Political News

మోడీ తెలంగాణ‌కు ఇచ్చింది రెండు ఉద్యోగాలే: రేవంత్

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుపై సీఎంరేవంత్ రెడ్డి ఫైర‌య్యారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న మంచిర్యాల‌లో నిర్వ‌హించిన ఆత్మీయ స‌మ్మేళ‌నంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు. నిజానికి ఇక్క‌డ బీజేపీ అభ్య‌ర్థి బ‌ల‌మైన పోటీ ఇస్తున్నారు. ఈ నేప‌థ్యంలో బీజేపీకి కేంద్రంగా చేసుకుని రేవంత్ విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. రాష్ట్రం ఏర్పడ్డాక‌.. ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రలోని బీజేపీ ప్ర‌భుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింద‌ని ప్ర‌శ్నించారు.

ఇప్ప‌టి వ‌ర‌కు రెండు సార్లు అధికారంలోకి వ‌చ్చిన బీజేపీ.. ఇద్ద‌రికి మాత్ర‌మే ఉద్యోగాలు ఇచ్చింద‌న్నారు. వీటిలో ఒక‌టి కిష‌న్ రెడ్డికి, రెండోది బండి సంజ‌య్‌కు మాత్ర‌మే ద‌క్కింద‌న్నారు. మిగిలిన వారి ప‌రిస్థితి ఏంట‌ని ప్ర‌శ్నించారు. ప‌ట్ట‌భ‌ద్రుల‌ను న‌మ్మించేందుకు బీజేపీ నేత‌లు కుయుక్తులు ప‌న్నుతున్నార‌ని వ్యాఖ్యానించారు. ఒక్క ప‌ది మందికి కూడా ఉద్యోగాలు క‌ల్పించ‌లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. తాము అధికారం లోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. 55 వేల మందికి పైగా ఉద్యోగాలు క‌ల్పించిన‌ట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

ఇలాంటివారు రాష్ట్రంలోని గ్రాడ్యుయేట్ల‌కు ఇంకేం ఉపాధి చూపిస్తార‌ని రేవంత్ రెడ్డి నిల‌దీశారు. రాష్ట్రం లో నిరుద్యోగ యువ‌త‌కు ఉపాధి క‌ల్పించేందుకు తాము చేస్తున్న కృషి ఫ‌లితంగా ఇప్ప‌టికి 55 వేల మంది కి పైగానే యువ‌త‌కు ఉపాధి ల‌భించింద‌ని తెలిపారు. రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి ప‌నీ జ‌ర‌గ‌కూడ‌ద‌న్న‌ది బీజేపీ నేత‌ల వ్యూహ‌మ‌ని, అందుకే తాము చేప‌డుతున్న ప్ర‌తి పనికీ అడ్డు ప‌డుతున్నార‌ని సీఎం వ్యాఖ్యానించారు.

లేకుంటే.. ఆర్ ఆర్ ఆర్ కు భూసేక‌ర‌ణ ఇప్ప‌టికే పూర్త‌యి ఉండేద‌న్నారు. ఇలాంటి పార్టీకి ఓటేసి.. ప‌ట్ట‌భ‌ద్రులు త‌ప్పు చేయొద్ద‌ని పిలుపునిచ్చారు. మీకు అండ‌గా ఉన్న కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తొలి ప్రాధాన్యతా ఓటును వేయాల‌ని కోరారు. కాగా.. తెలంగాణ‌లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోలింగ్ ఈ నెల 27న జ‌ర‌గ‌నుంది.

This post was last modified on February 24, 2025 8:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హహ హాసిని… స్టేజ్ మీద ఏడ్చేసింది

జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…

58 minutes ago

మీ వాళ్లకు చెప్పండి… ఏపీ సీఎంకి తెలంగాణ మంత్రి లేఖ

తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…

2 hours ago

మోదీ స్కిన్ టోన్… అక్కడ తెలుపు.. ఇక్కడ నలుపా?

ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్‌పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…

2 hours ago

టీవీ సౌండ్ హఠాత్తుగా ఆగిపోయిందే

మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…

3 hours ago

ఎన్టీఆర్ నీల్… ఇంకో ఏడాది ఆలస్యంగా

అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…

3 hours ago

కొత్త ‘మహావతారం’పై విమర్శలేల?

గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…

4 hours ago