Political News

‘ఫైబర్ నెట్’ జీవీ రెడ్డి జంట రాజీనామాలు!

అధికార కూటమిలోని కీలక భాగస్వామి టీడీపీకి ఇది ఊహించని పరిణామమేనని చెప్పాలి. ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన జీవీ రెడ్డి సోమవారం తన పదవులకు రాజీనామా చేశారు. ఫైబర్ నెట్ చైర్మన్ పదవితో పాటుగా టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేయడం గమనార్హం. ఫైబర్ నెట్ లో వరుసగా చోటుచేసుకున్న పరిణామాలే జీవీ రెడ్డి రాజీనామాకు దారి తీసినట్లుగా సమాచారం. టీడీపీకి రాజీనామా చేసిన ఆయన తాను న్యాయవాద వృత్తిలోనే కొనసాగుతానని, ఇంకో పార్టీలో చేరబోనని కూడా ప్రకటించారు.

ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన జీవీ రెడ్డి… న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. క్రిమినల్ లాలో మంచి పట్టు సాధించిన రెడ్డి…ఆర్థిక పరమైన నేరాల విశ్లేషణ, వాదనల్లో దిట్టగా పేరు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే యుక్త వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన జీవీ రెడ్డి.. టీడీపీ విపక్షంలో ఉండగా పార్టీ తరఫున బలమైన గొంతుకగా మారారు. జీవీ రెడ్డి కారణంగానే ప్రతి వారం రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకు ద్వారా అప్పులు తీసుకుంటున్న వ్యవహారం జనాల్లోకి చొచ్చుకెళ్లింది. నాటి వైసీపీ సర్కారు… ఏఏ వారం…ఎంతెంత అప్పులు తీసుకుటోంది… దానికి ఎంతెంత వడ్డీలు చెల్లిస్తోంది అన్న వివరాలను ఆధారాలతో సహా ముందుగానే బయటపెట్టి సంచలనం రేపారు.

రాజకీయాల్లో చురుగ్గా ఉన్న జీవీ రెడ్డి సత్తాను గుర్తించిన టీడీపీ అధిష్ఠానం…ఆయనను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. అంతేకాకుండా కూటమి సర్కారు పాలన మొదలు అయిన నెలల వ్యవధిలోనే కీలక విభాగంగా ఉన్న ఫైబర్ నెట్ కార్పొరేషన్ పదవిని కట్టబెట్టింది. పార్టీ జాతీయ ప్రదాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ బృందంలో కీలక సభ్యుడిగా మారిన రెడ్డి… చంద్రబాబు దృష్టిలోనూ సత్తా కలిగిన నేతగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ క్రమంలో భవిష్యత్తులో రెడ్డి… టీడీపీలో ఉన్నత స్థాయికి ఎదుగుతారన్న వాదనలూ వినిపించాయి.

అయితే ఫైబర్ నెట్ కార్పొరేషన్ లో జరుగుతున్న అక్రమాలను చూసి జీవీ రెడ్డి సహించలేకపోయారన్న వాదనలు వినిపించాయి. వచ్చీ రావడంతోనే రాజకీయ నియామకాలకు ఫైబర్ నెట్ కేంద్రంగా మారిందని పక్కా ఆధారాలను బయటపెట్టిన రెడ్డి… ఒకే ఉత్తర్వుతో 400 మందికి పైగా ఉద్యోగులను తొలగించారు. వీరంతా వైసీపీకి అనుకూలంగా ఉన్న వారని, వారిలో కొందరు వైసీపీ నేతల ఇళ్లల్లో పనిచేసే వారని కూడా జీవీ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారం కార్పొరేషన్ లో చిలికిచిలికి గాలివానలా మారింది. రెడ్డి తొలగించిన ఉద్యోగులకు సంస్థ ఎండీగా ఉన్న దినేశ్ కుమార్ వేతనాలు చెల్లించిన వైనం వివాదానికి మరింత ఆజ్యం పోసింది. చైర్మన్ గా తాను తొలగించిన ఉద్యోగులకు ఇంకా వేతనాలు ఎలా చెల్లిస్తారంటూ రెడ్డి… ఎండీ, ఇతర ఉన్నతాధికారులపై ఒంటికాలిపై లేచారు.

ఇలాగైతే కుదరదని భావించిన రెడ్డి… ఇటీవలే మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎండీ దినేశ్ కుమార్ తో పాటు సంస్థ ఉన్నత అధికారుల తీరును ఎండగట్టారు. ఈ సందర్భంగా ఆయన ఐఏఎస్ అదికారి అయిన దినేశ్ కుమార్ రాజ ద్రోహానికి పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు ఐఏఎస్ లను ఆగ్రహానికి గురి చేశాయి. దీంతో ఐఏఎస్ లు అంతా కలిసి రెడ్డిపై చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే తొలుత మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఈ వ్యవహారంపై సమీక్ష నిర్వహించి చంద్రబాబుకు నివేదిక అందించారు. ఆ తర్వాత జీవీ రెడ్డిని చంద్రబాబు పిలిపించుకుని మాట్లాడారు. సర్దుకునిపోవాలని.. వ్యవస్థ అన్నాక ఒకే రోజులో మార్పు సాధ్యం కాదని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇక తాను ఈ వ్యవస్థలో ఇమడలేనని అనుకున్నారో, ఏమో తెలియదు గానీ.. ఫైబర్ నెట్ తో పాటు టీడీపీకి కూడా రాజీనామా చేశారు. ఈ వ్యవహారంపై ఇప్పుడు టీడీపీలో పెద్ద చర్చే నడుస్తోంది.

This post was last modified on February 24, 2025 8:51 pm

Share

Recent Posts

దొంగతనం చేసిన ఇంట్లోనే నిద్రపోయిన దొంగ!

ఓ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చిన దొంగ ఆ ఇంట్లో వస్తువులు దొంగిలించడం…ఆకలేయడంతో ఆ ఇంట్లోనే తినేసి నిద్రలోకి జారుకోవడం…తీరా…

48 minutes ago

పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎంపై హత్యాయత్నం… పొత్తే కారణమా?

పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై హత్యాయత్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం…

1 hour ago

ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మద్దతు

రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హల్ద్వానిలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన ర్యాలీ ప్రదేశాన్ని శ్రీరామ్…

4 hours ago

అతిగా ఫోన్ వాడిన షకీలా ఇప్పుడు ఎలా ఉందంటే…

ఒకప్పుడు షకీలాకు సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. వరుస సినిమాలు, భారీ గుర్తింపు, తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌తో…

4 hours ago

ఫ్యాన్స్ వద్దా జాన్వీ మేడమ్?

ఏఐ రంగప్రవేశం తర్వాత తమ ఫొటోలు, వీడియోలను ఇష్టానుసారం వాడేస్తున్న నేపథ్యంలో పర్సనాలిటీ రైట్స్ కోసం ఫిలిం సెలబ్రెటీలను న్యాయస్థానాలను…

4 hours ago

అమరావతికి మహర్దశ… బాబు ప్రయత్నం ఫలిస్తుంది!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో కీల‌క ప్రాధ‌మిక ప్రాజెక్టులుగా భావిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జిల‌ను సీఎం చంద్ర‌బాబు తాజాగా…

4 hours ago