Political News

ఇక రాను.. తేల్చిచెప్పేసిన జగన్

ఏపీ అసెంబ్లీలో అధికార కూటమి ప్రచారం చేస్తున్నట్లుగా విపక్షం వైసీపీ సింగిల్ డే షోకే పరిమితం అయిపోయింది. సభలో తాము అడిగినట్టుగా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని ఆరోపించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇకపై అసెంబ్లీ సమావేశాలకు హాజరు కారాదని నిర్ణయించారు. సోమవారం ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా… ఈ సమావేశాలకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి హాజరైన జగన్.. గవర్నర్ తన ప్రసంగంలో గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని వ్యాఖ్యానించినంతనే సభ నుంచి వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నేరుగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన జగన్… అక్కడే పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే ఇకపై అసెంబ్లీ సమావేశాలకు హాజరు కారాదని జగన్ నిర్ణయించారు.

ఈ సమావేశంలో జగన్ సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా సమాచారం. తాను ఇంకో 30 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉంటానని జగన్ అన్నారు. తనతో పాటు నడిచే వారే తన వారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. సభలో వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చే ఆలోచనలో కూటమి సర్కారు లేదని ఆయన తెలిపారు. సభలో వైసీపీకి ఆ హోదా ఇవ్వకపోతే… ప్రజా క్షేత్రంలోకి వెళ్లి తేల్చుకుందామని ఆయన అన్నారు. ఈ కారణంగానే ఇకపై వైసీపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కారాదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రతిపక్ష హోదా లేకపోతేనేం.. ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేద్దామని ఆయన పార్టీ నేతలతో అన్నారు. 2028 ఫిబ్రవరిలోనే జమిలి ఎన్నికలు వస్తాయని అంటున్నారని చెప్పిన జగన్… అప్పటిదాకా ప్రజా క్షేత్రంలోనే పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.

జగన్ నుంచి ఈ వ్యాఖ్యలు వినిపించినంతనే.. అధికార పార్టీ వైసీపీ తీరు, జగన్ తీరుపై చేసిన వ్యాఖ్యలు గుర్తుకు వస్తున్నాయి. అనర్హత వేటు తప్పించుకునేందుకే జగన్ తన ఎమ్మెల్యేలతో కలిసి సోమవారం సభకు వచ్చారని మంత్రి అచ్చెన్నాయుడితో పాటుగా టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి వ్యాఖ్యలు నిజమేనన్నట్లుగా ఇకపై అసెంబ్లీకి వెళ్లరాదంటూ జగన్ నిర్ణయం తీసుకున్నారన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. మరోవైపు అనర్హత వేటు తప్పించుకునేందుకు జగన్ సోమవారం ఒక్క రోజు అసెంబ్లీకి వస్తారంటూ టీడీపీ అనుకూల మీడియాలో పలు కథనాలు కూడా వచ్చాయి. ఆ కథనాలన్నీ నిజమేనని తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయం చెప్పేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీకి వెళ్లి ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తారని ప్రజలు భావిస్తే… వారి ఆశలపై జగన్ నీళ్లు చల్లేశారన్న కోణంలో ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.

This post was last modified on February 24, 2025 3:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

24 minutes ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

4 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

5 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

5 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

5 hours ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

6 hours ago