ఇప్పుడు నేషనల్ మీడియాలో ఓ అంశంపై పెద్ద రచ్చ నడుస్తోంది. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఎయిర్ ఇండియా తన విమానంలో విరిగిన కుర్చీని కేటాయించిందట. ఇప్పుడైతే కేంద్ర మంత్రి గానీ… గతంలో చౌహాన్ చాలా కాలం పాటు మధ్య ప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మిస్టర్ క్లీన్ నేతగా అందరి మన్ననలు అందుకున్న చౌహాన్.. ఎయిర్ ఇండియా తనకు విరిగిన… లేదంటే చిరిగిన సీటు ఇచ్చినంతనే తీత్ర ఆగ్రహానికి గురయ్యారు. ఇదేం పద్దతి… విరిగిన సీటు ఇవ్వడం అంటే వినియోగదారులను మోసం చేయడమే కదా అంటూ ఆయన ఎయిర్ ఇండియా సిబ్బందితో వాగ్వాదానికి దిగారట. అంతటితో ఆగని ఆయన ఎయిర్ ఇండియా విమానంలో తనకు జరిగిన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో వివరించారు.
మధ్యప్రదేశ్ వేదికగా రాజకీయం చేసిన చౌహాన్… రాష్ట్ర స్థాయి రాజకీయాలను దాటేసి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కేబినెట్ లో కీలకమైన వ్యవసాయ శాఖ పగ్గాలను దక్కించుకున్న చౌహాన్ తన పనేదో తాను చేసుకుంటూ పోతున్నారు. విధి నిర్వహణలో ఎంతమాత్రం అలసత్వం చూపని చౌహాన్.. అత్యవసరమైన నిర్ణయాలు తీసుకోవడంలో చాలా వేగంగా కదులుతారని చెప్పాలి. సమస్యల తీవ్రతను ఇట్టే గుర్తించగలిగే సామర్థ్యం ఉన్న చౌహాన్… మొన్న ఏపీ మిర్చి రైతుల సమస్యను పట్టుకుని సీఎం చంద్రబాబు ఢిల్లీలోని తన కార్యాలయానికి వస్తే.. తాను అందుబాటులో లేకున్నా… అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేయించి తాను కూడా వర్చువల్ గా పాల్గొన్నారు. ఆ తర్వాతి రోజు నేరుగా ఏపీకి చెందిన కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని పిలిపించుకుని మరీ సమస్య పరిష్కారాన్ని గంటల వ్యవధిలో తేల్చేసిన సంగతి తెలిసిందే.
అంతటి పనిమంతుడైన చౌహాన్.. విమానంలో చిరిగిన సీటు ఇచ్చారంటూ ఓ లెంగ్తీ పోస్టు పెట్టడం… విరిగిన సీటు ఇవ్వడం అంటే మోసగించడమే కదా అని వ్యాఖ్యలు చేయడం.. దానిపై నేషనల్ మీడియాలో ప్రత్యేక కథనాలు ప్రసారం కావడం నిజంగానే ఆశ్చర్యం వేస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఈ వ్యవహారంపై ఓ రేంజిలో రచ్చ సాగుతోంది. ఇటీవలే టాటాల నేతృత్వంలోకి వచ్చిన ఎయిర్ ఇండియాలో ఇలాంటి వింత అనుభవాలు సర్వసాధారణమేనని ఒకరు అంటే… అబ్బే అదేమీ లేదు.. ఇతర విమాానాల కంటే ఎయిర్ ఇండియాలో సేవలు బాగానే ఉంటాయంటూ మరొకరు వ్యాఖ్యానిస్తున్నారు. వెరసి చౌహాన్ తనకు ఎదురైన అనుభవంపై పెద్ద చర్చకే తెర లేపారని చెప్పాలి.
This post was last modified on February 22, 2025 4:52 pm
తెలంగాణ సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ అమలు చేసే విషయం గురించి గత కొద్దిరోజులుగా టాలీవుడ్ లో తీవ్ర వాగ్వాదాలు, ప్రెస్…
హైదరాబాద్ మూసాపేట్ శ్రీరాములు థియేటర్ చాలా పాతది. అందులో మూవీ లవర్స్ కి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ మధ్య…
నిజమేనండోయ్,… ఏపీ అంటే ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే కాదు. అడ్వాన్స్ డ్ ప్రదేశ్ కూడా. ఎందుకో తెలుసా? భవిష్యత్తును కాస్తంత…
తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది. 2023లో జరిగిన మూడో ఎన్నికలో ఆ…
తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాజకీయ తెరంగేట్రం ఆదిలోనే కష్టనష్టాలను చవిచూసింది. ఎన్నికలకు కాస్తంత ముందుగా కరూర్ లో…
ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…