Political News

కేసీఆర్ ను అసెంబ్లీ కి రప్పించాలని కోర్టులో పిటిషన్!

ఇటీవల తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే… బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అందరికీ టార్గెట్ గా మారిపోతున్నారు. 2023 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆర్… కామారెడ్డిలో ఓడిపోయారు. అయితే బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఓడిపోవడంతో సీఎంగా కాకుండా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక ఆ తర్వాత ఆయన అసెంబ్లీ ముఖమే చూసింది లేదు. అధికార కాంగ్రెస్, మరో విపక్షం బీజేపీ ఎంతగా వేడుకుంటున్నా కూడా కేసీఆర్ అసెంబ్లీ గడప తొక్కడం లేదు. అసెంబ్లీలో కేసీఆర్ లేని లోటును ఆయన కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీశ్ రావులు పూరిస్తున్నా… కేసీఆర్ ఇంకెంత కాలం అసెంబ్లీకి దూరంగా ఉంటారన్న వాదనలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.

తాజాగా కేసీఆర్ ను అసెంబ్లీకి రప్పించే దిశగా చర్యలు చేపట్టాలంటూ ఏకంగా తెలంగాణ హైకోర్టుకు ఓ అభ్యర్థన వచ్చింది. ఫార్మర్స్ ఫెడరేషన్ పేరిట ఏర్పాటైన ఓ సంస్థ ప్రతినిధి విజయపాల్ రెడ్డి… ఈ మేరకు హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ లో విజయపాల్ రెడ్డి పలు కీలక అంశాలను ప్రస్తావించారు. కేసీఆర్ ను అసెంబ్లీకి అయినా రప్పించండి… లేదంటే ఆయనపై సస్పెన్షన్ వేటు పడేలా అయినా ఆదేశాలు జారీ చేయండి అంటూ తన పిటిషన్ లో ఆయన కోర్టును కోరారు. అయినా ఏడాదికి పైగా కేసీఆర్ అసెంబ్లీ రాకుంటే… ఆయనపై చర్య తీసుకోవాలని స్పీకర్ కు ఎందుకు అనిపించలేదని కూడా రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యేలుగా వేతనాలు తీసుకొంటున్న నేతలు… ప్రజా సమస్యలపై చర్చించేందుకు ఎందుకు ఆసక్తి చూపడం లేదని నిలదీశారు.

విజయపాల్ రెడ్డి పిటిషన్ ను కోర్టు ఇంకా విచారణకు తీసుకోలేదు. ప్రస్తుతం ఈ పిటిషన్ హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. ఈ పిటిషన్ ను హైకోర్డు విచారణకు స్వీకరించినా… స్వీకరించకున్నా కూడా జనంలో నిగూఢంగా నానుతూ వస్తున్న అభిప్రాయాలను అయితే రెడ్డి తన పిటిషన్ ద్వారా బయటకు తీసుకువచ్చారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎంతసేపూ రాజకీయంగా పార్టీలను వృద్ధి చేసుకోవడంపైనే దృష్టి సారిస్తున్న నేతలు.. ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీకి ఎందుకు రారన్న ప్రశ్నలు ఎంతోకాలంగా వినిపిస్తున్నవే. అంతేకాకుండా ప్రజా ప్రతినిధులుగా తమ వేతనాలను ఎప్పటికప్పుడు పెంచుకునేందుకు ఆసక్తి చూపే నేతలు.. ప్రజా సమస్యలపై ఎందుకు దృష్టి సారించరన్న ప్రశ్నలూ చాలాకాలం నుంచి వినిపిస్తున్నవే. ఇన్నేసి ప్రశ్నలు… ఇన్నేసి మార్గాల్లో వినిపిస్తున్నా.. నేతలు ఎంతమాత్రమూ పట్టించుకోకుండా సాగుతున్న తీరును విజయపాల్ రెడ్డి తన పిటిషన్ ద్వారా మరోమారు చర్చకు వచ్చేలా చేశారని చెప్పక తప్పదు.

This post was last modified on February 21, 2025 10:18 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

4 hours ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

4 hours ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

4 hours ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

6 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

7 hours ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

7 hours ago