Political News

మోడీ తెలంగాణ‌కు ఇచ్చింది రెండు ఉద్యోగాలే: రేవంత్

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుపై సీఎంరేవంత్ రెడ్డి ఫైర‌య్యారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న మంచిర్యాల‌లో నిర్వ‌హించిన ఆత్మీయ స‌మ్మేళ‌నంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు. నిజానికి ఇక్క‌డ బీజేపీ అభ్య‌ర్థి బ‌ల‌మైన పోటీ ఇస్తున్నారు. ఈ నేప‌థ్యంలో బీజేపీకి కేంద్రంగా చేసుకుని రేవంత్ విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. రాష్ట్రం ఏర్పడ్డాక‌.. ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రలోని బీజేపీ ప్ర‌భుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింద‌ని ప్ర‌శ్నించారు.

ఇప్ప‌టి వ‌ర‌కు రెండు సార్లు అధికారంలోకి వ‌చ్చిన బీజేపీ.. ఇద్ద‌రికి మాత్ర‌మే ఉద్యోగాలు ఇచ్చింద‌న్నారు. వీటిలో ఒక‌టి కిష‌న్ రెడ్డికి, రెండోది బండి సంజ‌య్‌కు మాత్ర‌మే ద‌క్కింద‌న్నారు. మిగిలిన వారి ప‌రిస్థితి ఏంట‌ని ప్ర‌శ్నించారు. ప‌ట్ట‌భ‌ద్రుల‌ను న‌మ్మించేందుకు బీజేపీ నేత‌లు కుయుక్తులు ప‌న్నుతున్నార‌ని వ్యాఖ్యానించారు. ఒక్క ప‌ది మందికి కూడా ఉద్యోగాలు క‌ల్పించ‌లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. తాము అధికారం లోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. 55 వేల మందికి పైగా ఉద్యోగాలు క‌ల్పించిన‌ట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

ఇలాంటివారు రాష్ట్రంలోని గ్రాడ్యుయేట్ల‌కు ఇంకేం ఉపాధి చూపిస్తార‌ని రేవంత్ రెడ్డి నిల‌దీశారు. రాష్ట్రం లో నిరుద్యోగ యువ‌త‌కు ఉపాధి క‌ల్పించేందుకు తాము చేస్తున్న కృషి ఫ‌లితంగా ఇప్ప‌టికి 55 వేల మంది కి పైగానే యువ‌త‌కు ఉపాధి ల‌భించింద‌ని తెలిపారు. రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి ప‌నీ జ‌ర‌గ‌కూడ‌ద‌న్న‌ది బీజేపీ నేత‌ల వ్యూహ‌మ‌ని, అందుకే తాము చేప‌డుతున్న ప్ర‌తి పనికీ అడ్డు ప‌డుతున్నార‌ని సీఎం వ్యాఖ్యానించారు.

లేకుంటే.. ఆర్ ఆర్ ఆర్ కు భూసేక‌ర‌ణ ఇప్ప‌టికే పూర్త‌యి ఉండేద‌న్నారు. ఇలాంటి పార్టీకి ఓటేసి.. ప‌ట్ట‌భ‌ద్రులు త‌ప్పు చేయొద్ద‌ని పిలుపునిచ్చారు. మీకు అండ‌గా ఉన్న కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తొలి ప్రాధాన్యతా ఓటును వేయాల‌ని కోరారు. కాగా.. తెలంగాణ‌లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోలింగ్ ఈ నెల 27న జ‌ర‌గ‌నుంది.

Satya

Recent Posts

బాక్సాఫీస్‌కు మంచి రోజులొచ్చాయి

2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…

12 minutes ago

థియేట‌ర్లు, షోలు పెంచుకుంటున్న బంగారం

ఈ రోజుల్లో చిన్న‌, మిడ్ రేంజ్ సినిమాల‌కు రిలీజ్రోజు ఇచ్చిన థియేట‌ర్ల‌ను జ‌నంతో నింప‌డ‌మే క‌ష్టమైపోతోంది. జ‌నం థియేట‌ర్ల‌కు రావ‌డం…

44 minutes ago

కూట‌మికి రెండేళ్లు ఓకే… చేయవలసినవి ఇంకా ఉన్నాయి

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం రెండేళ్ల పాల‌న‌ను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్ర‌భుత్వం ఏం చేయాల‌న్నా.. మ‌రో…

3 hours ago

ప్రభాస్ ఫోన్ లో ఆ వాల్ పేపర్ ఎందుకుంది?

ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…

8 hours ago

“మ‌రో వందేళ్ల‌యినా… కాంగ్రెస్ ఇంతే”

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ప‌శ్చిమ‌బెంగాల్‌లో శ‌నివారం సాయంత్రం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న దేశ‌వ్యాప్తంగా అన్న‌దాత‌ల‌కు పీఎం-కిసాన్ నిధుల‌ను…

9 hours ago

‘గొడ్డ‌లి పార్టీ అంత‌కు మించి ఏం చేసింది?’

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. మ‌రోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గ‌త ఐదేళ్ల కాలంలో గొడ్డ‌లి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయ‌డం..…

11 hours ago