Political News

గురు శిష్యుల మ‌ధ్య జ‌ల జ‌గ‌డం.. రేవంత్ దూకుడు.. !

మ‌రో రెండు మాసాల్లో(మే నుంచి) వేసవి కాలం ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో నీటి అవ‌స‌రం ఎంత ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. మ‌రీ ముఖ్యంగా క‌రువు ప్రాంతాల్లో సాగు, తాగు నీటికి ఎద్ద‌డి మ‌రింత పెరుగుతుంది. ఈ నేప‌థ్యాన్ని పుర‌స్క‌రించుకుని రెండు తెలుగు రాష్ట్రాలు ముందుగానే అలర్టు కావ‌డం తెలిసిందే. తాజాగా ఈ విష‌యంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మ‌రింత దూకుడుగా ఉన్నారు. అవ‌స‌రమైతే.. ఏపీతో అమీ తుమీ తేల్చుకునేందుకు సిద్ధ‌మ‌ని ఆయ‌న ప‌రోక్షంగా తేల్చి చెప్పారు. ఇదే జ‌రిగితే.. ఏపీ సీఎం చంద్ర‌బాబుకు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మ‌ధ్య జ‌ల జ‌గ‌డం మ‌రింత పెర‌గ‌నుంది.

కేంద్రంలో కూట‌మిగా ఉన్న టీడీపీ స‌ర్కారుకు.. జ‌లాల విష‌యంలో కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం స‌హ‌క‌రిస్తోంద‌న్న వాద‌న ఆది నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఈ క్ర‌మంలో వ‌చ్చే వేస‌విలో నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టు పంటలు, నీటి విడుదలపై ఆయా జిల్లాల కలెక్టర్లకు విశేష అధికారాలు ఇచ్చారు. ప్రాజెక్టులు, కాల్వలు, ఆయకట్టులో పంటలు, నీటి విడుదల విష‌యంలో ఏపీతో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని చెప్ప‌డం ద్వారా.. ఏపీ సీఎం చంద్ర‌బాబు తీసుకునే ఏ నిర్ణ‌యంపైనైనా పోరు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని ఆయ‌న చెప్ప‌క‌నే చెప్పారు.

టెలిమెట్రీకి సై!

వాస్త‌వానికి ఇరు రాష్ట్రాల మ‌ధ్య విభ‌జ‌న త‌ర్వాత జ‌ల వివాదాలు కొత్త కాదు. గ‌తంలో కేసీఆర్‌, జ‌గ‌న్‌ల మ‌ధ్య రాజ‌కీయంగా అవ‌గాహ‌న ఉన్న‌ప్ప‌టికీ.. జ‌లాల విష‌యంలో వారు రాజీప‌డ‌ని ధోర‌ణిలోనే ముందుకు సాగారు. ఇక‌, ఇప్పుడు చంద్ర‌బాబుకు.. రేవంత్ కావాల్సిన మ‌నిషే అయినా.. త‌న శిష్యుడేన‌ని ఆయ‌న భావించినా.. నీటి విష‌యంలో ఎక్క‌డా రాజీ ధోర‌ణిలేకుండా రేవంత్ ముందుకు సాగుతున్నారు. ఈ క్ర‌మంలోనే రానున్న 3 నెలలు అత్యంత కీలకమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చొరవ తీసుకునేలా కలెక్టర్లను ఆదేశించారు. త‌ద్వారా.. చుక్క‌నీటిని కూడా వ‌దులు కోకుండా..రేవంత్ వేస్తున్న వ్యూహానికి చంద్ర‌బాబు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో చూడాలి.

ఏం ఆశిస్తున్నారు?

  • శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి కృష్ణా జలాలను వినియోగించుకునే విషయంలో ఏపీ వాటా మాత్ర‌మే వినియోగించుకునేలా అప్రమత్తంగా ఉండ‌డం.
  • ఆయా జ‌లాల్లో నిర్ణీత కోటా కంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీటిని తరలించకుండా అడ్డుకట్ట వేయ‌డం.
  • దీనికి గాను టెలిమెట్రీ విధానం అమలుకు రెడీ కావ‌డం. అవ‌స‌ర‌మైతే.. నిధులను కూడా భారీగా ఖ‌ర్చు చేయ‌డం.
  • టెలీమెట్రీ అమలుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కేఆర్ఎంబీకి లేఖ రాయడం.
  • నీటి వాటాల పంపిణీ, నీటి వాటాల వినియోగాన్ని లెక్కించే బాధ్యత కేంద్ర జల సంఘంపైనే పెట్ట‌డం ద్వారా ఏపీని క‌ట్ట‌డి చేయ‌డం.
  • నిర్ణీత వాటా కంటే ఏపీ ఎక్కువ నీటిని తరలించకుండా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించేలా ముందుగానే లేఖ‌లు రాయ‌డం. ఫిర్యాదులు కూడా చేయ‌డం.

This post was last modified on February 21, 2025 2:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మైఖేల్ జాక్సన్ మీద ఇంత ప్రేమ ఉందా

ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…

3 hours ago

శ్రీలీల డెబ్యూకి మోక్షం ఎప్పుడో

అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…

4 hours ago

పెయిడ్ ట్వీట్లతో ప్రయోజనమేమి?

చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…

5 hours ago

LSG: ఓనర్ గోయెంకా కోపంలో తప్పు లేదు!

ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…

5 hours ago

తెలుగు టైటిల్స్ నిర్లక్ష్యం చేయకండి

ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…

6 hours ago

క‌విత దూకుడు మామూలుగా లేదు

క‌ల్వ‌కుంట్ల క‌విత‌.. మాజీసీఎం కేసీఆర్ త‌న‌య‌గా.. రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్య‌వ‌హ‌రించారు. ఇక‌, ఆ పార్టీతో…

6 hours ago