రాష్ట్ర రాజధాని అమరావతి మాట గత ఏడాది డిసెంబరు వరకు రోజూ మీడియాలో వినిపించింది.. కనిపించింది. డిసెంబరు మూడో వారంలో పనులు ప్రారంభిస్తున్నారని.. పనులు వడివడిగా ముందుకు సాగి 2027-28 నాటికి రాజధానికి ఒక రూపం తీసుకువస్తామని మంత్రి పొంగూరు నారాయణ పదే పదే చెప్పారు. ఇక, జనవరి తొలి వారంలో కూడా ఇదే ప్రకటన చేశారు. మరోవైపు సీఆర్ డీఏ కూడా.. పనులకు సంబంధించి కాంట్రాక్టు సంస్థలను ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించింది.
అంతేకాదు.. రోజువారీగా టెండర్లను ఆహ్వానించి.. పనులు శర వేగంగా చేపడుతున్నామని సీఆర్ డీఏ అధికారులు కూడా చెప్పారు. కానీ.. గత 50 రోజులుగా అమరావతి ప్రస్థావన ఎక్కడా కనిపించడం లేదు. ఇదే విషయంపై చంద్రబాబు తాజాగా ఆరా తీశారు. అసలు ఏం జరుగుతోందన్న ప్రశ్నతో సంబంధిత అధికారులను ఆయన ప్రశ్నించారు. అమరావతి పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయాలని మరోసారి కూడా దిశానిర్దేశం చేసినట్టు సీఎంవో వర్గాలు చెబుతున్నాయి.
అయితే.. రెండు రకాల సమస్యలు ఇప్పుడు అమరావతిని వేధిస్తున్నాయి. 1) 30 అడుగుల్లోనే జలాలు ఊరడం. 2) కాంట్రాక్టు సంస్థలు బిడ్లను వెనక్కి తీసుకోవడం. ప్రస్తుతం అమరావతిలో పనులు ప్రారంభించేందుకు ముందుకు వచ్చిన సమస్యలు.. సాధారణంగా.. నేలను పరీక్షించాయి. దీనిలో పెద్ద సమస్య వారిని వెంటాడుతోంది. కేవలం 30 అడుగుల లోతులోనే.. భారీ ఎత్తున జలాలు ఊరుతున్నాయి. దీంతో నిర్మాణాలు చేపట్టడం సాధ్యం కాదని కొన్ని సంస్థలు భావిస్తున్నాయి.
మరోవైపు.. పెద్దగా పోటీ ఉంటుందని అమరావతి నిర్మాణాలను చేపట్టేందుకు సంస్థలు ముందుకు వస్తాయని సర్కారు భావించినా.. నిర్మాణ వ్యయాలను పెంచినా.. బిడ్డర్లు ఆశించిన స్థాయిలో ముందుకు రాలేదు. పైగా.. వచ్చిన వారు కూడా ఇక్కడ జలాలు ఊరుతుండడంతో తమ బిడ్లను వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో అమరావతి పనులు కుంటుతున్నాయి. కనీసం ప్రధాన నిర్మాణ పనులకు కూడా బిడ్లు పడడం లేదని సీఆర్ డీఏ అధికారులు చెబుతున్నారు. దీంతో మే వరకు ఇలాంటి పరిస్థితి ఉంటుందని ప్రాధమికంగా అంచనాకు వచ్చేశారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…
జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…
ఏపీలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందని.. మళ్లీ మళ్లీ ప్రభుత్వం మారే పరిస్థితి కూడా ఉండదని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఆ…
పెద్ది హడావిడి అయిపోతోంది. మూడో వారంలో అడుగు పెట్టబోతున్న తరుణంలో బుకింగ్స్ బానే ఉన్నాయి కానీ కలెక్షన్ల పరంగా మరీ…