రాష్ట్ర రాజధాని అమరావతి మాట గత ఏడాది డిసెంబరు వరకు రోజూ మీడియాలో వినిపించింది.. కనిపించింది. డిసెంబరు మూడో వారంలో పనులు ప్రారంభిస్తున్నారని.. పనులు వడివడిగా ముందుకు సాగి 2027-28 నాటికి రాజధానికి ఒక రూపం తీసుకువస్తామని మంత్రి పొంగూరు నారాయణ పదే పదే చెప్పారు. ఇక, జనవరి తొలి వారంలో కూడా ఇదే ప్రకటన చేశారు. మరోవైపు సీఆర్ డీఏ కూడా.. పనులకు సంబంధించి కాంట్రాక్టు సంస్థలను ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించింది.
అంతేకాదు.. రోజువారీగా టెండర్లను ఆహ్వానించి.. పనులు శర వేగంగా చేపడుతున్నామని సీఆర్ డీఏ అధికారులు కూడా చెప్పారు. కానీ.. గత 50 రోజులుగా అమరావతి ప్రస్థావన ఎక్కడా కనిపించడం లేదు. ఇదే విషయంపై చంద్రబాబు తాజాగా ఆరా తీశారు. అసలు ఏం జరుగుతోందన్న ప్రశ్నతో సంబంధిత అధికారులను ఆయన ప్రశ్నించారు. అమరావతి పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయాలని మరోసారి కూడా దిశానిర్దేశం చేసినట్టు సీఎంవో వర్గాలు చెబుతున్నాయి.
అయితే.. రెండు రకాల సమస్యలు ఇప్పుడు అమరావతిని వేధిస్తున్నాయి. 1) 30 అడుగుల్లోనే జలాలు ఊరడం. 2) కాంట్రాక్టు సంస్థలు బిడ్లను వెనక్కి తీసుకోవడం. ప్రస్తుతం అమరావతిలో పనులు ప్రారంభించేందుకు ముందుకు వచ్చిన సమస్యలు.. సాధారణంగా.. నేలను పరీక్షించాయి. దీనిలో పెద్ద సమస్య వారిని వెంటాడుతోంది. కేవలం 30 అడుగుల లోతులోనే.. భారీ ఎత్తున జలాలు ఊరుతున్నాయి. దీంతో నిర్మాణాలు చేపట్టడం సాధ్యం కాదని కొన్ని సంస్థలు భావిస్తున్నాయి.
మరోవైపు.. పెద్దగా పోటీ ఉంటుందని అమరావతి నిర్మాణాలను చేపట్టేందుకు సంస్థలు ముందుకు వస్తాయని సర్కారు భావించినా.. నిర్మాణ వ్యయాలను పెంచినా.. బిడ్డర్లు ఆశించిన స్థాయిలో ముందుకు రాలేదు. పైగా.. వచ్చిన వారు కూడా ఇక్కడ జలాలు ఊరుతుండడంతో తమ బిడ్లను వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో అమరావతి పనులు కుంటుతున్నాయి. కనీసం ప్రధాన నిర్మాణ పనులకు కూడా బిడ్లు పడడం లేదని సీఆర్ డీఏ అధికారులు చెబుతున్నారు. దీంతో మే వరకు ఇలాంటి పరిస్థితి ఉంటుందని ప్రాధమికంగా అంచనాకు వచ్చేశారు.
This post was last modified on February 22, 2025 2:50 pm
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…
ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచి…
ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…
అదేంటో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు దర్శకుల మార్పు పెద్ద తలనెప్పిగా మారిపోయింది. అయన, కమల్ హాసన్ కలిసి నటించే…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ ఈనెల 23న జరగనుంది. అంటే పది రోజుల్లో ప్రజలు తమ ఓటు ద్వారా ప్రభుత్వాన్ని…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికే మూడు తరాల హీరోలు వచ్చారు. ఆ ఫ్యామిలీ నుంచి…