Political News

వైసీపీ వినుకొండలో బయటకు వెళ్లేదెవరు…?

ఏపీలో మొన్నటిదాకా అధికార పార్టీగా కొనసాగి… ఇప్పుడు కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైసీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఓ వైపు ఓటమి నుంచి పార్టీ అధిష్ఠానం తేరుకోకముందే… కీలక నేతలు వరుసబెట్టి బయటకు వెళ్లిపోయారు. ఇక పార్టీని అంటిపెట్టుకుని సాగుతున్న నేతలను ద్వితీయ శ్రేణి నేతలు మెడబట్టి గెంటేసే యత్నాలు జరుగుతున్నాయి. వాస్తవానికి నేతలంతా బయటకు క్యూ కడుతున్న వేళ… పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నేతలు ఆయా పార్టీల అధినాయకత్వానికి అత్యంత ప్రాధాన్యం కలిగిన నేతలుగా మారిపోతారు. అలాంటి వారిని బయటకు గెంటేస్తారా?.. లేదంటే తామే బయటకు వెళ్లాలా? అంటూ ద్వితీయ శ్రేణి నేతలు వార్నింగులు ఇస్తుంటే.. ఏం చేయాలో పాలుపోని స్థితిలో అదిష్ఠానం పడిపోయింది.

ఈ తరహా పరిస్థితి ఒక్క వైసీపీకే కాకుండా ఏ పార్టీకి అయినా ఇబ్బందికరమైనదే. అదేదో సామెత చెప్పినట్టుగా… విడవమంటే పాముకు కోపం… కరవమంటే కప్పకు కోపం అన్న చందంగా వైసీపీ పరిస్థితి మారిపోయింది. ఈ తరహా పరిస్థితి ప్రస్తుతం వైసీపీకి మంచి పట్టున్న పల్నాడు జిల్లాలోని వినుకొండలో తలెత్తింది. వినుకొండలో పార్టీ ఓ రేంజిలో బలంగా ఉంది. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగిరింది. జీవీ ఆంజనేయులు ప్రాబల్యానికి చెక్ పెట్టేసిన బొల్లా బ్రహ్మనాయుడు వైసీపీకి విక్టరీని అందించారు. బొల్లా సేవలతో పాటుగా జగన్ జన సునామీ కూడా ఈ విజయానికి కారణంగా నిలిచాయని చెప్పాలి. ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా సాగిన బొల్లా… వినుకొండలో వైసీపీ బలాన్ని ఓ రేంజిలో పెంచారు. అయితే మొన్నటి ఎన్నికల్లో జీవీ రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగి బొల్లాను మట్టి కరిపించి… వినుకొండను తిరిగి టీడీపీ ఖాతాలో వేసేశారు. ఓటమిపాలైనా బొల్లా మాత్రం పార్టీని అంటిపెట్టుకుని జగన్ గుడ్ లుక్స్ లో పడిపోయారు.

ఇక్కడిదాక బాగానే ఉన్నా… ఇప్పుడు వైసీపీలో ఓ వర్గం బొల్లా నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బొల్లాను పార్టీ నుంచి సస్పెండ్ చేయించే దిశగా ఆ వర్గం తనదైన దూకుడుతో సాగుతోంది. ఇప్పటికే పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన ఆ వర్గం బొల్లాపై ఫిర్యాదు చేసింది. వైసీపీ అధికారంలో ఉండగా… సొంత పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న బొల్లా తమపై అక్రమంగా కేసులు పెట్టించారని ఆ వర్గం ఆరోపిస్తోంది. ఇదే విషయాన్ని సజ్జల ముందు పెట్టిన ఆ వర్గం నేతలు.. తక్షణమే బొల్లాను పార్టీ నుంచి సాగనంపాలని దాదాపుగా అల్టిమేటం జారీ చేసింది. అలా జరక్కపోతే… తామే పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపిందట. సజ్జల నుంచి ఎలాంటి స్పందన వచ్చిందో తెలియదు గానీ… ఆదివారం తాడేపల్లి వచ్చిన సదరు వర్గం జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి వద్ద కూడా పంచాయతీ పెట్టిందట. సదరు వర్గాన్ని ఒకింత శాంతపరచిన వైవీ… త్వరలోనే జగన్ దీనిపై దృష్టి సారిస్తారని, అప్పటిదాకా ఓపిక పట్టాలని చెప్పి వారిని పంపించారట. అంటే ప్రస్తుతానికి ఈ విషయం కొంతకాలం ఆగినా…ఎప్పుడో ఒకసారి బ్లాస్ట్ కాక తప్పదన్న మాట వినిపిస్తోంది.

This post was last modified on February 24, 2025 10:42 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సీనియర్ స్టార్ల సంక్రాంతి… క్లాష్ సాధ్యమేనా

పెళ్లి లేదు ప్రెగ్నెంటూ లేదు, కొడుకు పేరు కృష్ణమనోహర్ అనేది కొత్త సామెత. కొన్ని రిలీజ్ డేట్ల వ్యవహారం చూస్తుంటే…

59 minutes ago

ఫ‌లించిన ప‌వ‌న్ ప్ర‌య‌త్నం.. బ‌డ్జెట్‌లో `కొబ్బ‌రి`కి కీల‌క స్థానం

ఏపీలోని కోన‌సీమ ప్రాంతంలో కొబ్బ‌రి సాగు ఎక్కువ‌. దేశంలో కేర‌ళ త‌ర్వాత‌.. కోన‌సీమ‌లో భారీ ఎత్తున కొబ్బ‌రి సాగు చేస్తున్నారు.…

2 hours ago

వరప్రసాద్ గారు కాస్త ఊపిరినిచ్చారు

సంక్రాంతి సినిమాల్లో బ్లాక్ బస్టర్ రన్ తో రికార్డులు సృష్టించిన మన శంకరవరప్రసాద్ గారు తర్వాత బాగా స్లో అయిపోయింది.…

2 hours ago

మూడోసారి దొరికిపోయిన మర్దాని

ఏదైనా సూపర్ హిట్ ఫ్రాంచైజ్ కి కొనసాగింపు చేయడం అంత సులభం కాదు. దాని మీద అంచనాలు అందుకునేలా దర్శక…

2 hours ago

శాంతి కోసం చాలా కష్టపడ్డారు కానీ

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి మొన్న శుక్రవారం విడుదలయ్యింది. ప్రమోషన్లు బాగానే…

4 hours ago

పాక్ నక్క బుద్ధి… నష్టం తట్టుకోలేరు

టీ20 వరల్డ్ కప్ 2026 విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఒక వింత నిర్ణయం తీసుకుంది. టోర్నీలో పాల్గొనేందుకు అనుమతినిస్తూనే, ఫిబ్రవరి…

4 hours ago