Political News

వల్లభనేని వంశీకి 3 రోజుల పోలీసు కస్టడీ

గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయవాడ జైల్లో రిమాండ్ లో ఉన్న వంశీ రిమాండ్ రేపటితో ముగియనుంది. అయితే, ఈ కేసులో విచారణ కోసం వంశీని 10 రోజుల కస్టడీ కోరారు పోలీసులు. ఈ క్రమంలోనే తాజాగా వంశీకి విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు షాకిచ్చింది. వంశీని 3 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ కోర్టు కీలక తీర్పునిచ్చింది.

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరపాలని ఆదేశించింది. విజయవాడ లిమిట్స్‌లోనే కస్టడీలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. అంతేకాదు, లాయర్ సమక్షంలోనే విచారణ జరపాలని ఆదేశించింది. ఇక, వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్న కారణంతో జైల్లో వంశీకి బెడ్ అనుమతించింది న్యాయస్థానం. రోజుకు మూడు సార్లు వంశీతో ఆయన లాయర్ కలిసి మాట్లాడేందుకు అనుమతినిచ్చింది.

మరోవైపు, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి మరిన్ని చిక్కులు తప్పేలా లేవు. వంశీపై సీఐడీ అధికారులు పీటీ వారెంట్ జారీ చేశారు. ఇందుకు సంబంధించి రేపు వంశీని కోర్టులో హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలోనే వంశీపై తదుపరి చర్యలకు సీఐడీ రంగం సిద్ధం చేస్తోంది. పీటీ వారెంట్ ప్రకారం సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో అరెస్టయిన వంశీని…టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కూడా విచారణ జరపొచ్చు.

This post was last modified on February 24, 2025 3:59 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

2 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

7 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

9 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

9 hours ago