కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుపై సీఎంరేవంత్ రెడ్డి ఫైరయ్యారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మంచిర్యాలలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నిజానికి ఇక్కడ బీజేపీ అభ్యర్థి బలమైన పోటీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీకి కేంద్రంగా చేసుకుని రేవంత్ విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్రం ఏర్పడ్డాక.. ఇప్పటి వరకు కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని ప్రశ్నించారు.
ఇప్పటి వరకు రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఇద్దరికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. వీటిలో ఒకటి కిషన్ రెడ్డికి, రెండోది బండి సంజయ్కు మాత్రమే దక్కిందన్నారు. మిగిలిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పట్టభద్రులను నమ్మించేందుకు బీజేపీ నేతలు కుయుక్తులు పన్నుతున్నారని వ్యాఖ్యానించారు. ఒక్క పది మందికి కూడా ఉద్యోగాలు కల్పించలేదని దుయ్యబట్టారు. తాము అధికారం లోకి వచ్చిన తర్వాత.. 55 వేల మందికి పైగా ఉద్యోగాలు కల్పించినట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
ఇలాంటివారు రాష్ట్రంలోని గ్రాడ్యుయేట్లకు ఇంకేం ఉపాధి చూపిస్తారని రేవంత్ రెడ్డి నిలదీశారు. రాష్ట్రం లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు తాము చేస్తున్న కృషి ఫలితంగా ఇప్పటికి 55 వేల మంది కి పైగానే యువతకు ఉపాధి లభించిందని తెలిపారు. రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి పనీ జరగకూడదన్నది బీజేపీ నేతల వ్యూహమని, అందుకే తాము చేపడుతున్న ప్రతి పనికీ అడ్డు పడుతున్నారని సీఎం వ్యాఖ్యానించారు.
లేకుంటే.. ఆర్ ఆర్ ఆర్ కు భూసేకరణ ఇప్పటికే పూర్తయి ఉండేదన్నారు. ఇలాంటి పార్టీకి ఓటేసి.. పట్టభద్రులు తప్పు చేయొద్దని పిలుపునిచ్చారు. మీకు అండగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తొలి ప్రాధాన్యతా ఓటును వేయాలని కోరారు. కాగా.. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 27న జరగనుంది.
This post was last modified on February 24, 2025 8:55 pm
ఆర్కే రోజా పేరు వింటేనే కూటమి పార్టీలు అంతెత్తున ఎగిరి పడుతున్నాయి. వైసీపీ అదికారంలో ఉండగా.. టీడీపీ, జనసేనలపై ఓ…
కంచే గచ్చిబౌలి భూముల విషయంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ పెద్ద ఎత్తున విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా…
పెట్టుబడులను ఆకర్షించే విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నట్లే కనిపిస్తున్నాయి. అయితే ఎక్కడ కూడా ఇరు రాష్ట్రాల మధ్య…
ఏపీ ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వాన్ని చక్కటి సమన్వయంతో ముందుకు నడిపిస్తున్న చంద్రబాబుకు 10 నెలలు పూర్తయ్యాయి. గత ఏడాది జూన్…
వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిలో టీడీపీ…
యాంకర్ గా ఒకవైపు కెరీర్ నడిపించుకుంటూనే అప్పుడప్పుడు సోలో హీరోగా సినిమాలు చేసుకుంటున్న సుడిగాలి సుధీర్ తాజాగా ఒక వివాదంలో…