ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కావడం విశేషం. అసెంబ్లీకి మాజీ సీఎం జగన్ కూడా హాజరయ్యారు. అయితే, సభలో వైసీపీ సభ్యులు గందరగోళం సృష్టిస్తున్నారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేస్తున్నారు. గవర్నర్ ప్రసంగానికి వైసీపీ సభ్యులు పదేపదే అడ్డుపడుతున్నారు. తమను ప్రతిపక్షంగా గుర్తించాలంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేస్తున్నారు. ప్రజల గొంతుక వినిపించాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైసీపీ సభ్యులు నినాదాలు చేస్తున్నారు. ఆ తర్వాత శాసన సభ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగం పూర్తి కాకుండానే బహిష్కరించి జగన్ తో పాటు వైసీసీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయడంపై విమర్శలు వస్తున్నాయి.
ప్రజా సమస్యలపై చర్చించేందుకు సభకు జగన్ వస్తున్నారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రజా సమస్యల సంగతి పక్కనబెడితే కనీసం రాష్ట్ర గవర్నర్ ప్రసంగం వినే ఓపిక, సహనం వైసీపీ సభ్యులకు లేవని విమర్శలు వస్తున్నాయి. ఇటువంటి నేతలు రేపు బడ్జెట్ సమావేశాలకు మాత్రం హాజరవుతారా..లేదంటే సస్పెన్షన్ వేటు తప్పించుకోవడం కోసం ఈ రోజు మాదిరి హాజరు వేసి వెళతారా అన్నది తేలాల్సి ఉంది. ఇక, ఈ ఒక్క రోజు హాజరు పడింది కాబట్టి మరో 60 రోజుల పాటు జగన్ అండ్ కో కు అసెంబ్లీ నుంచి డుమ్మా కొట్టే చాన్స్ వచ్చిందని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. అసెంబ్లీకి ఇలా వచ్చి అలా వెళ్లిన జగన్ అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
ఐపీఎల్ అంటేనే చివరి బంతి వరకు ఉండే ఉత్కంఠ. కానీ ఈసారి ఆ మజా పూర్తిగా తగ్గిపోయింది. పరుగుల వరద…
నిజామాబాద్లో నటరాజ్ అనే ఒక సింగిల్ స్క్రీన్. దాని లీజ్ మార్పు గొడవ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ ఎస్వీసీ…
ఏపీ అధికార పార్టీ జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. సంచలన ప్రకటన చేశారు. పార్టీలో యువతరాన్ని ఆకర్షించేందుకు..…
పాలన విషయంలో మంత్రి లోకేష్ పక్కా ప్లానింగ్తో వ్యవహరిస్తున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. రాజకీయాలను విధానపరమైన అంశాలను కలగాపులగం…
పద్దెనిమిదేళ్ల అవమానాలు, ఎగతాళి మాటలకు బెంగళూరు జట్టు శాశ్వతంగా ముగింపు పలికింది. ఐపీఎల్ చరిత్రలో ట్రోల్స్ కు కేరాఫ్ అడ్రస్…
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఇప్పటికే పాలక మండలి కూడా రద్దయింది. ప్రత్యేక అధికారి పాలనలోకి…