ప్రజాస్వామ్యం అన్నాక.. ఐదేళ్లకోమారు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో… అధికారంలో ఉండే పార్టీలు మారుతూ ఉంటాయి. అయినంత మాత్రాన గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను కొత్త ప్రభుత్వాలు రద్దు చేసుకుంటూ పోలేవు కదా. తమ వైరి వర్గాలు తీసుకున్న నిర్ణయాలను కొన్ని సార్లు అమలు చేయక తప్పదు కూడా. ఆ పాత నిర్ణయాలు తప్పు అయినా…ఒప్పు అయినా కూడా కొన్ని సార్లు సర్దుకుపోక తప్పదు. ఇది అన్ని సందర్భాల్లో కుదరకపోవచ్చు. కొన్ని సందర్భాల్లోనే కుదరొచ్చు. ఇప్పుడు ఏపీలో అదే జరుగుతోంది. వైసీపీ పాలనలో జగన్ సర్కారు తీసుకున్న ఓ నిర్ణయాన్ని కూటమి పాలనలో చంద్రబాబు సర్కారు అమలు చేసి తీరక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.
సౌర విద్యుత్ కొనుగోలుకు సంబంధించి జగన్ సర్కారు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో చేసుకున్న ఒప్పందంపై ఓ రేంజిలో రచ్చ సాగిన సంగతి తెలిసిందే. ఏపీ ఒప్పందం సెకీతోనే అయినా… కొనుగోలు చేసేది మాత్రం అదానీ గ్రూప్ నకు చెందిన కరెంటునే యకొనుగోలు చేస్తున్నారని, అదానీ నుంచి లంచాలు తీసుకునే ఈ ఒప్పందం కుదుర్చుకున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. అదే సమయంలో ఈ తరహా ఒప్పందాల కోసం ఏకంగా అదానీ అమెరికా మదుపరుల నుంచి సేకరించిన నిధులను లంచాలుగా వినియోగించారంటూ ఆ దేశ కోర్టుల్లోనూ కేసు నమోదు అయిన వైనం మరింత సంచలనం రేకెత్తించింది. మొత్తంగా సెకీతో ఏపీ కుదుర్చుకున్న ఒప్పందాలు రద్దు అయిపోతాయేమోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఆ అనుమానాలన్నీ పటాపంచలు అయ్యాయి. జగన్ హయాంలో కుదిరిన ఒప్పందం మేరకే చంద్రబాబు సర్కారు సౌర విద్యుత్ ను అదానీ సంస్థల నుంచి కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధం అయిపోయింది.
ఈ మేరకు సెకీతో ఏపీ ఒప్పందాలపై లెక్క్లలేనన్ని ఫిర్యాదులు రాగా..వాటిపై ఏపీ విద్యుత్ నియంత్రణా మండలి (ఏపీఈఆర్సీ) విచారణ చేపట్టింది. గతంలోనూ ఏపీఈఆర్సీ నిబంధనల మేరకే ఈ ఒప్పందాలు జరిగాయి. అయినా కూడా ఆరోఫణలు రాగా ఏపీఈఆర్సీ మరోమారు ఈ ఒప్పందాలపై విచారణ చేపట్టింది. ఈ విచారణలో ఎలాంటి అక్రమాలు జరగలేదని తేలింది. గతంలో ఎన్నడూ లేనంత తక్కువ ధరకే గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకుందని తేల్చింది. అంతర్రాష్ట్ర రవాణా చార్జీలు కూడా లేని ఈ ఒప్పందాల వల్ల రాష్ట్రానికి లాభమే తప్పించి…లేశమాత్రం కూడా నష్టం లేదని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో ఈ ఒప్పందాల మేరకు సౌర విద్యుత్ ను సెకీ ద్వారా అదానీ నుంచి కొనుగోలు చేయవచ్చంటూ తెలిపింది. ఏపీఈఆర్సీ తీర్పుతో ఈ ఏడాది సెకీ నుంచి ఏకంగా 4 వేల మెగావాట్ల విద్యుత్ ను ఏపీ కొనుగోలు చేయనుంది.
This post was last modified on February 22, 2025 11:12 am
రాజస్థాన్ రాయల్స్ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ టీమ్ ఇండియా ఎంట్రీపై వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర…
ఈ శుక్రవారం విడుదల కాబోతున్న రాకాస మీద టీమ్ మొత్తం ప్రాణాలు పెట్టేసుకుంది. నిర్మాత నీహారిక కొణిదెల చాలా యాక్టివ్…
బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు ఒక కొత్త గాలి వీస్తోంది. రణ్బీర్ కపూర్ ‘యానిమల్’తో సెన్సేషన్ క్రియేట్ చేస్తే, రీసెంట్…
మార్చి నెలలో దురంధర్ ది రివెంజ్ కనక ఆదుకోకపోయి ఉంటే తెలుగు రాష్ట్రాల థియేటర్ల పరిస్థితి మరింత అన్యాయంగా ఉండేది.…
తెలుగు రాష్ట్రాల మధ్య మరోమారు నీటి పంచాయతీ నెలకొంది. ఈ సందర్భంగా ఏపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు…
ఇరాన్ తో మనకున్న బంధం.. అనుబంధం చాలా కీలకమైనదని.. మన స్నేహం దశాబ్దాల తరబడి సాగుతోందని చెప్పే మాటలకు.. చేతలకు…