రాష్ట్ర రాజధాని అమరావతి మాట గత ఏడాది డిసెంబరు వరకు రోజూ మీడియాలో వినిపించింది.. కనిపించింది. డిసెంబరు మూడో వారంలో పనులు ప్రారంభిస్తున్నారని.. పనులు వడివడిగా ముందుకు సాగి 2027-28 నాటికి రాజధానికి ఒక రూపం తీసుకువస్తామని మంత్రి పొంగూరు నారాయణ పదే పదే చెప్పారు. ఇక, జనవరి తొలి వారంలో కూడా ఇదే ప్రకటన చేశారు. మరోవైపు సీఆర్ డీఏ కూడా.. పనులకు సంబంధించి కాంట్రాక్టు సంస్థలను ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించింది.
అంతేకాదు.. రోజువారీగా టెండర్లను ఆహ్వానించి.. పనులు శర వేగంగా చేపడుతున్నామని సీఆర్ డీఏ అధికారులు కూడా చెప్పారు. కానీ.. గత 50 రోజులుగా అమరావతి ప్రస్థావన ఎక్కడా కనిపించడం లేదు. ఇదే విషయంపై చంద్రబాబు తాజాగా ఆరా తీశారు. అసలు ఏం జరుగుతోందన్న ప్రశ్నతో సంబంధిత అధికారులను ఆయన ప్రశ్నించారు. అమరావతి పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయాలని మరోసారి కూడా దిశానిర్దేశం చేసినట్టు సీఎంవో వర్గాలు చెబుతున్నాయి.
అయితే.. రెండు రకాల సమస్యలు ఇప్పుడు అమరావతిని వేధిస్తున్నాయి. 1) 30 అడుగుల్లోనే జలాలు ఊరడం. 2) కాంట్రాక్టు సంస్థలు బిడ్లను వెనక్కి తీసుకోవడం. ప్రస్తుతం అమరావతిలో పనులు ప్రారంభించేందుకు ముందుకు వచ్చిన సమస్యలు.. సాధారణంగా.. నేలను పరీక్షించాయి. దీనిలో పెద్ద సమస్య వారిని వెంటాడుతోంది. కేవలం 30 అడుగుల లోతులోనే.. భారీ ఎత్తున జలాలు ఊరుతున్నాయి. దీంతో నిర్మాణాలు చేపట్టడం సాధ్యం కాదని కొన్ని సంస్థలు భావిస్తున్నాయి.
మరోవైపు.. పెద్దగా పోటీ ఉంటుందని అమరావతి నిర్మాణాలను చేపట్టేందుకు సంస్థలు ముందుకు వస్తాయని సర్కారు భావించినా.. నిర్మాణ వ్యయాలను పెంచినా.. బిడ్డర్లు ఆశించిన స్థాయిలో ముందుకు రాలేదు. పైగా.. వచ్చిన వారు కూడా ఇక్కడ జలాలు ఊరుతుండడంతో తమ బిడ్లను వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో అమరావతి పనులు కుంటుతున్నాయి. కనీసం ప్రధాన నిర్మాణ పనులకు కూడా బిడ్లు పడడం లేదని సీఆర్ డీఏ అధికారులు చెబుతున్నారు. దీంతో మే వరకు ఇలాంటి పరిస్థితి ఉంటుందని ప్రాధమికంగా అంచనాకు వచ్చేశారు.
This post was last modified on February 22, 2025 2:50 pm
గత ఏడాది ప్రతిష్ఠాత్మకంగా గద్దర్ అవార్డులను మొదలుపెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. ఒకేసారి చాలా ఏళ్లకు కలిపి అవార్డులు ప్రకటించిన సంగతి…
దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…