ప్ర‌ధానంగా అసెంబ్లీ తొలి రోజే గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగిస్తున్న స‌మయంలోనే ఆందోళ‌న‌కు దిగారు. అంతేకాదు.. స‌భ నుంచి వాకౌట్ చేశారు. ఈ ప‌రిణామాలు ప‌దేళ్లకు పైగా రాజ‌కీయ చ‌రిత్ర‌ను పొగేసుకున్న జ‌గ‌న్‌కు ఎలా ఉన్నా.. జ‌నాల్లో మాత్రం జోక్‌గానే ఉంది.

ఇదే ప్రామాణిక‌మా..
ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం హోదా ఉన్నా.. గ‌తంలో టీడీపీ ఏం చేసింది? అని ప్ర‌శ్నిస్తే.. ఫ‌లితం శూన్య‌మే. ఎందు కంటే.. అప్ప‌ట్లో వైసీపీ అధికారంలో ఉన్న నేప‌థ్యంలో 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. అప్ప‌టి చంద్ర‌బాబుకు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా వ‌చ్చినా.. స‌భ‌లో మాట్లాడేందుకు మాత్రం పెద్ద‌గా ఎలాంటి అవ‌కాశం చిక్క లేదు. పైగా అవ‌మానాలు, ఈస‌డింపులు.. ఎక్కువ‌గా క‌నిపించాయి. దీంతో టీడీపీ స‌భ్యులు అవ‌మానాలు ఎదుర్కొన్నారు.

అయినప్ప‌టికీ స‌భ‌లో కొన‌సాగారు. స‌భా మ‌ర్యాద‌ను కాపాడారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ఎత్తి చూపారు. నినాదాలు చేశారు, హోరెత్తించారు. చివ‌రకు స‌భ‌లో భైటాయించి.. ఆందోళ‌న‌కు కూడా దిగారు. కానీ, ఇప్పుడు వైసీపీ మాత్రం 11 మంది స‌భ్యులతో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కోసం డిమాండ్ చేయ‌డం వింత‌గా ఉంద‌న్న వ్యా ఖ్య‌లు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. ముందుగా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌స్తావిస్తే.. దానంత‌ట అదే ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్షిస్తుంది. ఫ‌లితంగా ఇబ్బందులు లేకుండానే స‌భ‌లో అవ‌కాశం చిక్కుతుంది.

కానీ, ఆదిశ‌గా వైసీపీ వేస్తున్న అడుగులు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. పైగా.. యాగీ చేయ‌డం ద్వారానే ప్ర‌తిప‌క్ష హోదా వ‌స్తుంద‌ని అనుకున్నా పొర‌పాటే. మ‌రోవైపు.. పొరుగు రాష్ట్రాల్లో త‌క్కువ మంది స‌భ్యులు ఉన్నా.. ప‌దేళ్ల పాటు పాల‌న చేశామ‌న్న భావ‌న ఉన్నా.. ప్ర‌తిప‌క్షంలో కూర్చునే స‌రికి.. వాటిని మ‌రిచి ప్ర‌జ‌ల ప‌క్షాన పోరాడుతున్న పార్టీలు క‌నిపిస్తున్నాయి. దీనిని బ‌ట్టి.. జ‌గ‌న్ నేర్చుకోవాల్సిన ప‌రిస్థితి ఉంది. ప్ర‌తిప‌క్ష హోదానే ప్రామాణికంకాదు. ప్ర‌జ‌ల త‌ర‌ఫున పోరాటం చేసేందుకు ముందుకు వ‌స్తే.. అదే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాన్ని మించిన ప‌క్షంగా మారుతుంది. క‌మ్యూనిస్టుల గొంతు విప్పితే.. ప్ర‌తిప‌క్షాలు కూడా ప‌నికిరావ‌న్న వాద‌న ఉన్న విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ గుర్తించాల్సి ఉంటుంది.

This post was last modified on February 25, 2025 9:48 am

Share

Recent Posts

ఓటుకు నోటు తీసుకోవడం మానేయలేమా

ఎన్నికల్లో నోట్లు పంపిణీ చేస్తేనే ఓట్లు వేయడం మామూలైపోయింది. గత కొన్నేళ్లుగా ఈ దుస్సాంప్రదాయం పెరిగిపోయింది. దీంతో నిజంగా ప్రజలకు…

59 minutes ago

సోనియా వందేమాతరాన్ని ఆపమన్నారా

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన ఒక వీడియో ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారింది.…

2 hours ago

`కాక్రోచ్‌`లు మ‌ళ్లీ ప‌ని మొద‌లు పెట్టేశారు…

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) అధినేత అభిజిత్ దీప్కే ఇటీవ‌ల ప్ర‌క‌టించిన `పాఠ‌శాల‌ల అభివృద్ధి` కార్య‌క్ర‌మానికి 80వ స్వాతంత్ర దినోత్స‌వం వేడుక‌లే…

4 hours ago

జండా పండగ జరుపుకోలేదా జగన్?

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశమంతా జాతీయ పతాకాన్ని ఎగరేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి లోని రాయపూడి గ్రౌండ్స్…

5 hours ago

అనుప‌మ ఆ రోజు ఏడ్చింది అందుకా?

గ‌త కొన్ని రోజులుగా మ‌ల‌యాళ క‌థానాయిక అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ బ్రేకప్ వ్య‌వ‌హారం సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే.…

11 hours ago

తమిళ ప్రేక్షకుల ప్రేమ ఎందుకు తక్కువంటే

తాజాగా విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ తెలుగులో చూపిస్తున్న జోరు తమిళంలో ప్రదర్శించడం లేదన్నది వాస్తవం. ఓపెనింగ్స్ నెంబర్లు పోల్చుకుని…

11 hours ago