తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గురువారం ఓ కోర్టు విచారణకు హాజరయ్యారు. సాధారణంగా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నేతలు కోర్టు విచారణలకు హాజరయ్యే విషయంలో పెద్దగా ఆసక్తి చూపరు. ప్రభుత్వ పాలనలో క్షణం తీరిక లేకుండా ఉన్నామని, విచారణకు తమకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఉంటారు. అందుకు కోర్టులు కూడా సరేనంటూ అనుమతి ఇస్తూ ఉంటాయి కూడా. అయితే అందుకు భిన్నంగా వ్యవహరించిన రేవంత్ రెడ్డి గురువారం నాంపల్లిలోని ప్రత్యేక కోర్టుకు స్వయంగా హాజరయ్యారు. రేవంత్ విచారణకు హాజరు కాగా… న్యాయమూర్తి సదరు కేసు తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేశారు. దీంతో రేవంత్ తిరిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మొన్నటి సార్వత్రిక ఎన్నికల సమయంలో సీఎంగా ఉన్నా కూడా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగానూ రేవంత్ వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ దేశవ్యాప్తంగా రిజర్వేషన్లను ఎత్తివేసే దిశగా చర్యలు తీసుకోనుందని టీపీసీసీ ఓ వీడియో విడుదల చేసింది. ఈ వీడియోపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. హైదరాబాద్, నల్లగొండల్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుల ఆధారంగా రేవంత్ పై కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల విచారణ నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులో జరుగుతోంది. గత విచారణ సందర్భంగా రేవంత్ తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కోర్టు ఆదేశాల మేరకు గురువారం సాయంత్రం రేవంత్ నేరుగా నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు వచ్చారు. రేవంత్ తో పాటు ఈ కేసులో నిందితుడిగా ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కోర్టుకు హాజరయ్యారు. సీఎం కోర్టు విచారణకు వస్తున్న నేపథ్యంలో నాంపల్లి కోర్టు ప్రాంగణం… అక్కడి పరిసరాల్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కోర్టు విచారణకు రేవంత్, ఉత్తమ్ హాజరయ్యారు. విచారణను కోర్టు వాయిదా వేయడంతో స్వల్ప వ్యవధిలోనే రేవంత్ అక్కడి నుంచి తిరుగు పయనమయ్యారు. సీఎం హోదాలో ఉండి… వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరే వీలు ఉండి కూడా వాటినేమీ వినియోగించుకోకుండా రేవంత్ కోర్టు విచారణకు హాజరు కావడం గమనార్హం.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…