కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుపై సీఎంరేవంత్ రెడ్డి ఫైరయ్యారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మంచిర్యాలలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నిజానికి ఇక్కడ బీజేపీ అభ్యర్థి బలమైన పోటీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీకి కేంద్రంగా చేసుకుని రేవంత్ విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్రం ఏర్పడ్డాక.. ఇప్పటి వరకు కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని ప్రశ్నించారు.
ఇప్పటి వరకు రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఇద్దరికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. వీటిలో ఒకటి కిషన్ రెడ్డికి, రెండోది బండి సంజయ్కు మాత్రమే దక్కిందన్నారు. మిగిలిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పట్టభద్రులను నమ్మించేందుకు బీజేపీ నేతలు కుయుక్తులు పన్నుతున్నారని వ్యాఖ్యానించారు. ఒక్క పది మందికి కూడా ఉద్యోగాలు కల్పించలేదని దుయ్యబట్టారు. తాము అధికారం లోకి వచ్చిన తర్వాత.. 55 వేల మందికి పైగా ఉద్యోగాలు కల్పించినట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
ఇలాంటివారు రాష్ట్రంలోని గ్రాడ్యుయేట్లకు ఇంకేం ఉపాధి చూపిస్తారని రేవంత్ రెడ్డి నిలదీశారు. రాష్ట్రం లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు తాము చేస్తున్న కృషి ఫలితంగా ఇప్పటికి 55 వేల మంది కి పైగానే యువతకు ఉపాధి లభించిందని తెలిపారు. రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి పనీ జరగకూడదన్నది బీజేపీ నేతల వ్యూహమని, అందుకే తాము చేపడుతున్న ప్రతి పనికీ అడ్డు పడుతున్నారని సీఎం వ్యాఖ్యానించారు.
లేకుంటే.. ఆర్ ఆర్ ఆర్ కు భూసేకరణ ఇప్పటికే పూర్తయి ఉండేదన్నారు. ఇలాంటి పార్టీకి ఓటేసి.. పట్టభద్రులు తప్పు చేయొద్దని పిలుపునిచ్చారు. మీకు అండగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తొలి ప్రాధాన్యతా ఓటును వేయాలని కోరారు. కాగా.. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 27న జరగనుంది.
This post was last modified on February 24, 2025 8:55 pm
గత ఏడాది ప్రతిష్ఠాత్మకంగా గద్దర్ అవార్డులను మొదలుపెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. ఒకేసారి చాలా ఏళ్లకు కలిపి అవార్డులు ప్రకటించిన సంగతి…
దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…