తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గురువారం ఓ కోర్టు విచారణకు హాజరయ్యారు. సాధారణంగా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నేతలు కోర్టు విచారణలకు హాజరయ్యే విషయంలో పెద్దగా ఆసక్తి చూపరు. ప్రభుత్వ పాలనలో క్షణం తీరిక లేకుండా ఉన్నామని, విచారణకు తమకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఉంటారు. అందుకు కోర్టులు కూడా సరేనంటూ అనుమతి ఇస్తూ ఉంటాయి కూడా. అయితే అందుకు భిన్నంగా వ్యవహరించిన రేవంత్ రెడ్డి గురువారం నాంపల్లిలోని ప్రత్యేక కోర్టుకు స్వయంగా హాజరయ్యారు. రేవంత్ విచారణకు హాజరు కాగా… న్యాయమూర్తి సదరు కేసు తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేశారు. దీంతో రేవంత్ తిరిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మొన్నటి సార్వత్రిక ఎన్నికల సమయంలో సీఎంగా ఉన్నా కూడా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగానూ రేవంత్ వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ దేశవ్యాప్తంగా రిజర్వేషన్లను ఎత్తివేసే దిశగా చర్యలు తీసుకోనుందని టీపీసీసీ ఓ వీడియో విడుదల చేసింది. ఈ వీడియోపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. హైదరాబాద్, నల్లగొండల్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుల ఆధారంగా రేవంత్ పై కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల విచారణ నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులో జరుగుతోంది. గత విచారణ సందర్భంగా రేవంత్ తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కోర్టు ఆదేశాల మేరకు గురువారం సాయంత్రం రేవంత్ నేరుగా నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు వచ్చారు. రేవంత్ తో పాటు ఈ కేసులో నిందితుడిగా ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కోర్టుకు హాజరయ్యారు. సీఎం కోర్టు విచారణకు వస్తున్న నేపథ్యంలో నాంపల్లి కోర్టు ప్రాంగణం… అక్కడి పరిసరాల్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కోర్టు విచారణకు రేవంత్, ఉత్తమ్ హాజరయ్యారు. విచారణను కోర్టు వాయిదా వేయడంతో స్వల్ప వ్యవధిలోనే రేవంత్ అక్కడి నుంచి తిరుగు పయనమయ్యారు. సీఎం హోదాలో ఉండి… వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరే వీలు ఉండి కూడా వాటినేమీ వినియోగించుకోకుండా రేవంత్ కోర్టు విచారణకు హాజరు కావడం గమనార్హం.
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…
టాలీవుడ్ లో హీరోల సినిమాల వసూళ్ల మీద సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరగడం ఎప్పటినుంచో చూస్తున్నాం. అయితే ఇప్పుడు…
వచ్చే మూడేళ్లలో తానేంటో చూపిస్తానని.. వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…
ఏదైనా థియేటర్ వెళ్ళినప్పుడు సినిమా ప్రారంభానికి ముందు జనాన్ని ఇబ్బంది పెడుతున్నవి స్మోకింగ్ యాడ్సే. వాటి వెనుక మంచి ఉద్దేశం…