Political News

జగన్ సేకరించిన దాన్నే… బాబు కొంటున్నారు

ప్రజాస్వామ్యం అన్నాక.. ఐదేళ్లకోమారు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో… అధికారంలో ఉండే పార్టీలు మారుతూ ఉంటాయి. అయినంత మాత్రాన గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను కొత్త ప్రభుత్వాలు రద్దు చేసుకుంటూ పోలేవు కదా. తమ వైరి వర్గాలు తీసుకున్న నిర్ణయాలను కొన్ని సార్లు అమలు చేయక తప్పదు కూడా. ఆ పాత నిర్ణయాలు తప్పు అయినా…ఒప్పు అయినా కూడా కొన్ని సార్లు సర్దుకుపోక తప్పదు. ఇది అన్ని సందర్భాల్లో కుదరకపోవచ్చు. కొన్ని సందర్భాల్లోనే కుదరొచ్చు. ఇప్పుడు ఏపీలో అదే జరుగుతోంది. వైసీపీ పాలనలో జగన్ సర్కారు తీసుకున్న ఓ నిర్ణయాన్ని కూటమి పాలనలో చంద్రబాబు సర్కారు అమలు చేసి తీరక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.

సౌర విద్యుత్ కొనుగోలుకు సంబంధించి జగన్ సర్కారు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో చేసుకున్న ఒప్పందంపై ఓ రేంజిలో రచ్చ సాగిన సంగతి తెలిసిందే. ఏపీ ఒప్పందం సెకీతోనే అయినా… కొనుగోలు చేసేది మాత్రం అదానీ గ్రూప్ నకు చెందిన కరెంటునే యకొనుగోలు చేస్తున్నారని, అదానీ నుంచి లంచాలు తీసుకునే ఈ ఒప్పందం కుదుర్చుకున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. అదే సమయంలో ఈ తరహా ఒప్పందాల కోసం ఏకంగా అదానీ అమెరికా మదుపరుల నుంచి సేకరించిన నిధులను లంచాలుగా వినియోగించారంటూ ఆ దేశ కోర్టుల్లోనూ కేసు నమోదు అయిన వైనం మరింత సంచలనం రేకెత్తించింది. మొత్తంగా సెకీతో ఏపీ కుదుర్చుకున్న ఒప్పందాలు రద్దు అయిపోతాయేమోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఆ అనుమానాలన్నీ పటాపంచలు అయ్యాయి. జగన్ హయాంలో కుదిరిన ఒప్పందం మేరకే చంద్రబాబు సర్కారు సౌర విద్యుత్ ను అదానీ సంస్థల నుంచి కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధం అయిపోయింది.

ఈ మేరకు సెకీతో ఏపీ ఒప్పందాలపై లెక్క్లలేనన్ని ఫిర్యాదులు రాగా..వాటిపై ఏపీ విద్యుత్ నియంత్రణా మండలి (ఏపీఈఆర్సీ) విచారణ చేపట్టింది. గతంలోనూ ఏపీఈఆర్సీ నిబంధనల మేరకే ఈ ఒప్పందాలు జరిగాయి. అయినా కూడా ఆరోఫణలు రాగా ఏపీఈఆర్సీ మరోమారు ఈ ఒప్పందాలపై విచారణ చేపట్టింది. ఈ విచారణలో ఎలాంటి అక్రమాలు జరగలేదని తేలింది. గతంలో ఎన్నడూ లేనంత తక్కువ ధరకే గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకుందని తేల్చింది. అంతర్రాష్ట్ర రవాణా చార్జీలు కూడా లేని ఈ ఒప్పందాల వల్ల రాష్ట్రానికి లాభమే తప్పించి…లేశమాత్రం కూడా నష్టం లేదని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో ఈ ఒప్పందాల మేరకు సౌర విద్యుత్ ను సెకీ ద్వారా అదానీ నుంచి కొనుగోలు చేయవచ్చంటూ తెలిపింది. ఏపీఈఆర్సీ తీర్పుతో ఈ ఏడాది సెకీ నుంచి ఏకంగా 4 వేల మెగావాట్ల విద్యుత్ ను ఏపీ కొనుగోలు చేయనుంది.

This post was last modified on February 22, 2025 11:12 am

Share

Recent Posts

య‌శ్‌ను భ‌య‌పెట్టేసిన మ‌ల్లారెడ్డి

మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెర‌వాల్సిందే. అది రాజ‌కీయ స‌భ అయినా.. సినిమా…

1 hour ago

అక్కడ ఒక్కో కోతి 25 లక్షలు

మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…

2 hours ago

చిరు బ‌ర్త్ డే… ట్రెండింగ్ లో మాత్రం బన్నీ..

అల్లు అర్జున్ అంటే ఒక‌ప్పుడు మెగా హీరోల్లో ఒక‌డు. అత‌ను మెగాస్టార్ చిరంజీవినో, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌నో పొగిడితేనో..…

2 hours ago

విశ్వనాథ్ తట్టుకుని నిలవడం విశేషమే

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇరుముడి తప్ప మరొక మాట వినిపించదేమో అన్న రేంజ్ లో వసూళ్లు హోరెత్తిపోతున్నాయి. ఈ జోరు…

2 hours ago

2000 కోట్లు అంటే చాలా పెద్ద స్టేట్‌మెంట్

ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ మల్లారెడ్డి యునివర్సిటిలో ఘనంగా జరిగింది. తెలుగు…

3 hours ago

చిరు అభిమానుల‌కు కొడాలి నాని వ‌ల‌

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత‌ల్లో ఒక‌రైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జ‌న‌సేన అన్నా ఎంత కోప‌మో ప్ర‌త్యేకంగా…

4 hours ago