రాష్ట్ర రాజధాని అమరావతి మాట గత ఏడాది డిసెంబరు వరకు రోజూ మీడియాలో వినిపించింది.. కనిపించింది. డిసెంబరు మూడో వారంలో పనులు ప్రారంభిస్తున్నారని.. పనులు వడివడిగా ముందుకు సాగి 2027-28 నాటికి రాజధానికి ఒక రూపం తీసుకువస్తామని మంత్రి పొంగూరు నారాయణ పదే పదే చెప్పారు. ఇక, జనవరి తొలి వారంలో కూడా ఇదే ప్రకటన చేశారు. మరోవైపు సీఆర్ డీఏ కూడా.. పనులకు సంబంధించి కాంట్రాక్టు సంస్థలను ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించింది.
అంతేకాదు.. రోజువారీగా టెండర్లను ఆహ్వానించి.. పనులు శర వేగంగా చేపడుతున్నామని సీఆర్ డీఏ అధికారులు కూడా చెప్పారు. కానీ.. గత 50 రోజులుగా అమరావతి ప్రస్థావన ఎక్కడా కనిపించడం లేదు. ఇదే విషయంపై చంద్రబాబు తాజాగా ఆరా తీశారు. అసలు ఏం జరుగుతోందన్న ప్రశ్నతో సంబంధిత అధికారులను ఆయన ప్రశ్నించారు. అమరావతి పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయాలని మరోసారి కూడా దిశానిర్దేశం చేసినట్టు సీఎంవో వర్గాలు చెబుతున్నాయి.
అయితే.. రెండు రకాల సమస్యలు ఇప్పుడు అమరావతిని వేధిస్తున్నాయి. 1) 30 అడుగుల్లోనే జలాలు ఊరడం. 2) కాంట్రాక్టు సంస్థలు బిడ్లను వెనక్కి తీసుకోవడం. ప్రస్తుతం అమరావతిలో పనులు ప్రారంభించేందుకు ముందుకు వచ్చిన సమస్యలు.. సాధారణంగా.. నేలను పరీక్షించాయి. దీనిలో పెద్ద సమస్య వారిని వెంటాడుతోంది. కేవలం 30 అడుగుల లోతులోనే.. భారీ ఎత్తున జలాలు ఊరుతున్నాయి. దీంతో నిర్మాణాలు చేపట్టడం సాధ్యం కాదని కొన్ని సంస్థలు భావిస్తున్నాయి.
మరోవైపు.. పెద్దగా పోటీ ఉంటుందని అమరావతి నిర్మాణాలను చేపట్టేందుకు సంస్థలు ముందుకు వస్తాయని సర్కారు భావించినా.. నిర్మాణ వ్యయాలను పెంచినా.. బిడ్డర్లు ఆశించిన స్థాయిలో ముందుకు రాలేదు. పైగా.. వచ్చిన వారు కూడా ఇక్కడ జలాలు ఊరుతుండడంతో తమ బిడ్లను వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో అమరావతి పనులు కుంటుతున్నాయి. కనీసం ప్రధాన నిర్మాణ పనులకు కూడా బిడ్లు పడడం లేదని సీఆర్ డీఏ అధికారులు చెబుతున్నారు. దీంతో మే వరకు ఇలాంటి పరిస్థితి ఉంటుందని ప్రాధమికంగా అంచనాకు వచ్చేశారు.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…