Political News

బాబు ఫోక‌స్ : అమ‌రావ‌తి ప‌నులు ఎందాకా వ‌చ్చాయ్‌.. ?

రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తి మాట గ‌త ఏడాది డిసెంబ‌రు వ‌ర‌కు రోజూ మీడియాలో వినిపించింది.. క‌నిపించింది. డిసెంబ‌రు మూడో వారంలో ప‌నులు ప్రారంభిస్తున్నార‌ని.. ప‌నులు వ‌డివ‌డిగా ముందుకు సాగి 2027-28 నాటికి రాజ‌ధానికి ఒక రూపం తీసుకువ‌స్తామ‌ని మంత్రి పొంగూరు నారాయ‌ణ ప‌దే ప‌దే చెప్పారు. ఇక‌, జ‌న‌వ‌రి తొలి వారంలో కూడా ఇదే ప్ర‌క‌ట‌న చేశారు. మ‌రోవైపు సీఆర్ డీఏ కూడా.. ప‌నుల‌కు సంబంధించి కాంట్రాక్టు సంస్థ‌ల‌ను ఆహ్వానిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది.

అంతేకాదు.. రోజువారీగా టెండ‌ర్ల‌ను ఆహ్వానించి.. ప‌నులు శ‌ర వేగంగా చేప‌డుతున్నామ‌ని సీఆర్ డీఏ అధికారులు కూడా చెప్పారు. కానీ.. గ‌త 50 రోజులుగా అమ‌రావ‌తి ప్ర‌స్థావ‌న ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఇదే విష‌యంపై చంద్ర‌బాబు తాజాగా ఆరా తీశారు. అస‌లు ఏం జ‌రుగుతోంద‌న్న ప్ర‌శ్న‌తో సంబంధిత అధికారుల‌ను ఆయ‌న ప్ర‌శ్నించారు. అమ‌రావ‌తి ప‌నులు అనుకున్న స‌మ‌యానికి పూర్తి చేయాల‌ని మ‌రోసారి కూడా దిశానిర్దేశం చేసిన‌ట్టు సీఎంవో వ‌ర్గాలు చెబుతున్నాయి.

అయితే.. రెండు ర‌కాల స‌మ‌స్య‌లు ఇప్పుడు అమ‌రావ‌తిని వేధిస్తున్నాయి. 1) 30 అడుగుల్లోనే జ‌లాలు ఊర‌డం. 2) కాంట్రాక్టు సంస్థ‌లు బిడ్ల‌ను వెన‌క్కి తీసుకోవ‌డం. ప్ర‌స్తుతం అమ‌రావ‌తిలో ప‌నులు ప్రారంభించేందుకు ముందుకు వ‌చ్చిన స‌మ‌స్య‌లు.. సాధార‌ణంగా.. నేల‌ను ప‌రీక్షించాయి. దీనిలో పెద్ద స‌మస్య వారిని వెంటాడుతోంది. కేవ‌లం 30 అడుగుల లోతులోనే.. భారీ ఎత్తున జ‌లాలు ఊరుతున్నాయి. దీంతో నిర్మాణాలు చేప‌ట్ట‌డం సాధ్యం కాద‌ని కొన్ని సంస్థ‌లు భావిస్తున్నాయి.

మ‌రోవైపు.. పెద్ద‌గా పోటీ ఉంటుంద‌ని అమ‌రావ‌తి నిర్మాణాల‌ను చేప‌ట్టేందుకు సంస్థ‌లు ముందుకు వ‌స్తాయ‌ని స‌ర్కారు భావించినా.. నిర్మాణ వ్య‌యాల‌ను పెంచినా.. బిడ్డ‌ర్లు ఆశించిన స్థాయిలో ముందుకు రాలేదు. పైగా.. వ‌చ్చిన వారు కూడా ఇక్క‌డ జ‌లాలు ఊరుతుండ‌డంతో త‌మ బిడ్ల‌ను వెన‌క్కి తీసుకుంటున్నారు. దీంతో అమ‌రావ‌తి ప‌నులు కుంటుతున్నాయి. క‌నీసం ప్ర‌ధాన నిర్మాణ ప‌నుల‌కు కూడా బిడ్లు ప‌డ‌డం లేద‌ని సీఆర్ డీఏ అధికారులు చెబుతున్నారు. దీంతో మే వ‌ర‌కు ఇలాంటి ప‌రిస్థితి ఉంటుంద‌ని ప్రాధ‌మికంగా అంచ‌నాకు వ‌చ్చేశారు.

This post was last modified on February 22, 2025 2:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇండియా విడిచిపోండి.. వాట్సాప్‌కు సుప్రీం గట్టి హెచ్చరిక

మెటా (Meta) ప్రస్తుతం అందరికీ పరిచయం ఉన్న పేరు. వాట్సాప్ ఈ సంస్థకు చెందినదనే విషయం తెలిసిందే. అయితే భారత్‌లో…

21 minutes ago

‘పోలీసులను పక్కనబెట్టి టీడీపీ, వైసీపీ తేల్చుకుందామా?’

వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కొంతకాలంగా మీడియాకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.…

2 hours ago

మైకేల్ జాక్సన్ బయోపిక్ ట్రైలర్… రికార్డులు సాధ్యమా?

​వరల్డ్ మ్యూజిక్ ఐకాన్ మైకేల్ జాక్సన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 'మైకేల్' ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయ్యింది. ఆంటోనీ ఫుక్వా…

3 hours ago

గోల్డెన్ ఫిష్ మాట తప్పడం మంచిదే

ఆ మధ్య డెకాయిట్ టీజర్ లాంచ్ జరిగినప్పుడు పోటీ గురించి ప్రస్తావిస్తూ అడివి శేష్ ఒక మాట అనడం అభిమానులకు…

4 hours ago

వేసవి సినిమాల పాటల జోరు… ఆగకుండా సాగాలి

సమ్మర్ లక్ష్యంగా పెట్టుకున్న పెద్ద సినిమాల విడుదల తేదీ విషయంలో క్లారిటీ లేక అభిమానులు తెగ వర్రీ అవుతున్నారు. పెద్ది,…

4 hours ago

నిజాయితీకి సూపర్ స్టార్ సలాం.. పద్మకు రజినీ స్పెషల్ గిఫ్ట్!

నేటి రోజుల్లో రూపాయి చేయిజారి కింద పడితేనే వెనక్కి ఇచ్చేవాళ్లు అరుదుగా కనిపిస్తున్నారు. అలాంటిది ఏకంగా రూ.45 లక్షల విలువైన…

5 hours ago