Political News

మోడీ తెలంగాణ‌కు ఇచ్చింది రెండు ఉద్యోగాలే: రేవంత్

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుపై సీఎంరేవంత్ రెడ్డి ఫైర‌య్యారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న మంచిర్యాల‌లో నిర్వ‌హించిన ఆత్మీయ స‌మ్మేళ‌నంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు. నిజానికి ఇక్క‌డ బీజేపీ అభ్య‌ర్థి బ‌ల‌మైన పోటీ ఇస్తున్నారు. ఈ నేప‌థ్యంలో బీజేపీకి కేంద్రంగా చేసుకుని రేవంత్ విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. రాష్ట్రం ఏర్పడ్డాక‌.. ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రలోని బీజేపీ ప్ర‌భుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింద‌ని ప్ర‌శ్నించారు.

ఇప్ప‌టి వ‌ర‌కు రెండు సార్లు అధికారంలోకి వ‌చ్చిన బీజేపీ.. ఇద్ద‌రికి మాత్ర‌మే ఉద్యోగాలు ఇచ్చింద‌న్నారు. వీటిలో ఒక‌టి కిష‌న్ రెడ్డికి, రెండోది బండి సంజ‌య్‌కు మాత్ర‌మే ద‌క్కింద‌న్నారు. మిగిలిన వారి ప‌రిస్థితి ఏంట‌ని ప్ర‌శ్నించారు. ప‌ట్ట‌భ‌ద్రుల‌ను న‌మ్మించేందుకు బీజేపీ నేత‌లు కుయుక్తులు ప‌న్నుతున్నార‌ని వ్యాఖ్యానించారు. ఒక్క ప‌ది మందికి కూడా ఉద్యోగాలు క‌ల్పించ‌లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. తాము అధికారం లోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. 55 వేల మందికి పైగా ఉద్యోగాలు క‌ల్పించిన‌ట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

ఇలాంటివారు రాష్ట్రంలోని గ్రాడ్యుయేట్ల‌కు ఇంకేం ఉపాధి చూపిస్తార‌ని రేవంత్ రెడ్డి నిల‌దీశారు. రాష్ట్రం లో నిరుద్యోగ యువ‌త‌కు ఉపాధి క‌ల్పించేందుకు తాము చేస్తున్న కృషి ఫ‌లితంగా ఇప్ప‌టికి 55 వేల మంది కి పైగానే యువ‌త‌కు ఉపాధి ల‌భించింద‌ని తెలిపారు. రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి ప‌నీ జ‌ర‌గ‌కూడ‌ద‌న్న‌ది బీజేపీ నేత‌ల వ్యూహ‌మ‌ని, అందుకే తాము చేప‌డుతున్న ప్ర‌తి పనికీ అడ్డు ప‌డుతున్నార‌ని సీఎం వ్యాఖ్యానించారు.

లేకుంటే.. ఆర్ ఆర్ ఆర్ కు భూసేక‌ర‌ణ ఇప్ప‌టికే పూర్త‌యి ఉండేద‌న్నారు. ఇలాంటి పార్టీకి ఓటేసి.. ప‌ట్ట‌భ‌ద్రులు త‌ప్పు చేయొద్ద‌ని పిలుపునిచ్చారు. మీకు అండ‌గా ఉన్న కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తొలి ప్రాధాన్యతా ఓటును వేయాల‌ని కోరారు. కాగా.. తెలంగాణ‌లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోలింగ్ ఈ నెల 27న జ‌ర‌గ‌నుంది.

This post was last modified on February 24, 2025 8:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

2 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

3 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

3 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

3 hours ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

4 hours ago

అంబటి రాంబాబు కాపు టైగర్ – జగన్

అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్‌లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్‌సీపీ…

5 hours ago