Political News

సీఎం హోదాలో కోర్టుకు హాజరైన రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గురువారం ఓ కోర్టు విచారణకు హాజరయ్యారు. సాధారణంగా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నేతలు కోర్టు విచారణలకు హాజరయ్యే విషయంలో పెద్దగా ఆసక్తి చూపరు. ప్రభుత్వ పాలనలో క్షణం తీరిక లేకుండా ఉన్నామని, విచారణకు తమకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఉంటారు. అందుకు కోర్టులు కూడా సరేనంటూ అనుమతి ఇస్తూ ఉంటాయి కూడా. అయితే అందుకు భిన్నంగా వ్యవహరించిన రేవంత్ రెడ్డి గురువారం నాంపల్లిలోని ప్రత్యేక కోర్టుకు స్వయంగా హాజరయ్యారు. రేవంత్ విచారణకు హాజరు కాగా… న్యాయమూర్తి సదరు కేసు తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేశారు. దీంతో రేవంత్ తిరిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

మొన్నటి సార్వత్రిక ఎన్నికల సమయంలో సీఎంగా ఉన్నా కూడా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగానూ రేవంత్ వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ దేశవ్యాప్తంగా రిజర్వేషన్లను ఎత్తివేసే దిశగా చర్యలు తీసుకోనుందని టీపీసీసీ ఓ వీడియో విడుదల చేసింది. ఈ వీడియోపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. హైదరాబాద్, నల్లగొండల్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుల ఆధారంగా రేవంత్ పై కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల విచారణ నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులో జరుగుతోంది. గత విచారణ సందర్భంగా రేవంత్ తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కోర్టు ఆదేశాల మేరకు గురువారం సాయంత్రం రేవంత్ నేరుగా నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు వచ్చారు. రేవంత్ తో పాటు ఈ కేసులో నిందితుడిగా ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కోర్టుకు హాజరయ్యారు. సీఎం కోర్టు విచారణకు వస్తున్న నేపథ్యంలో నాంపల్లి కోర్టు ప్రాంగణం… అక్కడి పరిసరాల్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కోర్టు విచారణకు రేవంత్, ఉత్తమ్ హాజరయ్యారు. విచారణను కోర్టు వాయిదా వేయడంతో స్వల్ప వ్యవధిలోనే రేవంత్ అక్కడి నుంచి తిరుగు పయనమయ్యారు. సీఎం హోదాలో ఉండి… వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరే వీలు ఉండి కూడా వాటినేమీ వినియోగించుకోకుండా రేవంత్ కోర్టు విచారణకు హాజరు కావడం గమనార్హం.

This post was last modified on February 21, 2025 2:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ హీరోయిన్ ను ఎందుకు తీసేసారో లీక్ చేసిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’లో ప్రగ్యా జైశ్వాల్  కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.…

8 minutes ago

టికెట్ రేట్లలో పెంచిన 100 రూపాయల్లో నిర్మాతకి వచ్చేది అంతేనా?

తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల పెంపు గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. ఆల్రెడీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెరుగుతున్న…

33 minutes ago

ఇళయరాజా పోరాటం… వేరొకరికి ఆదాయం

తన పాటల కాపీ రైట్స్ విషయంలో ఇళయరాజా చేస్తున్న పోరాటం మరొకరికి ఆదాయం అవుతోంది. అదెలాగో చూడండి. ఇంతకు ముందు…

1 hour ago

దొంగకే దెబ్బ… ChatGPTతో చుక్కలు చూపించిన కుర్రాడు

సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కానీ ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి మాత్రం తన తెలివితేటలతో ఒక స్కామర్‌ని…

1 hour ago

సాయిపల్లవి నిర్ణయాలు అందుకే ఆలస్యం

గ్లామర్ షో చేయకుండా నటననే నమ్ముకుని హీరోయిన్ గా నెగ్గుకురావడం చాలా కష్టం. రెగ్యులర్ పాత్రలకు దూరంగా ఉంటానంటే కెరీర్…

2 hours ago

కొంప ముంచిన ఇండిగో స్ట్రాటజీ

హైదరాబాద్, బెంగళూరు ఎయిర్‌పోర్టుల్లో సీన్ చూస్తే గందరగోళంగా ఉంది. ప్యాసింజర్లు గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు, ఇండిగో కౌంటర్ల ముందు…

3 hours ago