తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గురువారం ఓ కోర్టు విచారణకు హాజరయ్యారు. సాధారణంగా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నేతలు కోర్టు విచారణలకు హాజరయ్యే విషయంలో పెద్దగా ఆసక్తి చూపరు. ప్రభుత్వ పాలనలో క్షణం తీరిక లేకుండా ఉన్నామని, విచారణకు తమకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఉంటారు. అందుకు కోర్టులు కూడా సరేనంటూ అనుమతి ఇస్తూ ఉంటాయి కూడా. అయితే అందుకు భిన్నంగా వ్యవహరించిన రేవంత్ రెడ్డి గురువారం నాంపల్లిలోని ప్రత్యేక కోర్టుకు స్వయంగా హాజరయ్యారు. రేవంత్ విచారణకు హాజరు కాగా… న్యాయమూర్తి సదరు కేసు తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేశారు. దీంతో రేవంత్ తిరిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మొన్నటి సార్వత్రిక ఎన్నికల సమయంలో సీఎంగా ఉన్నా కూడా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగానూ రేవంత్ వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ దేశవ్యాప్తంగా రిజర్వేషన్లను ఎత్తివేసే దిశగా చర్యలు తీసుకోనుందని టీపీసీసీ ఓ వీడియో విడుదల చేసింది. ఈ వీడియోపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. హైదరాబాద్, నల్లగొండల్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుల ఆధారంగా రేవంత్ పై కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల విచారణ నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులో జరుగుతోంది. గత విచారణ సందర్భంగా రేవంత్ తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కోర్టు ఆదేశాల మేరకు గురువారం సాయంత్రం రేవంత్ నేరుగా నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు వచ్చారు. రేవంత్ తో పాటు ఈ కేసులో నిందితుడిగా ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కోర్టుకు హాజరయ్యారు. సీఎం కోర్టు విచారణకు వస్తున్న నేపథ్యంలో నాంపల్లి కోర్టు ప్రాంగణం… అక్కడి పరిసరాల్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కోర్టు విచారణకు రేవంత్, ఉత్తమ్ హాజరయ్యారు. విచారణను కోర్టు వాయిదా వేయడంతో స్వల్ప వ్యవధిలోనే రేవంత్ అక్కడి నుంచి తిరుగు పయనమయ్యారు. సీఎం హోదాలో ఉండి… వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరే వీలు ఉండి కూడా వాటినేమీ వినియోగించుకోకుండా రేవంత్ కోర్టు విచారణకు హాజరు కావడం గమనార్హం.
This post was last modified on February 21, 2025 2:20 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…