Political News

వీడియో : అసెంబ్లీకి ఇలా వచ్చి అలా వెళ్లిన జగన్

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కావడం విశేషం. అసెంబ్లీకి మాజీ సీఎం జగన్ కూడా హాజరయ్యారు. అయితే, సభలో వైసీపీ సభ్యులు గందరగోళం సృష్టిస్తున్నారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేస్తున్నారు. గవర్నర్ ప్రసంగానికి వైసీపీ సభ్యులు పదేపదే అడ్డుపడుతున్నారు. తమను ప్రతిపక్షంగా గుర్తించాలంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేస్తున్నారు. ప్రజల గొంతుక వినిపించాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైసీపీ సభ్యులు నినాదాలు చేస్తున్నారు. ఆ తర్వాత శాసన సభ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగం పూర్తి కాకుండానే బహిష్కరించి జగన్ తో పాటు వైసీసీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయడంపై విమర్శలు వస్తున్నాయి.

ప్రజా సమస్యలపై చర్చించేందుకు సభకు జగన్ వస్తున్నారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రజా సమస్యల సంగతి పక్కనబెడితే కనీసం రాష్ట్ర గవర్నర్ ప్రసంగం వినే ఓపిక, సహనం వైసీపీ సభ్యులకు లేవని విమర్శలు వస్తున్నాయి. ఇటువంటి నేతలు రేపు బడ్జెట్ సమావేశాలకు మాత్రం హాజరవుతారా..లేదంటే సస్పెన్షన్ వేటు తప్పించుకోవడం కోసం ఈ రోజు మాదిరి హాజరు వేసి వెళతారా అన్నది తేలాల్సి ఉంది. ఇక, ఈ ఒక్క రోజు హాజరు పడింది కాబట్టి మరో 60 రోజుల పాటు జగన్ అండ్ కో కు అసెంబ్లీ నుంచి డుమ్మా కొట్టే చాన్స్ వచ్చిందని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. అసెంబ్లీకి ఇలా వచ్చి అలా వెళ్లిన జగన్ అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

Kumar

Recent Posts

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

2 minutes ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

6 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

6 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

6 hours ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

6 hours ago

టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…

8 hours ago