Political News

జ‌గ‌న్ తెలుసుకోవాలి: ప్ర‌తిప‌క్ష హోదానే ప్రామాణిక‌మా ..!

ప్ర‌తిప‌క్ష హోదానే ప్రామాణిక‌మా? ఇదీ.. కొన్నాళ్లుగా రాష్ట్రంలో జ‌రుగుతున్న చ‌ర్చ‌. తాజాగా మ‌రోసారి ర‌చ్చ‌కెక్కింది. ప్ర‌తిప‌క్ష హోదా కోరుతూ.. అసెంబ్లీలో వైసీపీ స‌భ్యులు చేసిన ఆందోళ‌న‌, నిర‌స‌న వంటివి పెద్ద ఎత్తున మీడియాలో చ‌ర్చ‌కు వ‌చ్చాయి. ప్ర‌ధానంగా అసెంబ్లీ తొలి రోజే గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగిస్తున్న స‌మయంలోనే ఆందోళ‌న‌కు దిగారు. అంతేకాదు.. స‌భ నుంచి వాకౌట్ చేశారు. ఈ ప‌రిణామాలు ప‌దేళ్లకు పైగా రాజ‌కీయ చ‌రిత్ర‌ను పొగేసుకున్న జ‌గ‌న్‌కు ఎలా ఉన్నా.. జ‌నాల్లో మాత్రం జోక్‌గానే ఉంది.

ఇదే ప్రామాణిక‌మా..
ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం హోదా ఉన్నా.. గ‌తంలో టీడీపీ ఏం చేసింది? అని ప్ర‌శ్నిస్తే.. ఫ‌లితం శూన్య‌మే. ఎందు కంటే.. అప్ప‌ట్లో వైసీపీ అధికారంలో ఉన్న నేప‌థ్యంలో 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. అప్ప‌టి చంద్ర‌బాబుకు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా వ‌చ్చినా.. స‌భ‌లో మాట్లాడేందుకు మాత్రం పెద్ద‌గా ఎలాంటి అవ‌కాశం చిక్క లేదు. పైగా అవ‌మానాలు, ఈస‌డింపులు.. ఎక్కువ‌గా క‌నిపించాయి. దీంతో టీడీపీ స‌భ్యులు అవ‌మానాలు ఎదుర్కొన్నారు.

అయినప్ప‌టికీ స‌భ‌లో కొన‌సాగారు. స‌భా మ‌ర్యాద‌ను కాపాడారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ఎత్తి చూపారు. నినాదాలు చేశారు, హోరెత్తించారు. చివ‌రకు స‌భ‌లో భైటాయించి.. ఆందోళ‌న‌కు కూడా దిగారు. కానీ, ఇప్పుడు వైసీపీ మాత్రం 11 మంది స‌భ్యులతో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కోసం డిమాండ్ చేయ‌డం వింత‌గా ఉంద‌న్న వ్యా ఖ్య‌లు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. ముందుగా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌స్తావిస్తే.. దానంత‌ట అదే ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్షిస్తుంది. ఫ‌లితంగా ఇబ్బందులు లేకుండానే స‌భ‌లో అవ‌కాశం చిక్కుతుంది.

కానీ, ఆదిశ‌గా వైసీపీ వేస్తున్న అడుగులు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. పైగా.. యాగీ చేయ‌డం ద్వారానే ప్ర‌తిప‌క్ష హోదా వ‌స్తుంద‌ని అనుకున్నా పొర‌పాటే. మ‌రోవైపు.. పొరుగు రాష్ట్రాల్లో త‌క్కువ మంది స‌భ్యులు ఉన్నా.. ప‌దేళ్ల పాటు పాల‌న చేశామ‌న్న భావ‌న ఉన్నా.. ప్ర‌తిప‌క్షంలో కూర్చునే స‌రికి.. వాటిని మ‌రిచి ప్ర‌జ‌ల ప‌క్షాన పోరాడుతున్న పార్టీలు క‌నిపిస్తున్నాయి. దీనిని బ‌ట్టి.. జ‌గ‌న్ నేర్చుకోవాల్సిన ప‌రిస్థితి ఉంది. ప్ర‌తిప‌క్ష హోదానే ప్రామాణికంకాదు. ప్ర‌జ‌ల త‌ర‌ఫున పోరాటం చేసేందుకు ముందుకు వ‌స్తే.. అదే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాన్ని మించిన ప‌క్షంగా మారుతుంది. క‌మ్యూనిస్టుల గొంతు విప్పితే.. ప్ర‌తిప‌క్షాలు కూడా ప‌నికిరావ‌న్న వాద‌న ఉన్న విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ గుర్తించాల్సి ఉంటుంది.

This post was last modified on February 25, 2025 9:48 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆ ప్రచారంపై మండిపడ్డ కోమటిరెడ్డి

తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…

48 minutes ago

అమరావతిపై మాట్లాడే నైతిక హక్కు ఉందా జగన్!

ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…

1 hour ago

నాగ్ ఓకే అనడమే ఆలస్యం

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…

2 hours ago

ప్రభాస్ సరదాలు ఓవర్… ఇక సమరమే!

ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…

2 hours ago

పందెం రాయుళ్లకు తిప్పలు తప్పవా…?

సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…

3 hours ago

అమరావతిపై 48 గంటల్లో టోన్ మార్చిన వైసీపీ!

ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోకాల్డ్ రాజధాని అంటూ అమరావతిని…

3 hours ago